MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు

IND vs SA : విశాఖపట్నంలో జరిగిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ (116*) సెంచరీ, బౌలర్ల విజృంభణతో భారత్ 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. 2-1తో సిరీస్ గెలుచుకుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 06 2025, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విశాఖ వన్డేలో భారత్ గెలుపు
Image Credit : ANI

విశాఖ వన్డేలో భారత్ గెలుపు

భారత్ సౌతాఫ్రికాను చిత్తు చేసింది. మూడో వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి విజయాన్ని అందుకుంది. విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియం శనివారం జరిగిన మూడో వన్డేలో భారత జట్టు సౌతాఫ్రికా జట్టుపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన తొలి వన్డే సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నిర్ణయాత్మక విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సిరీస్ కైవసం చేసుకున్న భారత్
Image Credit : AFP

సిరీస్ కైవసం చేసుకున్న భారత్

ఈ మ్యాచ్‌లో భారత్ మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల రాణించడంతో సౌతాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకే ఆలౌట్ అయింది. 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడి, కేవలం 39.5 ఓవర్లలోనే 271/1 స్కోరుతో విజయాన్ని అందుకున్నారు.

భారత్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఛేజింగ్‌ను మరో 61 బంతులు (10.1 ఓవర్లు) మిగిలి ఉండగానే పూర్తి చేయడం భారత ఆధిపత్యాన్ని స్పష్టం చేసింది.

Related Articles

Related image1
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !
Related image2
Abhishek Sharma : 100 సిక్సర్లతో దుమ్మురేపిన అభిషేక్ !
34
యశస్వి జైస్వాల్ సెంచరీ
Image Credit : AFP

యశస్వి జైస్వాల్ సెంచరీ

భారత ఇన్నింగ్స్‌కు యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ వెన్నెముకగా నిలిచాడు. జైస్వాల్ 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 116 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన తొలి వన్డే సెంచరీని పూర్తి చేసుకున్న అతను, ఛేజింగ్‌ను అత్యంత ఓర్పుతో, నైపుణ్యంతో పూర్తి చేశాడు. ఈ సెంచరీతో టెస్ట్, వన్డే, టీ20ఐ... మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు సాధించిన ఆరవ భారత బ్యాట్స్‌మెన్‌గా జైస్వాల్‌ రికార్డు సృష్టించాడు.

రోహిత్ శర్మ కూడా తనదైన శైలిలో మంచి నాక్ ఆడాడు. 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు సాధించాడు. జైస్వాల్‌తో కలిసి రోహిత్ తొలి వికెట్‌కు 155 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్ శర్మను సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అవుట్ చేశాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. కోహ్లీ కేవలం 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 65 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఈ సిరీస్‌లో కోహ్లీకి ఇది వరుసగా మూడవ వన్డే అర్ధ సెంచరీ కావడం విశేషం.

44
బౌలింగ్ లోనూ అదరగొట్టిన భారత్
Image Credit : X/@BCCI

బౌలింగ్ లోనూ అదరగొట్టిన భారత్

భారత బౌలింగ్ లో కూడా రాణించింది. ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఈ పేస్, స్పిన్ జోడి చెరో నాలుగు వికెట్లు పడగొట్టింది. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు (4/41). ప్రసిద్ధ్ కృష్ణ 9.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు (4/66). వీరిద్దరి విజృంభణతో సౌత్ ఆఫ్రికా జట్టు మిడిల్, లాస్ట్ ఓవర్లలో తడబడింది.

క్వింటన్ డి కాక్ సౌతాఫ్రికా తరఫున సెంచరీ సాధించాడు. డి కాక్ 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బావుమా 48 పరుగులు చేశాడు. అయితే, ఇతర బ్యాట్స్‌మెన్ల నుంచి సహకారం లేకపోవడం, వరుస వికెట్లు పడటంతో సౌతాఫ్రికా జట్టు 270 పరుగులకే పరిమితమైంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
విశాఖపట్నం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !
Recommended image2
Abhishek Sharma : 100 సిక్సర్లతో దుమ్మురేపిన అభిషేక్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved