MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Travel
  • వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !

వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !

Top 10 Historical Places in India:  ఈ వీకెండ్​లో ఏదైనా టూర్​కి ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడికి వెళ్లాలని తెగ ఆలోచిస్తున్నారా? డో వర్రీ మన దేశంలోనే ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి.  మీకోసమే.. ఇండియాలో టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితాను అందిస్తున్నాం.  వీటిపై ఓ లుక్కేయండి.

2 Min read
Author : Rajesh K
Published : May 18 2025, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
భారత దేశంలోని చారిత్రక ప్రదేశాలు

భారత దేశంలోని చారిత్రక ప్రదేశాలు

భారతదేశంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఉన్నాయి. ఇవి మన దేశ సంస్క్రుతిని ప్రతిబింబిస్తున్నాయి. భవ్యమైన కోటల నుండి సంక్లిష్టమైన దేవాలయాల వరకు.. ఎంతో చారిత్రక, వారసత్వ సంపద ఉంది. భారతదేశంలోని అద్భుతమైన కట్టడాలు, ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
ఫతేపూర్ సిక్రీ

ఫతేపూర్ సిక్రీ

ఫతేపూర్ సిక్రీ - ఉత్తరప్రదేశ్: 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించిన కోట నగరం. ఈ ప్రదేశం మొఘల్ సామ్రాజ్యం తాత్కాలిక  రాజధానిగా పనిచేసింది.

Related Articles

Related image1
Free bus travel: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్ర‌బాబు.. ఫ్రీ బ‌స్సు ప్ర‌యాణం ఎప్ప‌టినుంచంటే?
Related image2
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
311
మైసూర్ ప్యాలెస్ - కర్ణాటక:

మైసూర్ ప్యాలెస్ - కర్ణాటక:

మైసూర్ ప్యాలెస్  - కర్ణాటక: ఈ అద్భుతం హిందూ, ముస్లిం, రాజపుత్ర వాస్తుశిల్పానికి నిదర్శనం.  ఇది ఒకప్పుడు ఒడియర్ రాజవంశస్తుల రాజ నివాసం.

411
కోణార్క్ సూర్య దేవాలయం - ఒడిశా

కోణార్క్ సూర్య దేవాలయం - ఒడిశా

కోణార్క్ సూర్య దేవాలయం - ఒడిశా: 13వ శతాబ్దంలో రాజు నరసింహదేవ 1 దీనిని నిర్మించారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది సూర్య దేవునికి అంకితం చేయబడిన దేవాలయం. ఈ దేవాలయం రథం ఆకారంలో ఉంటుంది.

511
సాంచి స్థూపం, మధ్యప్రదేశ్

సాంచి స్థూపం, మధ్యప్రదేశ్

సాంచి స్థూపం - మధ్యప్రదేశ్: మౌర్యుల పరిపాలన, వాస్తుశిల్పంకు నిదర్శనం. ​ఈ గొప్ప అద్భుతాన్ని చక్రవర్తి అశోకుడు క్రీ.పూ 3వ శతాబ్దంలో బుద్ధుని అవశేషాలను ఉంచడానికి నిర్మించాడు. ఇది భారతదేశంలోని పురాతన రాతి కట్టడాల్లో ఒకటి.

611
హంపి రాతి రథం- కర్ణాటక:

హంపి రాతి రథం- కర్ణాటక:

హంపిలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించిన రాతి రథం ఇది.  విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రదర్శించే శిల్పకళ రూపమిది. 

711
హవా మహల్ - జైపూర్:

హవా మహల్ - జైపూర్:

రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఉంది. ఈ మహల్ ను ఎరుపు, గులాబీ వర్ణపు ఇసుకరాళ్ళతో నిర్మించారు. ఇది పింక్ సిటీకి చిహ్నంగా చెబుతారు. దీన్ని 1799లో జైపూర్ మహారాజు ప్రతాప్ సింగ్ నిర్మించారు. రాజమందిరంలోని స్త్రీలు బయటి వారికి కనిపించకుండా నగరంలో జరుగుతున్న సంఘటనలు, రాజప్రాసాదపు ప్రదర్శనలను చూసేందుకు వీలుగా దీన్ని నిర్మించారు.

811
చార్మినార్ - హైదరాబాద్

చార్మినార్ - హైదరాబాద్

చార్మినార్‌ను 16వ శతాబ్దంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. చార్మినార్‌ను ఇండో- ఇస్లామిక్ శైలిలో నిర్మించారు. నాలుగు మినార్లు, అందమైన కమాన్లు, ఇంటిలా నిర్మించిన అంతస్తులు దీనికి ప్రత్యేక ఆకర్షణ. ప్రతి మినార్‌పై ఒక చిన్న మసీదు ఉండటం విశేషం. ఈ స్మారక చిహ్నం హైదరాబాద్ స్థాపనను సూచించే నాలుగు గొప్ప తోరణాలను కలిగి ఉంది. 

911
గేట్‌వే ఆఫ్ ఇండియా - ముంబై:

గేట్‌వే ఆఫ్ ఇండియా - ముంబై:

గేట్‌వే ఆఫ్ ఇండియా అనేది స్మారక చిహ్నం. దీనిని 1924లో కింగ్ జార్జ్ V సందర్శన జ్ఞాపకార్థంగా ఈ తోరణం నిర్మించారు. అరేబియా సముద్రం వైపు ఉంది.  

1011
తాజ్ మహల్ - ఆగ్రా::

తాజ్ మహల్ - ఆగ్రా::

తాజ్ మహల్  -  ఆగ్రా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్  ప్రేమకు చిహ్నం. మొగల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం నిర్మించాడు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం.  ఇది 17వ శతాబ్దంలో నిర్మించిన స్మారక చిహ్నం. ఇది మొఘల్ పాలనలో నిర్మించబడింది 

 

1111

కుతుబ్ మినార్ ను1193లో కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ నిర్మించారు. 73 మీటర్ల ఎత్తైన మినార్ ప్రపంచంలోనే ఎత్తైన ఇటుక మినార్,  ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్పంలో ఇది నిర్మించబడింది.  

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
Recommended image2
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
Recommended image3
ట్రెక్కింగ్ ఇష్టమా.. హిమాలయాలోని ఈ సీక్రెట్ స్పాట్స్ కు వెళ్లండి!
Related Stories
Recommended image1
Free bus travel: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్ర‌బాబు.. ఫ్రీ బ‌స్సు ప్ర‌యాణం ఎప్ప‌టినుంచంటే?
Recommended image2
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved