MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • IRCTC New Rule: రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు కొత్త రూల్స్

IRCTC New Rule: రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు కొత్త రూల్స్

IRCTC New Rule:మే 1 నుండి భారతీయ రైల్వేలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్న ప్రయాణికులు స్లీపర్ లేదా ఏసీ బోగీలలో ప్రయాణించడానికి అనుమతి లేదు. కన్ఫర్మ్ టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాలతో పాటు కఠిన చర్యలు ఉంటాయి. 

1 Min read
Mahesh Rajamoni
Published : May 05 2025, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు

వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో రైళ్లలో ప్రయాణించే వారికి ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మే 1 నుండి, వెయిటింగ్ లిస్ట్ ఉన్న ప్రయాణికులు స్లీపర్ లేదా ఏసీ బోగీలలో ప్రయాణించడానికి అనుమతించరు.

25

రైలు ప్రయాణ రద్దీని తగ్గించే చర్యలు

కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికుల ఇబ్బందిని తప్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. పండుగ సమయాల్లో రైళ్లలో రద్దీ తగ్గుతుంది. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని రైల్వే అధికారులు పేర్కొన్నారు. 

Related Articles

Related image1
Earthquake In Pakistan: పాకిస్థాన్‌లో భూకంపం.. 4.2 తీవ్రతతో ప్రకంపనలు
Related image2
Credit cards: ఈ క్రెడిట్ కార్డ్స్ తో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు.. ఎలాగంటే..?
35

రైల్వేలో కొత్త నియమాలు

కొత్త నియమం అమలులోకి వస్తున్నందున, మే 1 నుండి రైళ్లలో స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించేవారు నిబంధనలు పాటించాలి. ప్రయాణంలో ఇబ్బంది తప్పించుకోవడానికి టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. టిక్కెట్ లేకుండా ప్రయాణం చేసే వారికి జరిమానాతో పాటు ఇతర చర్యలు తీసుకోనున్నారు. 

45

రైల్వే నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు

కన్ఫర్మ్ టికెట్ లేకుండా ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణించడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే, స్లీపర్ కి 250 రూపాయలు, ఏసీకి 440 రూపాయల జరిమానాతో పాటు ప్రయాణించిన దూరానికి ఛార్జీలు చెల్లించాలి. అలాగే, జరిమానాతో పాటు ఇతర చర్యలు కూడా తీసుకుంటామని భారతీయ రైల్వే హెచ్చరించింది. 

55

టీటీఈలు ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి. వెయిటింగ్ లిస్ట్ టికెట్ తో రిజర్వ్డ్ బోగీలో ఎక్కితే, తదుపరి స్టేషన్లో దిగమని చెప్పి, జరిమానా విధిస్తారు. చాలా సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved