హైదరాబాద్లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఆమెదే కీలక పాత్ర.. అపార్ట్మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా..!!
హైదరాబాద్లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బంజారాహిల్స్లోని ఓ స్పా సెంటర్పై దాడి చేసిన నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.. ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మంది విటులను అదపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బంజారాహిల్స్లోని ఓ స్పా సెంటర్పై దాడి చేసిన నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.. ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మంది విటులను అదపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
వివరాలు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఓ అపార్ట్మెంట్లో నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో మసాజ్ మాటున వ్యభిచారం నిర్వహిస్తున్నారని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఆ మసాజ్ సెంటర్పై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు.
మసాజ్ సెంటర్ను నిర్వహిస్తున్న శృతి, రమణ, జాహెద్ ఉల్-హక్ను నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులు తీసుకొచ్చి క్రాస్ మసాజ్, వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా తేల్చారు. ముగ్గురు నిర్వహాకులతో పాటు విటులపై కేసులు నమోదు చేశారు. మసాజ్ సెంటర్లో పట్టుబడిన యువతులను రెస్క్యూ హోంకు తరలించారు.
ఇక, ఈ స్పా సెంటర్ నిర్వహకులను గతంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి దందానే నిర్వహించారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిర్వాహకురాలైన శృతి.. ఉక్రెయిన్లో మెడిసిన్ చేసేందుకు వెళ్లి మధ్యలోనే తిరిగొచ్చిందని చెప్పారు. ఆ తర్వాత అమీర్పేటలోని ఓ శిక్షణ కేంద్రంలో ఎయిర్హోస్టెస్గా శిక్షణ కూడా తీసుకుంది. బంజారాహిల్స్లోని ఓ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్గా కూడా పనిచేసింది.
ఆ సమయంలో ఈజీగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గంలో వెళ్లాలని భావించి.. పంజాగుట్టు పోలీసు స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార దందాకు తెరలేపింది. అయితే అప్పుడూ ఆమెను అరెస్ట్ చేసిన పంజాగుట్టు పోలీసులు.. జైలుకు పంపారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ అదే దారి పట్టి.. బంజారాహిల్స్లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార దందాకు తెరతీసింది.