Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Travel
  • Indian Railway New Rules: మే 15 నుంచి కొత్త రూల్స్.. వీరికి స్లీపర్, ఏసీ బోగీల్లోకి ప్రవేశం లేదు!

Indian Railway New Rules: మే 15 నుంచి కొత్త రూల్స్.. వీరికి స్లీపర్, ఏసీ బోగీల్లోకి ప్రవేశం లేదు!

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం ఎప్పటికప్పుడూ కొత్త నియమాలను అమలు చేస్తూ ఉంటుంది. మే 15 నుంచి జనరల్ టికెట్ ఉన్న ప్రయాణికులు... స్లీపర్, ఏసీ బోగీల్లోకి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోనుంది. కొత్త నియమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Kavitha G | Published : May 14 2025, 02:31 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

మే 15 నుంచి ఇండియన్ రైల్వే కొత్త నియమాన్ని అమలు చేయనుంది. జనరల్ టికెట్ ఉన్న ప్రయాణికులు స్లీపర్, ఏసీ బోగీల్లోకి వెళ్లకూడదు. రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యను పరిష్కరించడమే ఈ చర్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

25
రిజర్వేషన్ ఉన్నవారికి ఉపశమనం

రిజర్వేషన్ ఉన్నవారికి ఉపశమనం

ఏసీ, స్లీపర్ రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తుంది. జనరల్ టికెట్ ఉన్న ప్రయాణికులు రిజర్వేషన్ బోగీల్లోకి రావడం వల్ల రిజర్వేషన్ చేయించున్నవారు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. రిజర్వేషన్ బెర్తులను అక్రమంగా ఆక్రమించడాన్ని నియంత్రించడానికి రైల్వే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related Articles

Indian Railway: రైల్వేలో ప్యాసింజర్ల కోసం ఎన్ని ఉచిత సౌకర్యాలు ఉన్నాయో తెలుసా?
Indian Railway: రైల్వేలో ప్యాసింజర్ల కోసం ఎన్ని ఉచిత సౌకర్యాలు ఉన్నాయో తెలుసా?
Indian Railways: రైల్వేలో సీనియర్ సిటిజన్ల కోసం ఇన్ని సౌకర్యాలున్నాయా?
Indian Railways: రైల్వేలో సీనియర్ సిటిజన్ల కోసం ఇన్ని సౌకర్యాలున్నాయా?
35
జనరల్ టికెట్ ఉన్నవారు..

జనరల్ టికెట్ ఉన్నవారు..

రిజర్వేషన్ ఉన్నవారికి ఈ చర్య మేలు చేసినా.. జనరల్ టికెట్ ఉన్నవారికి కాస్త ఇబ్బందే. వాళ్లు ఇప్పుడు కచ్చితంగా కేటాయించిన బోగీల్లోనే ఉండాలి. ఈ రూల్ ప్రకారం రైల్వే ఉద్యోగులు, రిజర్వేషన్ లేని ప్రయాణికులు, అనుమతిలేని వ్యాపారులు కూడా స్లీపర్, ఏసీ బోగీల్లోకి వెళ్లకూడదు.

45
ప్రయాణ భద్రత, సౌకర్యం..

ప్రయాణ భద్రత, సౌకర్యం..

రిజర్వేషన్ ఉన్న ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని ఈ కొత్త నియమం పెంచుతుందని రైల్వే చెబుతోంది. అనుమతిలేని ప్రవేశాన్ని ఆపడం ద్వారా భద్రత, పరిశుభ్రత పెరుగుతాయని రైల్వే భావిస్తోంది. రిజర్వేషన్ ఉన్నవారు మాత్రమే బెర్తుల్లో కూర్చోవడాన్ని ఇది నిర్ధారిస్తుంది.

55
ముందుగానే టికెట్ బుక్ చేసుకోండి..

ముందుగానే టికెట్ బుక్ చేసుకోండి..

ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకొని, బెర్తులు కన్ఫర్మ్ చేసుకోవాలని రైల్వే సూచిస్తోంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉంటే, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలి. రైల్వే చేసిన ఈ మార్పు మంచి ప్రయాణ అనుభవానికి దారితీస్తుందని అధికారులు చెబుతున్నారు.

Kavitha G
About the Author
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. Read More...
ప్రయాణం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
Top Stories