Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • IRCTC New Rule: రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు కొత్త రూల్స్

IRCTC New Rule: రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు కొత్త రూల్స్

IRCTC New Rule:మే 1 నుండి భారతీయ రైల్వేలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్న ప్రయాణికులు స్లీపర్ లేదా ఏసీ బోగీలలో ప్రయాణించడానికి అనుమతి లేదు. కన్ఫర్మ్ టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాలతో పాటు కఠిన చర్యలు ఉంటాయి. 

Mahesh Rajamoni | Published : May 05 2025, 05:49 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు

వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో రైళ్లలో ప్రయాణించే వారికి ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మే 1 నుండి, వెయిటింగ్ లిస్ట్ ఉన్న ప్రయాణికులు స్లీపర్ లేదా ఏసీ బోగీలలో ప్రయాణించడానికి అనుమతించరు.

25
Asianet Image

రైలు ప్రయాణ రద్దీని తగ్గించే చర్యలు

కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికుల ఇబ్బందిని తప్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. పండుగ సమయాల్లో రైళ్లలో రద్దీ తగ్గుతుంది. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని రైల్వే అధికారులు పేర్కొన్నారు. 

Related Articles

Earthquake In Pakistan: పాకిస్థాన్‌లో భూకంపం.. 4.2 తీవ్రతతో ప్రకంపనలు
Earthquake In Pakistan: పాకిస్థాన్‌లో భూకంపం.. 4.2 తీవ్రతతో ప్రకంపనలు
Credit cards: ఈ క్రెడిట్ కార్డ్స్ తో  ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు.. ఎలాగంటే..?
Credit cards: ఈ క్రెడిట్ కార్డ్స్ తో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు.. ఎలాగంటే..?
35
Asianet Image

రైల్వేలో కొత్త నియమాలు

కొత్త నియమం అమలులోకి వస్తున్నందున, మే 1 నుండి రైళ్లలో స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించేవారు నిబంధనలు పాటించాలి. ప్రయాణంలో ఇబ్బంది తప్పించుకోవడానికి టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. టిక్కెట్ లేకుండా ప్రయాణం చేసే వారికి జరిమానాతో పాటు ఇతర చర్యలు తీసుకోనున్నారు. 

45
Asianet Image

రైల్వే నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు

కన్ఫర్మ్ టికెట్ లేకుండా ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణించడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే, స్లీపర్ కి 250 రూపాయలు, ఏసీకి 440 రూపాయల జరిమానాతో పాటు ప్రయాణించిన దూరానికి ఛార్జీలు చెల్లించాలి. అలాగే, జరిమానాతో పాటు ఇతర చర్యలు కూడా తీసుకుంటామని భారతీయ రైల్వే హెచ్చరించింది. 

55
Asianet Image

టీటీఈలు ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి. వెయిటింగ్ లిస్ట్ టికెట్ తో రిజర్వ్డ్ బోగీలో ఎక్కితే, తదుపరి స్టేషన్లో దిగమని చెప్పి, జరిమానా విధిస్తారు. చాలా సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
భారత దేశం
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Bengaluru stampede: ఆర్సీబీ, కేఎస్‌సీఏ ప్రతినిధుల అరెస్టుకు సీఎం ఆదేశాలు
Bengaluru stampede: ఆర్సీబీ, కేఎస్‌సీఏ ప్రతినిధుల అరెస్టుకు సీఎం ఆదేశాలు
Holiday: ప‌బ్లిక్ హాలీడే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Holiday: ప‌బ్లిక్ హాలీడే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Mahua Moitra: 65 ఏళ్ల వ్యక్తితో మహువా మోయిత్రా సీక్రెట్ పెళ్లి.. ఎవరీ పినాకీ మిశ్రా?
Mahua Moitra: 65 ఏళ్ల వ్యక్తితో మహువా మోయిత్రా సీక్రెట్ పెళ్లి.. ఎవరీ పినాకీ మిశ్రా?
Top Stories