Skin Care: పెరుగులో ఇవి కలిపి ముఖానికి రాస్తే, ఫేషియల్స్ అవసరమే రాదు..!
వయసు పెరుగుతున్నా చర్మాన్ని యవ్వనంగా కనిపించాలంటే పెరుగు బాగా ఉపయోగపడుతుంది. పెరుగులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి. మరి, పెరుగులో ఏం కలిపి రాస్తే, అందంగా పెరుగుతుందో తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
curd face pack
వయసు పెరుగుతున్నా కూడా అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ, వయసు రీత్యా చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖంపై ముడతలు రావడం, కంటి కింద నల్లటి చాయలు వస్తూ ఉంటాయి. వీటి వల్ల ముఖంలో తేజస్సు తగ్గుతుంది. వయసు పెరిగినట్లు కనిపిస్తారు.ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అయితే ముఖం మరింతగా దెబ్బతింటుంది. ఇలా ముఖం దెబ్బతిన్నప్పుడు దాదాపు అందరూ పార్లర్ వెంట పరుగులు తీసి, ముఖానికి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. కానీ, ఫేషియల్స్ అవసరం లేకుండా కేవలం పెరుగుతో అందాన్ని పెంచుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందామా..
పెరుగుతో ముఖ సౌందర్యం పెంచుకునేదెలా?
పెరుగులో ఏముంటాయిలే అని తీసిపారేయకండి.మీ వయసు తగ్గిపోయి, మరింత యవ్వనంగా కనిపించేలా చేయడంలో పెరుగు ముందు వరసలో ఉంటుంది. పెరుగులో చాలా ఉపయోగపడే బ్యాక్టీరియా నిండి ఉంటుంది. అంతేకాదు.. ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, అందాన్ని కూడా పెంచుతాయి. దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. పెరుగులోని యాంటీఆక్సిడెంట్లు పొడి చర్మాన్ని కూడా నయం చేస్తాయి.మీ స్కిన్ చాలా స్మూత్ గా మార్చడానికి సహాయపడతాయి.
పెరుగు, తేనె ఫేస్ ప్యాక్..
పెరుగులో తేనె కలిపి ముఖానికి రాస్తే మీ చర్మం మృదువుగా మారుతుంది. డ్రై స్కిన్ సమస్య అనేదే ఉండదు. మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. ముఖానికి ఈ మిశ్రం రాసి 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.. మీ ముఖంలో వచ్చే మార్పు మీకే స్పష్టంగా కనపడుతుంది.
పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్..
పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్ కూడా మీ స్కిన్ గ్లో పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఎండ కారణంగా ముఖంపై ట్యాన్ ఏర్పడితే ఈ ఫేస్ ప్యాక్ తో ఆ ట్యాన్ మొత్తం పోతుంది. ఈ రెండింటిని బాగా కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించాలి. 20 నిమిషాలు అలాగే వదిలేసి, గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
పెరుగు, శనగపిండి ఫేస్ ప్యాక్..
మీ ముఖం జిడ్డుగా మారితే.. అప్పుడు పెరుగులో శెనగపిండి కలిపి ముఖానికి రాస్తే చాలు. మీ ముఖంపై పేరుకుపోయిన మురికి, జిడ్డు పోయి.. ఫ్రెష్ గా కనపడుతుంది. ముఖం మెరిచేలా చేస్తుంది.మంచిగా స్క్రబ్బర్ లాగా కూడా దీనిని వాడొచ్చు. పెరుగులో ఒక స్పూన్ ఓట్స్ కలిపి కాసేపు నానపెట్టండి. ఈ మిశ్రమాన్ని కూడా ముఖానికి రాస్తే ముఖంలో గ్లో పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు.