MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • 40కోట్ల మంది స్వాతంత్య్రం సాధించారు.. 140 కోట్ల మంది వికసిత్‌ భారత్‌ సాధించలేమా?: ప్రధాని మోదీ

40కోట్ల మంది స్వాతంత్య్రం సాధించారు.. 140 కోట్ల మంది వికసిత్‌ భారత్‌ సాధించలేమా?: ప్రధాని మోదీ

2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవడంతో పాటు వాతావరణ సమస్యలను అధిగమించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. భారతదేశం 40 కోట్ల నుంచి 140 కోట్ల పౌరుల దేశంగా ఎదిగిందని గుర్తుచేశారు.

8 Min read
Galam Venkata Rao
Published : Aug 15 2024, 10:12 AM IST| Updated : Aug 15 2024, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై 11వ సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను, ఐక్యత ఆవశ్యకతను నొక్కిచెప్పారు.

24
Narendra Modi independence day

Narendra Modi independence day

2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవడంతో పాటు వాతావరణ సమస్యలను అధిగమించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. భారతదేశం 40 కోట్ల నుంచి 140 కోట్ల పౌరుల దేశంగా ఎదిగిందని గుర్తుచేశారు. నాణ్యమైన ఉత్పత్తులు, గ్రీన్ ఎనర్జీపై దృష్టి కేంద్రీకరించాలని కోరుతూ సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యం పెంపుదల, లింగ సమానత్వంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

34
Narendra Modi independence day Speech

Narendra Modi independence day Speech

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటలో తన 11వ ప్రసంగాన్ని చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడమే స్వాతంత్య్ర దినోత్సవమని తెలిపారు. వికసిత్‌ భారత్ 2047 లక్ష్యం గురించి ప్రస్తావించారు. గడిచిన పదేళ్లలో భారత్‌ సాధించిన విజయాలు, 3.0 పాలనలో తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. స్కిల్ ఇండియా, విద్య, ఉపాధి, కొత్త క్రిమినల్ చట్టాల ద్వారా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వరకు విస్తృత శ్రేణి అంశాలను మోదీ ప్రస్తావించారు. 

ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్స్...

‘స్వాతంత్య్రానికి ముందు దేశంలో అంతా ఏమర్జెన్సీ వాతావరణం నెలకొంది. దారుణమైన పరిస్థితుల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్య్ర భారతదేశం కోసం అందరూ పోరాడారు. బానిసత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. బానిసత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం జరిగింది. ఇది భారతీయులను విచ్ఛిన్నం చేసే వ్యూహం. అప్పుడు కూడా 40 కోట్ల మంది భారతీయులు స్వాతంత్య్రం కోసం ఐక్యతను ప్రదర్శించారు. వందేమాతరం అని నినదించారు. 40 కోట్ల మంది మాత్రమే బానిస సంకెళ్లను తెంచుకున్నారు. మనది ఒకే రక్తం. నేడు మనం 140 కోట్ల మంది భారతీయులం. 40 కోట్ల మంది స్వాతంత్ర్యం పొందగలిగితే, మనం ఐక్యంగా ఉంటే 140 కోట్ల మంది భారతీయులు ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలరు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించగలం. 40 కోట్ల మంది భారతీయులు స్వాతంత్య్రం సాధించగలిగినప్పుడు.. 2047 నాటికి మనం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించగలం.’

‘దేశం కోసం చనిపోయి స్వాతంత్య్రం తెచ్చిన కాలం ఉంది. నేడు దేశం కోసం జీవించడం వల్ల భారత్ అభివృద్ధి చెందుతుంది. వికసిత్ భారత్ ఒక పెద్ద ప్రయత్నం. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సలహాలను తీసుకున్నాం. కోట్లాది మంది భారతీయులు లక్ష్యం కోసం సూచనలు ఇచ్చారు. యువత, సీనియర్ సిటిజన్లు, గిరిజన, గ్రామీణ, పట్టణ జనాభా, ప్రతి ఒక్కరూ 2047 వికసిత్ భారత్ కోసం సూచనలు చేశారు.
భారతదేశాన్ని స్కిల్ హబ్‌గా, ఎడ్యుకేషనల్ క్యాపిటల్‌గా, మీడియా క్యాపిటల్‌గా, ఆత్మనిర్భర్‌గా మార్చాలని, ఆహారాన్ని ఎగుమతి చేయాలని, చిన్న తరహా రైతులను ఆదుకోవాలని, పాలనా సంస్కరణలు, న్యాయ సంస్కరణలు, గ్రీన్‌ఫీల్డ్ నగరాలు ఆవశ్యకత, భారతీయ అంతరిక్ష కేంద్రం, సాంప్రదాయ ఔషధాలు, వెల్‌నెస్ హబ్‌గా మార్చాలని కొందరు సలహాలు ఇచ్చారు. భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి.
నా దేశ ప్రజల కల పని చేసేందుకు నాకు ప్రేరణనిస్తుంది. 18 వేల గ్రామాలకు కరెంటు ఇస్తామని ఎర్రకోట నుంచి చెప్పాం. ఆ హామీని నిలబెట్టుకున్నాం. 
పేదలకు మరుగుదొడ్లు, పరిశుభ్రత వస్తే అదే నవ భారతం.
జల్ జీవన్ పథకం ద్వారా 12 కోట్ల కుటుంబాలకు కుళాయి నీరు అందుతోంది. ఈ లబ్ధిదారులు దళితులు, పేదలు, గిరిజనులు, గ్రామీణ ప్రాంతాల వారు.
‘ఓకల్ ఫర్ లోకల్’ నినాదం స్థానికంగా వ్యాపార అభివృద్ధికి మంత్రంగా మారింది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఇప్పుడు ఒక జిల్లా- ఒక ఎగుమతిగా కొనసాగుతోంది. 
పునరుత్పాదక వనరుల్లో భారతదేశం ముందుంది.
భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడులు చేస్తే 140 కోట్ల మంది భారతీయులు గర్వపడ్డారు.
భారత్‌లో సంస్కరణల సంప్రదాయం కొత్త దారి పట్టింది. ప్రజల మాపై విశ్వాసం ఉంచారు. 
సామాన్యులు మార్పు కోరుకున్నారు. వాటిని నెరవేర్చేవారు లేని సమయంలో మాకు అవకాశం వచ్చింది. మేం పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక సంస్కరణలు చేశాం.
సంస్కరణలు గులాబీ పత్రికల సంపాదకీయం కోసం కాదు.. నాలుగు రోజుల చర్చల కోసమూ కాదు. దేశం బలోపేతం కావడానికి.. ఇది వృద్ధికి సంబంధించిన బ్లూప్రింట్‌.
నేను ఒక కారణం కోసం రాజకీయాల్లో ఉన్నాను. నేషన్‌ ఫస్ట్‌.. మేక్‌ ఇండియా గ్రేట్‌ అనేదే లక్ష్యం. 
గడిచిన పదేళ్లలో బ్యాంకింగ్‌ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టాం. గతంలో ఈ రంగంలో ఎలాంటి అభివృద్ధి, నమ్మకం లేదు. స్కామ్‌ల కారణంగా మన బ్యాంకులు ఇబ్బందులు పడ్డాయి. మేం అనేక సంస్కరణలు చేశాం. నేడు భారతీయ బ్యాంకులు ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాంకుల జాబితాలో ఉన్నాయి. బ్యాంకుల ద్వారా అందజేసే రుణాల ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. MSMEలు బలోపేతం అయ్యాయి.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. సౌకర్యాల కోసం పౌరులు ప్రభుత్వాన్ని అడుక్కొనే పరిస్థితి ఉండేది. నేడు పరిస్థితి పోయింది. విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్లు, నీటి కనెక్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వమే ఇళ్లకు వెళ్తోంది.
ఇండియా ముందుకు సాగుతోంది. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు అనేక విధానాలు ఉన్నాయి.
25 ఏళ్ల యువకుడు గత 10 ఏళ్లలో తన కళ్ల ముందు అభివృద్ధిని చూశాడు. కొత్త ఆత్మవిశ్వాసం పొందాడు. కొత్త ఉపాధి అవకాశాలు సాధించాడు.
యువత ఇకపై నెమ్మదిగా వెళ్లకూడదు. ఇది భారతదేశపు స్వర్ణయుగం. మనం దానిని వృథా చేయకూడదు. మన కలలను ముందుకు తీసుకెళ్లాలి. వికసిత్‌ భారత్ 2024 లక్ష్యాన్ని సాధిస్తాం.
నేడు అన్ని రంగాలకు వ్యవస్థీకృత రంగం ఉంది. మేం ప్రపంచంలోని అత్యుత్తమ పద్ధతులను అనుసరిస్తున్నాం. ప్రతి రంగానికి ఆవిష్కరణ, సాంకేతికత అవసరం. మా విధానాల కారణంగా ప్రతి రంగం కొత్త దిశగా సాగుతోంది. 
గత పదేళ్లలో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో భాగస్వాములు అయ్యారు. భారతీయ మహిళలు స్వతంత్రులు అవుతున్నందుకు గర్విస్తున్నాను. స్వయం సహాయక సంఘాలకు ఇక నుంచి రూ.20 లక్షలు అందిస్తాం. స్వయం సహాయక సంఘాలకు ఇప్పటి వరకు రూ.9 లక్షల కోట్లు ఇచ్చాం.
భారతదేశ CEOలు ప్రపంచ వేదికపై ఉన్నారు. అంతరిక్ష రంగం మన భవిష్యత్తు. అంతరిక్ష రంగంలో మనకు చాలా స్టార్టప్‌లు ఉన్నాయి. మనం ప్రైవేట్ ఉపగ్రహాలు, రాకెట్లను అంతరిక్షంలోకి పంపే స్థాయికి ఎదిగాం. 
అభివృద్ధిని వేగవంతం చేసిన రెండు అంశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మౌలిక సదుపాయాలు... రైల్వేలు, రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, కళాశాలలు, ఫైబర్ నెట్‌వర్క్‌లు, పక్కా గృహాలు, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధి చేశాం. భారతదేశంలోని ప్రతి మూలకు చేరుకున్నాం. దళితులు, ఆదివాసీలు, వికలాంగులు, అందరికీ చేరువయ్యాం. ఈ పరిణామాల వల్ల మన యువతే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. 
2047 లక్ష్యాన్ని సాధించడానికి పాలనలో సంస్కరణలను ముందుకు తీసుకురావాలి. పాలనలో డెలివరీ వ్యవస్థను పటిష్టం చేయాలి. చిన్న చిన్న లక్ష్యాలను నెరవేరుస్తాం. 
భారతదేశం నేడు ఆశలతో నిండిపోయింది. యువత కొత్త శిఖరాలను అధిరోహించాలని, ప్రతి రంగానికి ఊతమివ్వడమే లక్ష్యం. ప్రతి రంగంలోనూ అవకాశాలను కల్పించాలని, తగిన మౌలిక సదుపాయాలను కల్పించాలి. యువత ఆశయాలు నెరవేరాలనే ఆకాంక్షలు సమాజానికి ఉన్నాయి.
భారతదేశ ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. భారతదేశం సరైన దిశలో, సరైన వేగంతో ముందుకు సాగుతోంది. 
కోవిడ్-19 సమయంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. మతం, కులాలకు అతీతంగా ప్రతి ఇంటి వారి ఇంటిపై తిరంగా ఉంటే, భారతదేశం సరైన దిశలో పయనిస్తోందన్న విశ్వాసాన్ని నాకు కలిగిస్తుంది.
ప్రధానమంత్రి జన్మన్ ద్వారా గిరిజనులకు సహాయం అందినప్పుడు, అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. 
వర్కింగ్‌ ఉమెన్స్‌ ఇప్పుడు 12 వారాల నుంచి 26 వారాల వేతనంతో కూడిన సెలవులు పొందుతున్నారు. 
కొత్త క్రిమినల్ చట్టాల్లో శిక్ష కంటే మేము న్యాయానికి ప్రాధాన్యమిచ్చాం. 
ప్రపంచ వృద్ధిలో భారతదేశ సహకారం పెరిగింది. దేశ ఎగుమతులు పెరిగాయి. దేశానికి మధ్య తరగతి చాలా ఇస్తుంది. నాణ్యమైన జీవితాన్ని ఆశిస్తుంది.
ట్రాన్స్‌జెండర్లు కొత్త చట్టాలు, సంస్కరణలను పొందుతున్నారు. వారికి సమాజంలో గుర్తింపు వస్తుంది.
60 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాది. ప్రతి భారతీయుడికి సేవ చేయాలని కోరుకుంటున్నాం.
నాకు ఈ అవకాశం ఇచ్చిన 140 కోట్ల మంది భారతీయులకు ధన్యవాదాలు. మేము కొత్త శిఖరాలను చేరుకుంటామని నమ్ముతున్నాం. గత 10 ఏళ్లలో ఏం చేసినా మేం సంతృప్తి చెందలేదు. 
విక్షిత్ భారత్‌కు కొత్త విద్యా విధానం కీలకం. మధ్య తరగతి వారు విదేశాల్లో చదువుకోవడానికి లక్షలు వెచ్చించకూడదు. ప్రతి భారతీయుడు తప్పనిసరిగా దేశంలో చదువుకోవాలి. మనం నలంద స్ఫూర్తిని రగిలించాలి.
జాతీయ విద్యా విధానం (NEP) మాతృభాషపై దృష్టి సారించింది. కలలు సాధించుకోవడానికి భాష అడ్డంకి కాకూడదు. అందుకే మాతృభాషలో విద్యాభ్యాసం ముఖ్యం.
ప్రపంచం మారుతున్న కొద్దీ నైపుణ్యానికి ప్రాధాన్యత పెరిగింది. వ్యవసాయం సహా అన్ని రంగాల్లో నైపుణ్యాభివృద్ధిని కోరుకుంటున్నాం.
పరిశోధనలు కీలకంగా మారాయి. యువత ఆలోచనలు వాస్తవరూపం దాల్చేలా పరిశోధనల కోసం రూ.లక్ష కోట్లు కేటాయించాం.
దాదాపు 25 వేల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు రానున్నాయి.
సాంకేతికత, మార్కెటింగ్‌ ద్వారా రైతును ఆదుకుంటున్నారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ప్రపంచం సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ వైపు కదులుతోంది. సేంద్రీయ ఆహారానికి ప్రాధాన్యత ఉంది. భారతదేశం ప్రపంచంలోని సేంద్రియ ఆహార బుట్టగా మారవచ్చు.
మేము రైతుల జీవితాలను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రైతులకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించడం ద్వారా వారి పిల్లలు నాణ్యమైన విద్యను పొందుతున్నారు.
ఆందోళన కలిగించే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. మహిళలను ఇంకా హింసిస్తున్నారు. దీనిపై ప్రజల్లో కోపం ఉంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిపై త్వరితగతిన విచారణ జరిపి న్యాయం చేస్తాం.
ఒక సంఘటన జరిగినప్పుడు చాలా వార్తలు వస్తుంటాయి. కానీ, నేరస్థులకు శిక్ష పడుతుందనే మాట మాత్రం ఉండదు. అందుకే భయం లేదు. మహిళలను వేధించేవారిలో భయాందోళనలను కలిగించాలి.
భారతీయ బొమ్మలు ఇప్పుడు ఎగుమతి అవుతున్నాయి. ఒకప్పుడు మొబైల్ ఫోన్లు దిగుమతి అయ్యేవి, ఇప్పుడు మనం ఎగుమతి చేస్తున్నాం.
సెమీ కండక్టర్ తయారీలో మనం పని ప్రారంభించాం. ప్రపంచానికి ఎండ్-టు-ఎండ్ పరిష్కారాలను అందిస్తున్నాం.
5G కనెక్టివిటీ దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరించింది. ఇప్పటికే 6G కనెక్టివిటీ కోసం పని ప్రారంభించాం.
రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలి. మనం రక్షణ పరికరాల తయారీని ప్రారంభించాం. ఎగుమతి చేయడమూ మొదలుపెట్టాం. 
భారతదేశం త్వరలో ప్రపంచ తయారీ కేంద్రంగా మారనుంది. చాలా పెద్ద కంపెనీలు నేడు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాయి. ఇదొక సువర్ణావకాశం. విదేశీ పెట్టుబడులను స్వాగతించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఒంటరిగా పనిచేయదు. రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో చేతులు కలపాలి. దీనివల్ల రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది.

44

రాజకీయాల్లో యువ రక్తానికి ప్రధాన్యం

‘నాణ్యమైన ఉత్పత్తులకు భారతదేశం గమ్యం కావాలి. భారతీయ ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణంగా మార్చేందుకు కృషి చేయాలి. ఇది ఉత్పత్తులు, సేవల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
డిజైన్ ఇన్ ఇండియా, డిజైన్ ఫర్ ది వరల్డ్ మన నినాదం కావాలి. మనదేశంలో గేమింగ్ పరిశ్రమ బూమ్‌లో ఉంది. దేశ యువత కేవలం ఆడటంలోనే కాకుండా గేమ్‌లను ఉత్పత్తి చేయడంలో కూడా గేమింగ్ పరిశ్రమకు నాయకత్వం వహించాలని నేను కోరుకుంటున్నాను. భారత ఆటలు ప్రపంచానికి చేరువ కావాలి.
గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక సమస్య. కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రపంచానికి చూపించాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాం. రాబోయే కొన్నేళ్లలో కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గేందుకు ప్రయత్నిస్తున్నాం.
జీ20 దేశాల్లో భారత్‌ మాత్రమే పారిస్‌ ఒప్పందం లక్ష్యాన్ని సాధించింది. మనం సౌరశక్తికి మారినందున విద్యుత్ బిల్లు త్వరలో ఉచితం అవుతుంది. 
గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీకి గ్లోబల్ హబ్‌గా మారాలనుకుంటున్నాం. వాతావరణ మార్పుల ఆందోళన ఉన్నప్పటికీ, గ్రీన్ ఉద్యోగాలకు అవకాశం ఉంది.
ఒలింపిక్ అథ్లెట్లను అభినందిస్తున్నాను. పారాలింపిక్ అథ్లెట్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 
జీ20కి భారత్ అత్యంత ఘనంగా ఆతిథ్యం ఇచ్చింది. భారతదేశం అతిపెద్ద ఈవెంట్‌లను నిర్వహించగలదనడానికి ఇదే నిదర్శనం. 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
సమాజంలో వెనుకబడిన వారిని ఆదుకోవడం మన కర్తవ్యం. వారిని సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ఇందుకు ఎక్కువ సమయం పట్టదు.
1857లో బ్రిటిష్ వారితో పోరాడిన గిరిజనుడు భగవాన్ భిల్సా ముండా స్ఫూర్తితో వెనుకబడిన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలి. 
భారతదేశ అభివృద్ధిని చూడలేని వారు కొందరున్నారు. అలాంటి వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. వారు అరాచకానికి ముఖంగా మారతారు. అయినా దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం.
దేశంలో అనేక అంతర్గత, బాహ్య సవాళ్లు ఉన్నాయి. మనం బలంగా మారినప్పుడు సవాళ్లు పెరుగుతాయి. అయినా భారతదేశం చలించదు.
మనది బుద్ధుని దేశం, మనం యుద్ధం చేయము. ప్రతి పౌరుడు అవినీతితో విసిగిపోయారు. మేము దాని మీద యుద్ధం చేశాం. 
భారతదేశ అభివృద్ధి గురించి ప్రపంచం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 140 కోట్ల మంది భారతీయుల కలలను సాకారం చేయడమే ముందున్న లక్ష్యం. అవినీతిపరులపై పోరాటం కొనసాగుతుంది. మధ్యతరగతిని దోచుకునే సంప్రదాయానికి స్వస్తి పలకాలి. 
పట్టపగలు అవినీతికి మద్దతిస్తున్న కొందరు వ్యక్తులు ఉన్నారని ఎవరైనా ఊహించగలరా. ఇది ఒక ప్రధాన సవాలు. 
మన పొరుగు దేశాలు శాంతి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాం. బంగ్లాదేశ్‌ అభివృద్ధికి మేం సహకరిస్తాం.
శాంతిభద్రతలు, ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషించిన రాజ్యాంగం 75 ఏళ్లకు చేరువవుతోంది. పౌరులు తమ రాజ్యాంగ విధులను పాటించాలి.
యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేడు మనకున్న సివిల్ కోడ్ కమ్యూనల్ సివిల్ కోడ్. దీనిపై చర్చలు జరగాలి. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించే చట్టాన్ని రద్దు చేయాలి. సెక్యులర్ సివిల్ కోడ్ అమలు చేయాలి.
రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతను గుర్తించాలి. వంశ, కుల రాజకీయాల నుంచి విముక్తి ఉండేలా రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండాలి. మూడో టర్మ్‌లో మూడు రెట్లు వేగంగా పని చేస్తా. నా సమయాన్ని దేశానికే ఇస్తాను.’ అని ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Recommended image2
Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం
Recommended image3
Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved