MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • National
  • Alcohol in Train: రైలులో మద్యం సేవిస్తూ దొరికిపోయారో ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసా?

Alcohol in Train: రైలులో మద్యం సేవిస్తూ దొరికిపోయారో ఎలాంటి శిక్షలు పడతాయో తెలుసా?

Alcohol in Train: రైలులో ఆల్కహాల్ తాగడం వల్ల ఎలాంటి శిక్షలు పడతాయో ఎంతో మందికి తెలియదు. రైలులో మద్యం సేవించడం చట్టరీత్యా నేరం. దానికి చట్టాలు ఎలాంటి శిక్షలు విధిస్తాయో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Nov 10 2025, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైలులో మద్యం సేవించకూడదా?
Image Credit : Pixabay

రైలులో మద్యం సేవించకూడదా?

భారత రైల్వేలలో ప్రతి రోజు కోట్లాదిమందికి ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ప్రజలకు సురక్షితంగా, సంతోషంగా ఉండటానికి కొన్ని నియమాలు, చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి రైలులో లేదా రైల్వే స్టేషన్‌లో మద్యం సేవించడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటివి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏ సెక్షన్ ప్రకారం
Image Credit : IRCTC

ఏ సెక్షన్ ప్రకారం

రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 145 ప్రకారం ఎవరైనా మద్యం సేవించి రైలులో లేదా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అసభ్యంగా ప్రవర్తించినట్టు తేలితే లేదా మద్యం తాగితే వారు చట్టపరంగా శిక్షార్హులు అవుతారు. ఈ చట్టం కింద మద్యం సేవించడం మాత్రమే కాదు, దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినా కూడా నేరంగా పరిగణిస్తారు.

Related Articles

Related image1
EPFO Rules: EPFOలో ఎన్నో మార్పులు ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన కొత్త ఈపీఎఫ్‌వో నియమాలు ఇవిగో
Related image2
Gold Rate today: బంగారం ధరలు తగ్గుతున్నాయి, ఈరోజు వెండి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
35
ఎలాంటి శిక్షలు?
Image Credit : IRCTC

ఎలాంటి శిక్షలు?

ఈ చట్టం ప్రకారం మొదటిసారి తప్పు చేసిన వ్యక్తికి రూ.100 జరిమానా విధిస్తారు. కానీ అదే తప్పును మళ్లీ చేస్తే లేదా అసభ్య ప్రవర్తనతో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే ఒక నెల వరకు జైలు శిక్ష లేదా రూ.250 జరిమానా పడుతుంది. కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలూ విధించవచ్చు. మద్యం సేవించి హింసాత్మకంగా ప్రవర్తించినా, సిబ్బందిపై దాడి చేసినా, గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

45
ఈ పనులు కూడా చేయకూడదు
Image Credit : IRCTC

ఈ పనులు కూడా చేయకూడదు

రైలులో ప్రయాణించే ప్రజలు అన్ని వర్గాలకు చెందినవారు. కుటుంబాలు, పిల్లలు, వృద్ధులు కూడా ఉంటారు. మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులు ఇతరుల భద్రతకు, సౌకర్యానికి ఇబ్బంది కలిగిస్తారు. అందుకే రైల్వే శాఖ కఠినమైన చట్టాలను అమలు చేస్తోంది. ఇటీవల పలు రైళ్లలో మద్యపానం చేసి గొడవలు చేసిన ఘటనలు నమోదవడంతో అధికారులు మరింతగా కఠినంగా ఉంటున్నారు. రైల్వే పోలీసులు, స్టేషన్ మాస్టర్లు కలసి ఎవరూ మద్యం తాగకుండా, గొడవలు పడకుండా కాపలా కాస్తూ ఉంటారు.

55
గుర్తుంచుకోవలసిన విషయాలు
Image Credit : IRCTC

గుర్తుంచుకోవలసిన విషయాలు

రైల్వే ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రైలులో లేదా ప్లాట్‌ఫారంపై మద్యం సేవించడం నిషేధం. మద్యం తాగి రైలులో ఎక్కితే కూడా శిక్ష పడవచ్చు. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తన, గొడవలు, శబ్దం చేయడం వంటి చర్యలు కూడా నేరం. రైల్వే పోలీసులు ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిని వెంటనే అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Encounter: కొన‌సాగుతోన్న ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ల‌ష్క‌రే తోయిబా పాక్ క‌మాండ‌ర్ యాసిర్ హ‌తం
Recommended image2
ఇంద్రభవనాన్ని తలపించే నిర్మాణం.. నితా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఎన్ని అద్భుతాలో
Recommended image3
Government Scheme : 8వ తరగతి పాసైతే చాలు, ఫ్రీగా రూ.48000 పొందండి.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
Related Stories
Recommended image1
EPFO Rules: EPFOలో ఎన్నో మార్పులు ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన కొత్త ఈపీఎఫ్‌వో నియమాలు ఇవిగో
Recommended image2
Gold Rate today: బంగారం ధరలు తగ్గుతున్నాయి, ఈరోజు వెండి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved