MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • తెలంగాణ వరదల్లో ఎంతమంది చనిపోయారో తెలుసా..? వీరికి మాత్రమే రూ.5 లక్షల సాయమా?

తెలంగాణ వరదల్లో ఎంతమంది చనిపోయారో తెలుసా..? వీరికి మాత్రమే రూ.5 లక్షల సాయమా?

తెలంగాణ వరదల్లో చనిపోయినవారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ వరదల్లో ఎంతమంది చరిపోయారో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 02 2025, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణలో వరద బీభత్సం
Image Credit : X-@Brezzy_Drive

తెలంగాణలో వరద బీభత్సం

Telangana Floods : ఇటీవల తెలంగాణలో వర్షాలు దంచికొట్టాయి... ఆగస్ట్ చివర్లో కురిసిన వానలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. కేవలం గంటల వ్యవధిలో కుండపోతగా వర్షం కురవడంతో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరదలు సంభవించాయి... ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోనూ నదులు, వాగులువంకలు వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహించాయి... చెరువులు, కుంటల గండ్లు తెగి వరదనీరు ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తింది. ఇలా ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టం కూడా జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
Image Credit : X/Telangana CMO

వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

తాజాగా తెలంగాణ ప్రభుత్వం వరదల్లో చనిపోయినవారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. వరదనీటిలో కొట్టుకుపోయినవారు, వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది. ఇక పంట నష్టపోయినా, పాడిపశువులతో ఇతర జీవాలు చనిపోయి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే అదికారులు వర్షాలు, వరదలు కారణంగా జరిగిన నష్టాన్ని అంచనావేసే పనులను వేగవంతం చేశారని ప్రభుత్వం చెబుతోంది.

Related Articles

Related image1
Rain Alert : నేడు తెలుగు రాష్ట్రాల్లో కామారెడ్డి స్థాయి వర్షాలు... ఏఏ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్టో తెలుసా?
Related image2
తెలంగాణలో మాదిరిగానే యూపీలో వరదలు.. స్వయంగా రంగంలోకి సీఎం యోగి
35
తెలంగాణ వరదల్లో ప్రాణనష్టం
Image Credit : Getty

తెలంగాణ వరదల్లో ప్రాణనష్టం

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపైనుండి ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, నీటి ప్రవాహాలను దాటేందుకు ప్రయత్నించి కార్లు, బైక్స్ కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియా, ఇతర  మాధ్యమాల్లో చాలానే వచ్చాయి. ఇక పశువులు మేపడానికి వెళ్లి వరదనీటిలో చిక్కుకుని కొందరు, గ్రామాలను వాగులువంకలు చుట్టుముట్టడంతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇక మూగ జీవాల మరణాలకు అయితే లెక్కేలేదు.

45
తెలంగాణ వరదల్లో ఎంతమంది చనిపోయారు?
Image Credit : X/Hyderabad Traffic Police

తెలంగాణ వరదల్లో ఎంతమంది చనిపోయారు?

అయితే అధికారిక లెక్కలు అంటే తెలంగాణ డిజిపి జితేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం భారీ వర్షాలు, వరదల కారణంగా 10 వరకు చనిపోయారు. హోంశాఖకు అందిన సమాచారం మేరకే డిజిపి ఈ మరణాలు గురించి చెప్పివుంటారు. దాదాపు 2 వేల మందిని వర్షాలు, వరదల నుండి సురక్షితంగా కాపాడినట్లు డిజిపి వెల్లడించారు. పోలీసులతో పాటు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది... ఎయిర్ ఫోర్స్, ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు డిజిపి జితేందర్ వెల్లడించారు.

ఇలా అధికారిక లెక్కలు 10 మందివరకే చనిపోయారని చెబుతున్నా మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించిన నేపథ్యంలో మరణాలపై చర్చ మొదలయ్యింది. వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. 

55
తెలంగాణలో మళ్లీ వర్షాలు షురూ..
Image Credit : Getty

తెలంగాణలో మళ్లీ వర్షాలు షురూ..

ఇప్పటికే తెలంగాణను వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే నాలుగైదురోజులు జోరువానలు కురుస్తాయయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.

నేడు (మంగళవారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, ములుగు, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగామ, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలుంటాయట... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
వ్యవసాయం (Vyavasayam)

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
Recommended image2
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం
Recommended image3
Now Playing
అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
Related Stories
Recommended image1
Rain Alert : నేడు తెలుగు రాష్ట్రాల్లో కామారెడ్డి స్థాయి వర్షాలు... ఏఏ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్టో తెలుసా?
Recommended image2
తెలంగాణలో మాదిరిగానే యూపీలో వరదలు.. స్వయంగా రంగంలోకి సీఎం యోగి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved