MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Viral Video: గ్రామంలోకి వచ్చిన 5 చిరుత పులులు.. యువకుడు చేసిన పని చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

Viral Video: గ్రామంలోకి వచ్చిన 5 చిరుత పులులు.. యువకుడు చేసిన పని చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

షియోపూర్ లోని కూనో నేషనల్ పార్క్ నుంచి ఐదు చిరుతలు గ్రామంలోకి ప్రవేశించాయి. ఒక్క చిరుత వచ్చిందంటే గ్రామస్తులంతా భయంతో వణికిపోతుంటారు. అలాంటిది 5 చిరుతలు వస్తే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా.? అయితే పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..  

2 Min read
Narender Vaitla
Published : Apr 05 2025, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Representative image

Representative image

కూనో నేషనల్ పార్క్‌లోని జ్వాలా అనే ఆడ చిరుత తన పిల్లలతో గ్రామంలోకి ప్రవేశించాయి. అనంతరం అక్కడ ఉన్న మేకను వేటాడి, అక్కడే ప్రజల మధ్య విశ్రాంతి తీసుకుంది. అయితే ఇక్కడ జరిగిన ఓ ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఉమ్రికలాన్ గ్రామంలో ఈ చిరుతలు ఒక రైతు మేకలను వేటాడి అక్కడే విశ్రాంతి తీసుకున్నాయి. గ్రామానికి చెందిన ఒక యువకుడు చిరుతలకు నీళ్లు తాగించాడు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
 

23
kuno national park cheetah

kuno national park cheetah

ఉమ్రికలాన్ గ్రామంలో ఒక్కసారిగా కలకలం

వాస్తవానికి, ఉమ్రికలాన్ గ్రామంలోని ప్రజలు పొలాల దగ్గర ఐదు చిరుతలు తిరుగుతూ ఉండటం చూసి ఒక్కసారిగా కలకలం రేగింది. జ్వాలా దాని పిల్లలు ఒక రైతు మేకలను లక్ష్యంగా చేసుకున్నాయి. అక్కడే చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాయి. ఈ మొత్తం సంఘటనను గ్రామంలోని కొంతమంది యువకులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు.

వైరల్‌ అవుతోన్న వీడియో

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో సినిమా సన్నివేశానికి ఏమాత్రం తీసిపోదు. వీడియోలో జ్వాలా దాని నాలుగు పిల్లలు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తున్నాయి. అప్పుడు ఒక యువకుడు వచ్చి వాటి ముందు ఒక గిన్నెలో నీళ్లు పెట్టాడు. కాసేపటి తర్వాత చిరుతలు లేచి ఎలాంటి భయం లేకుండా నీళ్లు తాగేశాయి.  వైరల్ వీడియో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

33

కూనో నేషనల్ పార్క్ ట్రాకింగ్ బృందం ఘటన వివరాలు సేకరించింది

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న కూనో నేషనల్ పార్క్ ట్రాకింగ్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. వారు పొలాలను పరిశీలించడమే కాకుండా, గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ట్రాకింగ్ బృందంలోని సభ్యులు ఇప్పుడు ఈ చిరుతల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతున్నారు. చిరుతలు తిరిగి అడవిలోకి వెళ్లి మనుషులకు దూరంగా ఉండాలన్నదే బృందం లక్ష్యంగా ఉంది.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
భారత దేశం
వైరల్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
దుబాయ్ ఎయిర్‌షోలో తేజస్ ఫైటర్ జెట్ కూలి పైలట్ మృతి.. ఆయిల్ లీక్ జరిగిందా?
Recommended image2
తేజస్ యుద్ధ విమానం కూలిపోవడానికి కారణం ఇదేనా? 'బారెల్ రోల్' విన్యాసంలో ఏం జరిగింది?
Recommended image3
కార్మిక సంస్కరణల విప్లవం: అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్.. ప్రయోజనాలేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved