MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • PM Modi: పీఎం మోడీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు

PM Modi: పీఎం మోడీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు

PM Modi Namibia award: ప్రధాని నరేంద్ర మోడీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం లభించింది. భారత్-నమీబియా సంబంధాల్లో ఇది కీలక ముందడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

3 Min read
Mahesh Rajamoni
Published : Jul 09 2025, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నమీబియాలో ప్రధాని మోడీ పర్యటన
Image Credit : Getty

నమీబియాలో ప్రధాని మోడీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నమీబియా దేశం అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా మిరబిలిస్’ ను అందజేసింది. నమీబియా అధ్యక్షురాలు డా. నెటుంబో నాందీ-ఎండైట్‌వా చేతుల మీదుగా ఈ సత్కారం ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని 1995లో నమీబియా స్వాతంత్య్రానంతరం ఏర్పాటు చేసింది. ఇది దేశంలోని అత్యున్నత పౌర గౌరవంగా పరిగణిస్తారు.

26
‘వెల్విచియా మిరబిలిస్’ అంటే ఏమిటి?
Image Credit : ANI

‘వెల్విచియా మిరబిలిస్’ అంటే ఏమిటి?

ఈ పురస్కారానికి పేరుగా ఉన్న ‘వెల్విచియా మిరబిలిస్’ ఒక అరుదైన, చారిత్రత్మకమైన మొక్క. ఇది నమీబియా ఎడారుల్లో మాత్రమే కనిపించే మొక్కగా ప్రసిద్ధి చెందింది. దీని దీర్ఘాయువు, ధైర్యం, సహనం లక్షణాలుగా ఉండటమే ఈ అవార్డు వెనుక ఉన్న గొప్పతనాన్ని, స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి.

Related Articles

Related image1
PM Modi: ప్రధాని మోడీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం
Related image2
Amazon Prime Day 2025: iPhone 16 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు
36
మోడీకి 27వ అంతర్జాతీయ పురస్కారం
Image Credit : X-@DDNewslive

మోడీకి 27వ అంతర్జాతీయ పురస్కారం

ఈ అవార్డుతో పాటు, ప్రధాని మోడీ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 27 అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. వివిధ దేశాల ప్రధానులతో సుదీర్ఘ దౌత్య సంబంధాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం వంటి వాటికి గుర్తింపుగా ఈ పురస్కారాలు లభించాయి.

 బ్రెజిల్ దేశం ఇచ్చిన ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్’ తర్వాత ఇది మోడీకి లభించిన మరో గొప్ప గౌరవం. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పందిస్తూ, “నమీబియాకు చెందిన అత్యున్నత పౌర పురస్కారం లభించడం నాకు గౌరవంగా ఉంది. ఈ అవార్డును 140 కోట్ల భారతీయుల తరఫున స్వీకరిస్తున్నాను” అని తెలిపారు.

President Dr. Netumbo Nandi-Ndaitwah and I reviewed the full range of India-Namibia relations during our talks today. Cooperation in areas such as digital technology, defence, security, agriculture, healthcare, education and critical minerals figured prominently in our… pic.twitter.com/PdpLFc2U29

— Narendra Modi (@narendramodi) July 9, 2025

46
నమీబియాతో నాలుగు ద్వైపాక్షిక ఒప్పందాలకు భారత్ సంతకాలు
Image Credit : Getty

నమీబియాతో నాలుగు ద్వైపాక్షిక ఒప్పందాలకు భారత్ సంతకాలు

నమీబియా రాజధాని విండ్హోక్‌లో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం, భారత్-నమీబియా మధ్య నాలుగు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. ఇవి ప్రధానంగా ఆరోగ్యం, ఔషధాలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, పునరుత్పాదక ఇంధనాలు వంటి కీలక రంగాల్లో సహకారం పెంపొందించేందుకు దోహదపడతాయి.

ముఖ్య ఒప్పందాలు:

• నమీబియాలో వ్యవస్థాపకత అభివృద్ధి కేంద్రం (Entrepreneurship Development Center) ఏర్పాటు చేయడం

• ఆరోగ్య రంగంలో సహకారం

• నామీబియా సీడీఆర్ఐ (CDRI)లో చేరికకు అంగీకార పత్రం

• గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో సభ్యత్వానికి అంగీకారం

56
నామీబియాలో మోడీ తొలి పర్యటన
Image Credit : Getty

నామీబియాలో మోడీ తొలి పర్యటన

ప్రధాని మోడీ నమీబియాను తొలిసారి సందర్శించారు. గత 30 సంవత్సరాల్లో ఇది మూడవసారి భారత ప్రధానమంత్రి నమీబియా సందర్శించిన సందర్భం కావడం విశేషం. ఆయన బ్రెజిల్ నుండి తన ఐదు దేశాల పర్యటన చివరి దశలో నమీబియాకు చేరుకున్నారు.

విండ్హోక్ చేరుకున్న వెంటనే మోడీ జాతీయ స్మారక స్థలమైన ‘హీరోస్ ఎకర్’ వద్ద నమీబియా స్వాతంత్య్ర పోరాట నేత, మాజీ రాష్ట్రపతి సామ్ నుజోమాకు నివాళులు అర్పించారు.

66
ద్వైపాక్షిక సంబంధాల పరంగా కీలక చర్చలు
Image Credit : Asianet News

ద్వైపాక్షిక సంబంధాల పరంగా కీలక చర్చలు

నమీబియా అధ్యక్షురాలితో మోడీ నిర్వహించిన చర్చలలో డిజిటల్ సాంకేతికత, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఖనిజాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. మోడీ ట్విట్టర్ (X) వేదికగా పేర్కొంటూ, "ఆర్థిక సంబంధాలు, ఇంధనం, పెట్రోరసాయనాల రంగాల్లో సహకారం పెంచే దిశగా చర్చించాం. ప్రాజెక్ట్ చీతా విషయంలో నమీబియా ఇచ్చిన సహకారం పట్ల కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు.

We also discussed how to boost linkages in trade, energy and petrochemicals. Expressed gratitude for the assistance from Namibia in Project Cheetah.@SWAPOPRESIDENT

— Narendra Modi (@narendramodi) July 9, 2025

మోడీకి నమీబియాలో ఘనస్వాగతం, గౌరవ వందనం

పీఎం మోడీకి నమీబియా స్టేట్ హౌస్ వద్ద సాంప్రదాయ ఘనస్వాగతం, గౌరవ వందనం లభించింది. ఈ పర్యటన భారత-ఆఫ్రికా సంబంధాల్లో మరింత నూతన యుగాన్ని ప్రారంభించే అంశంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది భారత్-నమీబియా ద్వైపాక్షిక సంబంధాల్లో మరొక కీలక మైలురాయిగా నిలిచిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Landed in Windhoek a short while ago. Namibia is a valued and trusted African partner with whom we seek to boost bilateral cooperation. Looking forward to meeting President Dr. Netumbo Nandi-Ndaitwah and addressing the Namibian Parliament today.@SWAPOPRESIDENTpic.twitter.com/ox6LEqHOba

— Narendra Modi (@narendramodi) July 9, 2025

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
నరేంద్ర మోదీ
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
రాజకీయాలు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved