MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND vs PAK : భారత్-పాక్ మ్యాచ్ ఖాయం.. రాసిపెట్టుకోండి పాకిస్థాన్ యూ టర్న్ !

IND vs PAK : భారత్-పాక్ మ్యాచ్ ఖాయం.. రాసిపెట్టుకోండి పాకిస్థాన్ యూ టర్న్ !

India vs Pakistan : టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామన్న పాకిస్థాన్ హెచ్చరికలు కేవలం రాజకీయ గిమ్మిక్కులేనని, త్వరలోనే పాక్ యూ టర్న్ తీసుకుంటుందని మాజీ క్రికెటర్ చేతన్ శర్మ అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 06 2026, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ
Image Credit : ANI

భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ

టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల పోరుపై నెలకొన్న సందిగ్ధతకు టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తెరదించారు. ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ విషయంలో పాక్ చేస్తున్న విమర్శలు, హెచ్చరికలు కేవలం రాజకీయ ఎత్తుగడలేనని ఆయన తేల్చి చెప్పారు. పాకిస్థాన్ ప్రభుత్వం తన పట్టు వీడి, త్వరలోనే భారత్‌తో ఆడతామని ప్రకటించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

26
రాజకీయ గిమ్మిక్కు మాత్రమే.. చేతన్ శర్మ హాట్ కామెంట్స్
Image Credit : ANI

రాజకీయ గిమ్మిక్కు మాత్రమే.. చేతన్ శర్మ హాట్ కామెంట్స్

న్యూఢిల్లీలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో చేతన్ శర్మ మాట్లాడుతూ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) అక్కడి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కేవలం బాంగ్లాదేశ్ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న నాటకాలని అభివర్ణించారు. "రాసిపెట్టుకోండి, ఫిబ్రవరి 12 తర్వాత పాకిస్థాన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది. ఇది ఒక పొలిటికల్ గేమ్. బాంగ్లాదేశ్‌లో ఎన్నికలు ముగియగానే పరిస్థితులు మారిపోతాయి" అని ఆయన పేర్కొన్నారు. 'ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ, క్రికెట్‌ను కాపాడటం కోసం మేము భారత్‌తో తలపడతాం' అని పాక్ నేతలు త్వరలోనే ప్రకటనలు చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు.

Related Articles

Related image1
T20 World Cup : రెండు దేశాల తరపున టీ20 వరల్డ్ కప్ ఆడిన ఆరుగురు మొనగాళ్లు వీరే!
Related image2
WPL 2026 : వయసు పెరిగినా వేట తగ్గలేదు.. పర్పుల్ క్యాప్ సోఫీ సొంతం.. టాప్ 5 బౌలర్లు వీరే !
36
బాంగ్లాదేశ్ ఎన్నికలతో లింకు ఏంటి?
Image Credit : ANI

బాంగ్లాదేశ్ ఎన్నికలతో లింకు ఏంటి?

బాంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు, పాకిస్థాన్ నిర్ణయాలపై చేతన్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని  ప్రభుత్వం పాకిస్థాన్‌తో సన్నిహితంగా ఉంటోంది.

ఐసీసీ టోర్నీ నుంచి బాంగ్లాదేశ్‌ను తప్పించడం అన్యాయమని పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ గతంలో వాదించారు. బాంగ్లాదేశ్‌కు సపోర్టుగా నిలిచే క్రమంలోనే భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రకటనలు చేస్తోంది. అయితే ఫిబ్రవరి 12న బాంగ్లాలో ఎన్నికలు ముగియగానే, పాక్ తన వైఖరిని మార్చుకుంటుందని శర్మ అభిప్రాయపడ్డారు.

46
అధికారిక ప్రకటన లేకపోవడంపై ప్రశ్నలు
Image Credit : Instagram / salmanagha247, surya_14kumar

అధికారిక ప్రకటన లేకపోవడంపై ప్రశ్నలు

పాకిస్థాన్ ప్రభుత్వం కేవలం మీడియా ముందు మాటలు చెబుతోంది తప్ప, ఐసీసీకి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని చేతన్ శర్మ గుర్తు చేశారు. "అధికారికంగా ధృవీకరించనంత వరకు ఈ హెచ్చరికలకు విలువ లేదు. ఎవరైనా ఏదైనా చెప్పవచ్చు, కానీ రాతపూర్వకంగా ఇవ్వడం ముఖ్యం. ఇక్కడ అంతిమంగా నష్టపోయేది కేవలం క్రికెట్, క్రికెటర్లు మాత్రమే" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను కూడా రాజకీయాల్లో ఉన్నానని, అందుకే ఈ ఎన్నికల తంత్రాలను సులభంగా పసిగట్టగలనని ఆయన చెప్పుకొచ్చారు.

56
సైన్యాధిపతి జోక్యం చేసుకునే అవకాశం?
Image Credit : ANI

సైన్యాధిపతి జోక్యం చేసుకునే అవకాశం?

ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత పాకిస్థాన్ సైన్యాధిపతి నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉందని చేతన్ శర్మ అంచనా వేశారు. క్రీడల్లో రాజకీయాలను కలపకూడదని, అంతర్జాతీయంగా పాక్ ప్రతిష్ఠను కాపాడటం ముఖ్యమని వారు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని ఆయన అన్నారు. బాంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో కూడా కొంతమంది అధికారులు ప్రభుత్వ నిర్ణయం పట్ల అసంతృప్తితో ఉన్నారని, అక్కడ ప్రభుత్వం మారితే తమ క్రికెట్ భవిష్యత్తు బాగుంటుందని వారు భావిస్తున్నట్లు సమాచారం.

66
శ్రీలంకలో పాక్ మ్యాచ్‌లు.. భారత్‌లో టోర్నీ
Image Credit : X/ Cricket Fever

శ్రీలంకలో పాక్ మ్యాచ్‌లు.. భారత్‌లో టోర్నీ

10వ ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 07 నుండి ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ జట్టు తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 15న భారత్‌తో తలపడబోమని పాక్ ప్రభుత్వం ప్రకటించడం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమైంది. కానీ, చేతన్ శర్మ వంటి విశ్లేషకులు మాత్రం ఈ మ్యాచ్ జరగడం ఖాయమని, పాక్ తన పాత అలవాటు ప్రకారం యూ-టర్న్ తీసుకుంటుందని బలంగా చెబుతున్నారు. మరి పాక్ ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరలోనే తేలనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : రెండు దేశాల తరపున టీ20 వరల్డ్ కప్ ఆడిన ఆరుగురు మొనగాళ్లు వీరే!
Recommended image2
Vaibhav Suryavanshi Net Worth : 14 ఏళ్లకే కోట్ల సామ్రాజ్యం.. వైభవ్ సూర్యవంశీ సంపాదన ఎంత?
Recommended image3
Vaibhav Suryavanshi : 15 ఫోర్లు, 15 సిక్సర్లు.. వార్నీ వీడు మనిషా రాక్షసుడా ! వరల్డ్ రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
T20 World Cup : రెండు దేశాల తరపున టీ20 వరల్డ్ కప్ ఆడిన ఆరుగురు మొనగాళ్లు వీరే!
Recommended image2
WPL 2026 : వయసు పెరిగినా వేట తగ్గలేదు.. పర్పుల్ క్యాప్ సోఫీ సొంతం.. టాప్ 5 బౌలర్లు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved