MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • భారత భవిష్యత్తు కోసం ప్ర‌ధాని మోడీ 11 తీర్మానాలు

భారత భవిష్యత్తు కోసం ప్ర‌ధాని మోడీ 11 తీర్మానాలు

రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి ప్రజాస్వామ్య మాత భారత రాజ్యాంగమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భారతీయుల కోసం 11 తీర్మానాలు ప్రకటించారు.   

1 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Dec 14 2024, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం భారత రాజ్యాంగం 75 సంవత్సరాలను గర్వించదగిన, వేడుకలు జరుపుకునే సందర్బంగా పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతల దృష్టిని హైలైట్ చేశారు. పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగిస్తూ, రాజ్యాంగ వారసత్వంపై చర్చకు సహకరించిన చట్టసభ సభ్యులు, స్పీకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రగతికి భారత రాజ్యాంగం కారణమని పేర్కొన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ప్రజాస్వామ్య విలువలను సమర్థించినందుకు మిలియన్ల మంది భారతీయులకు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజ్యాంగ నిర్మాతలు ప్రజాస్వామ్యాన్ని 1950లో జన్మించిన భావనగా చూడలేదని నొక్కిచెప్పారు. బదులుగా, వారు వేల సంవత్సరాల పాటు భారతదేశం గొప్ప వారసత్వం నుండి ప్రేరణ పొందారు. ఎన్నో దేశాలకు మన రాజ్యాంగం స్ఫూర్తి అనీ, ప్రజాస్వామ్య పండుగను నిర్వహించుకోవడం దేశానికి గర్వపడే క్షణాలుగా ప్రధాని పేర్కొన్నారు. 

34

దేశాభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషించారనీ, ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు గౌరవం దక్కాలనీ, దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చాలని పేర్కొన్నారు. అలాగే, ఆర్టికల్ 370 భారత ఐక్యతకు అవరోధంగా పేర్కొంటూ, దానిని రద్దు చేయాలనే తన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సమర్థించారు. "జాతీయ ఐక్యత మా ప్రధాన ప్రాధాన్యత" అని ఆయన ప్రకటించారు. 

44

ఈ క్రమంలోనే ప్రభుత్వం, ప్రజలు తమ విధిని నిర్వర్తించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ.. భారతీయులు పాటించాల్సిన 11 తీర్మానాలు ప్రకటించారు. అవి:

1. ప్రభుత్వం, ప్రజలు తమ విధిని నిర్వర్తించాలి. 
2. అవినీతిని సహించకూడ‌దు.
3. చట్టం అమలు పట్ల ప్రజలు గర్వపడాలి.
4. స్లేవరీ మైండ్‌సెట్ నుండి బయటపడాలి.
5. రాజకీయాల్లో బంధుప్రీతి తొలగిపోతుంది. 
6. రాజ్యాంగాన్ని గౌరవించడం.
7. రిజర్వేషన్లు లాక్కోకూడదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదు.
8. మహిళలు అభివృద్ధిలో ముందుండాలి.
9. రాజ్య సే రాష్ట్ర కా వికాస్
10. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్
11. సబ్కా సాత్ సబ్కా వికాస్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
CJP: ఒక్క కామెంట్.. ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ రీల్.. కేంద్ర మంత్రిని కుర్చీ దింపేసిన Gen Z పవర్ !
Recommended image2
ఎవరీ ప్రహ్లాద్ జోషి.? మోదీ ఈయననే కొత్త విద్యా శాఖ మంత్రిగా ఎందుకు సెలక్ట్ చేశారు.?
Recommended image3
NEET Leak: ఎట్టకేలకు ఆందోళనలకు ఫుల్‌స్టాప్‌.. కేంద్రంతో చ‌ర్చ‌ల అనంత‌రం కాక్రోచ్ పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved