BSNL 5G: బీఎస్ఎన్ఎల్ 5జీ ట్రయల్స్.. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు ఇక గుండెదడే!
ఈమధ్యకాలంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను గణనీయంగా ఆకట్టుకుంటోంది. గడిచిన ఏడు నెలల్లో కొత్తగా 55 లక్షలమంది వినియోగదారులు జతయ్యారని కేంద్రమంత్రి పార్లమెంటులో ప్రకటించారు. ఈ జోరును ఇంకా కొనసాగించడానికి 5G సర్వీసులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన 5G ట్రయల్స్ కూడా ప్రారంభించినట్టు సమాచారం.
12

ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లు
ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు ఒకవైపు రీఛార్జ్ ప్లాన్లు విపరీతంగా పెంచుతూ పోతుంటూ ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL పాపులారిటీ పెంచుకుంటోంది. జనాలకు నచ్చేలా ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లను తీసుకువస్తోంది. దాంతోపాటు 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ వేగం పెరగనుంది. సేవలు మెరుగవుతాయి.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
22
టవర్ల సంఖ్య పెంపు
టెలికాం శాఖ BSNLకు రూ.61,000 కోట్ల 5G స్పెక్ట్రమ్ను ఇచ్చింది. BSNL రాబోయే మూడు నెలల్లో 5G కనెక్షన్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. పూణే, కోయంబత్తూరు, కాన్పూర్, విజయవాడ, కొల్లాంలో ఇప్పటికే ట్రయల్స్ మొదలయ్యాయి. ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే BSNL రీఛార్జ్ ప్లాన్లు ఇప్పటికీ తక్కువ ధరలో ఉన్నాయి. 5G సేవలు అందుబాటులోకి వస్తే కస్టమర్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
Latest Videos