భర్త శవాన్ని ఇంట్లోనే పూడ్చిన నౌశిన్: స్థానికులను ఇలా నమ్మించింది
నెల రోజుల తర్వాత నౌశిన్ బేగం చేసిన దారుణం వెలుగు చూసింది. భర్తను హత్య చేసి ఇంట్లోనే మృతదేహన్ని పూడ్చి పెట్టింది. చివరికి ఆమె చేసిన దారుణం వెలుగు చూసింది.
భర్తను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన నౌశిన్ బేగం పోలీసుల విచారణలో సంచలన విషయాలను బయటపెట్టింది. భర్తను చంపిన విషయం బయటకు రాకుండా ఆమె అనేక జాగ్రత్తలు తీసుకొంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ నుండి గగన్ అగర్వాల్ కన్పించకుండాపోయాడు. భర్త ఆచూకీ కోసం ఆమె తెలివిగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. మొదటి నుండి కూడ పోలీసులకు ఆమెపైనే అనుమానం ఉంది.
నౌశిన్ అదుపులోకి తీసుకొని విచారిస్తే కీలక విషయాలను ఆమె వెల్లడించింది.
మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అగర్వాల్ 2020 జూన్ 2న ఆర్యసమాజ్ లో నౌశిన్ బేగాన్ని పెళ్లి చేసుకొన్నాడు. నౌశిన్ బేగానికి ఇదివరకే వివాహమైంది. ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు పిల్లలను ఆమె పుట్టింట్లోనే ఉంచింది.
వివాహమైన తర్వాత హబ్సిగూడలోని ఓ అపార్ట్ మెంట్ లో అగర్వాల్ నౌశిన్ తో కాపురం పెట్టాడు. ఆ తర్వాత మన్సూరాబాద్ లో కాపురం పెట్టాడు.
అగర్వాల్ స్నేహితుడు సునీల్ కూడ ఈ హత్యకు సహకరించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.
అగర్వాల్ కోసం వచ్చే సునీల్ కుమార్ తో నౌశిన్ బేగానికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది కూడ హత్యకు కారణమా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తనను చూసేందుకు వచ్చే తన కూతురిపై గగన్ అగర్వాల్ మూడు దఫాలు అత్యాచారయత్నానికి ప్రయత్నించినట్టుగా నౌశిన్ బేగం చెబుతోంది. ఇది మనసులో పెట్టుకొని హత్య చేయాలని ప్లాన్ చేసినట్టుగా పోలీసుల విచారణలో ఆమె వెల్లడించింది.
ఫిబ్రవరి 8వ తేదీన నౌశిన్ బేగం, సునీల్ కుమార్, గగన్ అగర్వాల్ ఇంట్లోనే మద్యం తాగారు. ఈ సమయంలోనే తన కూతురిపై అత్యాచారయత్నం ఎందుకు చేశావని ఆమె అగర్వాల్ ను నిలదీసింది. ఈ విషయమై ఇద్దరి మద్య మాటా మాటా పెరిగింది.
నౌశిన్ బేగం కత్తితో పొడిస్తే సునీల్ కుమార్ అగర్వాల్ కాళ్లు, చేతులు పట్టుకొన్నాడు. మృతదేహాన్ని ఇంట్లో డ్రైనేజీ కోసం తవ్విన గుంటలో పూడ్చివేశారు.
అగర్వాల్ ను చంపిన రెండు రోజులకే అతని సోదరుడు ఇంటికి వచ్చాడు. సోదరుడి కోసం ఆరా తీశాడు. రెండు రోజులుగా అగర్వాల్ ఆచూకీ లేకుండాపోయిందని ఆమె అతడిని నమ్మించింది. ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అగర్వాల్ మృతదేహం పూడ్చిపెట్టడం వల్ల దుర్వాసన ఏమైనా వస్తోందా అనే విషయాన్ని పరిశీలించేందుకు అప్పుడప్పుడు ఆమె ఆ ఇంటికి వచ్చిపోయేది. పిల్లికి పాలు పోసేందుకు వస్తున్నట్టుగా ఇంట్లో కిరాయికి ఉన్నవారిని ఆమె నమ్మించింది.
భర్త మృతదేహం పూడ్చిన ప్రాంతంలో ఇంట్లో మిగిలిన కట్టెలు, చెత్త వేసేది. ఇల్లంతా చెత్తా చెదారంతో నిండిపోయిందని ఆమె తరచూ ఇరుగుపొరుగువారితో చెప్పేది.
అగర్వాల్ విషయం బయటకు రాదని నిర్ధారించుకొన్న తర్వాత ఆమె ఆజ్మీర్ కు వెళ్లింది. అక్కడే సునీల్ ను కలుసుకొంది. అగర్వాల్ ను పెళ్లి చేసుకొన్న తర్వాత కూడ ఆమె ఓ కట్టుకథ అల్లింది.ఈ విషయాన్ని అగర్వాల్ రూఢీ చేసుకొన్నాడు.
పనిమీద ఊరికి వెళ్లిన అగర్వాల్ కు తనను ఎవరో ఎత్తుకెళ్లారని తన జుట్టును కట్ చేశారని ఏడుస్తూ చెప్పింది. అయితే ఈ విషయమై అగర్వాల్ తాను అద్దెకు ఉండే అపార్ట్ మెంట్ వాచ్ మెన్ ను ఈ విషయమై వివరాలపై ఆరా తీశారు. అయితే అలాంటిదేమీ లేదని తేలడంతో అగర్వాల్ వెంటనే అక్కడి నుండి మన్సూరాబాద్ కు మార్చాడు.