రూ.500లతో ముంబయిలో అడుగుపెట్టి.. రూ. కోట్లు సంపాదించిన దిశాపటానీ..!
సినిమాల్లో రావడానికి ముందు దిశా పటానీ.. చేతిలో రూ.500లతో ముంబయిలోకి అడుగుపెట్టిందట ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.
బాలీవుడ్ స్టార్ హీరో.. సల్మాన్ ఖాన్ మోస్ట్ వెయిటెడ్ రాధే సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు సినిమాని ఆహా, ఓహో అంటూ పొగిడేస్తుంటే.. కొందరు మాత్రం సినిమా అట్టర్ ప్లాప్ అంటూ జోక్స్ వేసుకుంటున్నారు. ఈ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్ గా దిశా పటానీ నటించారు.
సల్మాన్, దిశ కి మధ్య ఏజ్ గ్యాప్ 27 సంవత్సరాలు ఉండటం గమనార్హం. కాగా.. ఈ సినిమాలో దిశ ది పెద్దగా పాత్ర లేకపోయినప్పటికీ.. ఆమె కనిపించిన ప్రతిసారీ అభిమానులు పండగ చేసుకున్నారు. తన అందాలతో ఆమె ఆకట్టుకున్నారు
కాగా... ఈ సంగతి పక్కన పెడితే.. సినిమాల్లో రావడానికి ముందు దిశా పటానీ.. చేతిలో రూ.500లతో ముంబయిలోకి అడుగుపెట్టిందట ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ.. ఇప్పుడు ఆమె సంపాదన రూ. కోట్లలో ఉంది.
దిశ పటానీ... ఎంఎస్ ధోనీ సినిమాతో తొలిసారి బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. దిశ.. 1993లో జన్మించారు. ఆమె స్వరాష్ట్రం ఉత్తరాఖండ్. దిశ తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. దిశ సోదరి కూడా ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు.
సినిమాల్లో నిలదొక్కునేందుకు తాను తన ఫ్యామిలీ సహాయం తీసుకోలేదని దిశ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. కేవలం చేతిలో రూ.500లతో ముంబయిలో అడుగుపెట్టానని ఆమె చెప్పారు. తనను తాను నిరూపించుకునేందుకు చాలా కష్టపడ్డానని ఆమె చెప్పారు.
నటనలో రాణించడం తన డ్రీమ్ అని.. దాని కోసం తన చదువు కూడా మధ్యలో ఆపేసి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఒక కాలేజీ అమ్మాయి కొత్త సిటీలో ఒంటరిగా బతకడం చాలా కష్టమని.. దానిని తాను ఫేస్ చేశానని ఆమె చెప్పారు. అయినప్పటికీ... తాను ఏ రోజూ డబ్బులు కావాలని ఫ్యామిలీని అడగలేదని పేర్కొన్నారు.
చేతిలో రూపాయిలేని సమయంలోనూ..తాను ప్రతిరోజూ ఆడిషన్స్ కి వెళ్లేదానినని ఆమె చెప్పారు. తనకు పని దొరికితేనే.. ఇంటికి అద్దెకట్టగలనని.. దానికోసమే పని కోసం వెతుకుతూ ఉండేదానిని ఆమె అచెప్పారు. ఎక్కువగా టీవీ యాడ్స్ కి ఆడిషన్స్ వచ్చేవి అని దిశ చెప్పారు.
2017లో దిశ ముంబయిలోని బాంద్రాలో ఓ సొంతిల్లు కొనుక్కోగలిగారు. ఆ ఇంటి ఖరీదు రూ.5కోట్లు కావడం విశేషం.
2015లో తెలుగులో లోఫర్ సినిమాలో దిశ ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించారు. దానికన్నా ముందు కొన్ని టీవీ యాడ్స్ లో నటించారు. ముఖ్యంగా డెయిరీ మిల్క్ యాడ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.
2012లో దిశ బయోటెక్ చదువుతున్న సమయంలో.. మధ్యప్రదేశ్ లో మిస్ పాంటలూన్ కాంపీటీషన్స్ జరుగుతున్నాయట. దాంట్లో పాల్గొనాలి దిశ అనుకుందట. కానీ.. ఆమె తండ్రి, సోదరి చాలా బిజీగా ఉన్నారట. దీంతో..దిశ అన్నీ.. తానే మేనేజ్ చేసుకొని వెళ్లి అందులో పార్టిసిపేట్ చేసి.. చివరకు విజేతగా నిలిచింది.
దిశ పటానీకి రైలు ప్రయాణం అంటే కూడా చాలా ఇష్టమట. ఇప్పుడు సినిమాలలో ఆఫర్లు పెరగడంతో... సంపాదన బాగా పెరిగింది.
ప్రస్తుతం ఆమె వద్ద లగ్జరీ కార్లు చాలా ఉన్నాయట. ఎక్కువగా బీఎండబ్ల్యూ5 సిరీస్ ని వాడతారట. దీని ధర రూ.52లక్షలు.
ఇవే కాకుండా, దిశా దగ్గర జాగ్వార్ ఎఫ్-పేస్ మోడల్ కారు ఉంది, దీని ధర 60 లక్షలు. అదేవిధదంగా రూ. 56 లక్షలు విలువచేసే మెర్సిడెస్ ఇ 220. ఉంది. దిశా పటానీ వద్ద ఆడికారు కూడా ఉంది.