- Home
- Telangana
- Heat Wave Alert : నేడు పీక్స్ ఎండలు... ఈ ప్రాంతాల్లో ఏకంగా 41 డిగ్రీల హై టెంపరేచర్స్, బిఅలర్ట్
Heat Wave Alert : నేడు పీక్స్ ఎండలు... ఈ ప్రాంతాల్లో ఏకంగా 41 డిగ్రీల హై టెంపరేచర్స్, బిఅలర్ట్
Weather Update : నేడు (మార్చి 6) ఈ సమ్మర్ లోనే ఇప్పటివరకు నమోదుకాని అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏఏ జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయో తెలుసా?

తెలంగాణలో హయ్యెస్ట్ టెంపరేచర్స్
Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు క్రమక్రమంగా ముదురుతున్నాయి. ఇంకా వేసవి ఆరంభంలో ఉంది... అయినా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు సతమతం అవుతున్నారు. తెలంగాణలో అయితే 40 డిగ్రీల మార్కుకు అడుగుదూరంలో నిలిచింది టెంపరేచర్.
అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే...
నిన్న (మార్చి 5, గురువారం) ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక ఆదిలాబాద్ పట్టణంలో 38.9, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 38.9, ఖమ్మం పట్టణంలో 38.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని నగరం హైదరాబాద్ లో 37 డిగ్రీల హై టెంపరేచర్ నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపు అన్ని తెలంగాణ జిల్లాల్లోనూ 35 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ నాలుగైదురోజులు తస్మాత్ జాగ్రత్త...
రాబోయే నాలుగైదురోజులు ఎండత తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరీముఖ్యంగా ములుగు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది.
తెలంగాణ వెదర్ మ్యాచ్ అంచనా ఇదే..
ఇవాళ(మార్చి 6, శుక్రవారం) రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. నార్త్, ఈస్ట్ తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో 39 నుండి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. హైదరాబాద్ లో కూడా 37-38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయంటున్నాడు. ఈ మూడునాలుగు రోజులు ఇదే వాతావరణం ఉంటుంది... కాబట్టి పగటిపూట రోడ్లపైకి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు.
ఏపీలోనూ మండిపోనున్న ఎండలు
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఐఎండి సూచనల ప్రకారం ఈ 2026 వేసవిలో మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ మార్చిలో శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ఇక గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కృష్ణా జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDMA హెచ్చరించింది.
సమ్మర్ లో పాటించాల్సిన జాగ్రత్తలు..
1. టోపి, కర్చీఫ్, తెలుపు రంగు కాటన్ వస్త్రాలను సిద్ధం చేసుకోవాలి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళుతున్నప్పుడు తప్పకుండా వీటినే ధరించాలి.
2. ఎండల నుండి మీ కళ్ళ రక్షణ కోసం మంచి సన్ గ్లాసెస్ ఉపయోగించాలి.
3. ఇంటి వాతావరణం చల్లదనం కోసం ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను వంటివి ఏర్పాటు చేసుకోవాలి.
4. మేడపైన మొక్కలు, ఇంట్లో ని మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్) భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకోవాలి.
5. వంటగది తలుపులు, కిటికీలను తీసివుంచి తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోవాలి.

