MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Malegaon Blast Case: 17 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురు నిర్దోషులే..

Malegaon Blast Case: 17 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురు నిర్దోషులే..

Malegaon Blast Case Verdict 2025: మహారాష్ట్రలోని మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు (NIA court) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ (Pragya Singh Thakur) సహా మొత్తం ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది

2 Min read
Rajesh K
Published : Jul 31 2025, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సంచలన తీర్పు
Image Credit : X

సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మహారాష్ట్రలోని మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో (Malegaon blast case)ముంబయి లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు (NIA court judgment) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ (Pragya Singh Thakur) సహా మొత్తం ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.

25
అసలేం జరిగింది?
Image Credit : our own

అసలేం జరిగింది?

మహారాష్ట్రలోని మాలేగావ్ లో 2008 సెప్టెంబర్ 29న మసీదు సమీపంలో జరిగిన పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 101 మంది తీవ్రంగా గాయపడ్డారు. బైక్ కు అమర్చిన ఐఈడీ బాంబు కారణంగా ఈ పేలుడు సంభవించింది. మొదట ఈ కేసును మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం విచారణ చేపట్టింది. ఆ తర్వాత 2011 లో ఈ కేసు ఎన్ఐఏకు అప్పగించారు.

Related Articles

Related image1
మాలేగావ్ పేలుళ్లు.. నిందితులపై ఉగ్రకుట్ర అభియోగం
Related image2
నేటినుంచి ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు..
35
17 ఏళ్ల తరువాత తుది తీర్పు
Image Credit : our own

17 ఏళ్ల తరువాత తుది తీర్పు

మాలేగావ్ కేసు దర్యాప్తు దాదాపు 17 ఏళ్లపాటు సాగింది. ఈ కేసులో కోర్టు 323 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను, 8 మంది డిఫెన్స్ సాక్షులను విచారించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, ఆయుధ చట్టం, అన్ని ఇతర అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ తో సహా ఏడుగురు నిర్దోషులేనని ఎన్ఐఏ కోర్టు తుదితీర్పు వెలువరించింది.

45
కేసులో ట్విస్ట్ అదే..
Image Credit : Getty

కేసులో ట్విస్ట్ అదే..

ఈ కేసులో సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేశ్ ఉపాధ్యాయ్, సుధాకర్ చతుర్వేది, అజయ్ రాహిర్కర్, శంకరాచార్య, సమీర్ కులకర్ణి తో పాటు మరో ఐదుగురు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ ని ప్రధాన నిందితురాలు ఆరోపించారు. ఈ పేలుడుకు ఉపయోగించిన బైక్ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ పేరుతో రిజిస్టర్ అయిందనీ ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో ఈ కేసు దర్యాప్తు సర్వత్రా ఉత్కంఠ రేపింది.

55
కోర్టు ఏం చెప్పిందంటే.. ?
Image Credit : Getty

కోర్టు ఏం చెప్పిందంటే.. ?

దాదాపు 17 సంవత్సరాల తర్వాత, ముంబైలోని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కోర్టు గురువారం 2008 మాలేగావ్ పేలుళ్ల కేసుపై తీర్పు వెలువరించింది. మాజీ BJP ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, మాజీ ఆర్మీ అధికారి శ్రీకాంత్ పురోహిత్ సహా ఏడుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. మరణించిన బాధితులకు రూ. 2 లక్షలు , గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
వైరల్ న్యూస్
రాజకీయాలు
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved