MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • భారత ఓటమిలో ప్లేయర్ల తప్పేమీ లేదు.. మరి ఎవరిది? పీటర్సన్

భారత ఓటమిలో ప్లేయర్ల తప్పేమీ లేదు.. మరి ఎవరిది? పీటర్సన్

India vs South Africa : కోల్‌కతా టెస్ట్‌లో భారత బ్యాటింగ్ కుప్పకూలిన తీరు ఆధునిక క్రికెట్ ధోరణుల కారణమని కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానించారు. బిగ్ షాట్లే ప్రాధాన్యమవుతున్నాయని ఆయన అన్నారు. ప్లేయర్ల తప్పేమీ లేదంటూ చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారితీశాయి.

2 Min read
Mahesh Rajamoni
Published : Nov 16 2025, 08:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సిక్సులు కొట్టడం, స్విచ్ హిట్స్ ఆడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు
Image Credit : ANI

సిక్సులు కొట్టడం, స్విచ్-హిట్స్ ఆడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు

భారత జట్టు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. దీని తర్వాత ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ హాట్ కామెంట్స్ చేశారు. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో భారత్ 93 పరుగులకే ఆలౌట్ కావడం గురించి మాట్లాడిన ఆయన.. ఇది వ్యక్తిగత తప్పిదాల కంటే ఆధునిక బ్యాటింగ్ పద్ధతుల ప్రభావంతో జరిగిందని అన్నారు.

పీటర్సన్, X వేదికగా స్పందిస్తూ.. ప్రస్తుతం క్రికెట్ ముందుకు సాగుతున్న తీరుపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్ నిర్మాణం కంటే సిక్సులు కొట్టడం, స్విచ్-హిట్స్ ఆడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇది పోరాటం చేసే నైపుణ్యాల కంటే శక్తిని ఆధారంగా చేసుకున్న ఆటతీరును ప్రోత్సహించే క్రికెట్ వ్యవస్థ కారణంగా జరుగుతోందన్నారు.

25
ప్లేయర్ల తప్పు కాదు.. ఆధునిక టెస్ట్ బ్యాటింగ్ పై పీటర్సన్ విమర్శలు
Image Credit : Getty

ప్లేయర్ల తప్పు కాదు.. ఆధునిక టెస్ట్ బ్యాటింగ్ పై పీటర్సన్ విమర్శలు

ఈ ధోరణికి ఆటగాళ్లను తప్పుపట్టకూడదని పీటర్సన్ అన్నారు. “ఇప్పుడు ప్లేయర్లు ఈ సిస్టమ్‌లో పెరుగుతున్నారు. ఆటలో నిలదొక్కుకోవడానికో, స్పిన్‌ను ఎదుర్కొనే కళ ఇప్పుడు ప్రాధాన్యతగా లేదు. క్రికెట్ ఇప్పుడు ప్రకాశవంతమైన లైట్లు, పెద్ద శబ్దం, ఆర్థిక లాభాలు వంటి అంశాలపై ఆధారపడుతోంది” అని అన్నారు.

డబ్బే ప్రాధాన్యం ఆధునిక బ్యాటింగ్ మైండ్‌సెట్‌ను ప్రభావితం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. “ఇది మాట్లాడలేని అంశం. కానీ ఇది వాస్తవం” అని తెలిపారు. ఆటగాళ్లు తమ కెరీర్‌లో సాధ్యమైనంతగా సంపాదించుకోవాలంటూ తనదైన వ్యాఖ్యలతో కొత్త చర్చకు తెరలేపారు.

Related Articles

Related image1
మరుగుజ్జు అంటే మటాష్ చేశాడు.. టెంబా బవూమా ఇచ్చిపడేశాడు అంతే !
Related image2
టీమిండియాను గంభీర్ ముంచేశాడు ! ఓటమికి కారణం ఇదే
35
భారత ఇన్నింగ్స్ ఎలా కుప్పకూలింది?
Image Credit : x/bcci

భారత ఇన్నింగ్స్ ఎలా కుప్పకూలింది?

కోల్‌కతా టెస్ట్‌లో 124 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. 35వ ఓవర్‌లో కేశవ్ మహారాజ్ వేసిన ఓవర్ మ్యాచ్‌ను పూర్తిగా మార్చింది.

అక్షర్ పటేల్ ఒక ఫోర్, రెండు సిక్సులు కొట్టిన తరువాత మళ్లీ పెద్ద షాట్ ఆడటానికి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. టెంబా బవుమా అద్భుతంగా పరుగెత్తి క్యాచ్ పట్టాడు. తర్వాతి బంతికే మహారాజ్, మహ్మద్ సిరాజ్‌ను ఔట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. 93 పరుగుల వద్దనే ఇన్నింగ్స్ ఆగిపోవడంతో ఇది భారత్ టెస్ట్ చరిత్రలో అత్యల్ప లక్ష్యాల్లో ఒకటిగా నిలిచింది.

45
భారత బ్యాటింగ్ వైఫల్యంపై తీవ్ర చర్చ
Image Credit : ANI

భారత బ్యాటింగ్ వైఫల్యంపై తీవ్ర చర్చ

భారత్‌కు రెండు రోజుల సమయం ఉండగా కూడా లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం అభిమానుల్లో అసంతృప్తిని పెంచింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ కీలక సమయంలో తప్పిదాలు చేశారు. ధ్రువ్ జురెల్ కూడా నిలువలేకపోయాడు. వాషింగ్టన్ సుందర్ 31 పరుగులతో పోరాడినా, భాగస్వామ్యం లేకపోవడంతో ఇన్నింగ్స్ నిలవలేదు.

ఈ క్రమంలోనే పీటర్సన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన ఆధునిక క్రికెట్ ఆటగాళ్లను పెద్ద షాట్లు ఆడే విధానాల్లో పెంచుతోందని అన్నారు.

55
దక్షిణాఫ్రికా విజయం పై మాజీ క్రికెటర్లు ఏమన్నారు?
Image Credit : ICC

దక్షిణాఫ్రికా విజయం పై మాజీ క్రికెటర్లు ఏమన్నారు?

దక్షిణాఫ్రికా భారత్‌లో 2010 తర్వాత తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. ఏబీ డివిలియర్స్, ఫాఫ్ డుప్లెసిస్, డేల్ స్టెయిన్ ఈ విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు. బవుమా 55 పరుగులతో మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు.

కాగా, భారత్ వరుసగా నాల్గో హోమ్ టెస్ట్‌లో ఓటమి చవిచూసింది. 2024లో న్యూజిలాండ్‌ సిరీస్ సహా మొత్తం ఆరు టెస్టుల్లో నాలుగు పరాజయాలు ఎదుర్కొంది. క్రికెట్ లో ఈ ఫలితాలకు కారణం ఆధునిక రోజుల్లో పెరుగుతున్న వినోద ప్రాధాన్య ధోరణులేనని పేర్కొన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved