Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • National
  • Operation Sindhoor: పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను Pubg లో లేపినట్లు లేపేశారు

Operation Sindhoor: పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను Pubg లో లేపినట్లు లేపేశారు

 భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన “ఆపరేషన్ సింధూర్”లో సూసైడ్ డ్రోన్లు (Loitering Munitions) కీలకంగా పనిచేశాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)తో పాటు పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై జరిగిన ఈ ప్రతీకార దాడుల్లో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ డ్రోన్లు వాడడం జరిగింది.

Bhavana Thota | Published : May 07 2025, 05:18 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
సూసైడ్ డ్రోన్లు..ఆపరేషన్ సింధూర్‌లో వీటి ఉపయోగం:

సూసైడ్ డ్రోన్లు..ఆపరేషన్ సింధూర్‌లో వీటి ఉపయోగం:

భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన “ఆపరేషన్ సింధూర్”లో సూసైడ్ డ్రోన్లు (Loitering Munitions) కీలకంగా పనిచేశాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)తో పాటు పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై జరిగిన ఈ ప్రతీకార దాడుల్లో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ డ్రోన్లు వాడినట్లు తెలుస్తుంది.

25
సూసైడ్ డ్రోన్లు అంటే ఏమిటి?

సూసైడ్ డ్రోన్లు అంటే ఏమిటి?

సూసైడ్ డ్రోన్‌ లేదా లోయిటరింగ్ మ్యూనిషన్ అనేది ఒక రకమైన ఆటోనమస్ ఆయుధం. ఇవి సాధారణ డ్రోన్లలా గాలిలో తిరుగుతాయి, కానీ లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే దానిపై నేరుగా దూకి పేలుతాయి. అందుకే వీటిని “కామికాజే డ్రోన్లు” అని కూడా పిలుస్తారు.

Related Articles

Operation sindoor: పాక్ ఉగ్ర‌మూక‌ల‌పై భార‌త్ మెరుపు దాడి.. ఫొటోలు చూశారా
Operation sindoor: పాక్ ఉగ్ర‌మూక‌ల‌పై భార‌త్ మెరుపు దాడి.. ఫొటోలు చూశారా
Operation Sindhoor : మీరు తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
Operation Sindhoor : మీరు తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
35
ఈ డ్రోన్ల ప్రత్యేకతలు:

ఈ డ్రోన్ల ప్రత్యేకతలు:

లక్ష్యాన్ని ట్రాక్ చేసి దాడి చేయగలిగే సామర్థ్యం

  • దృఢమైన నిఘా వ్యవస్థ: ముందుగా గాలిలో తిరుగుతూ లక్ష్యాలను గుర్తిస్తుంది.

  • ఆటోనమస్ వ్యవస్థ: మానవ జోక్యం లేకుండా పని చేయగలగడం.

  • హై ప్రిసిషన్: అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని దెబ్బతీయగల సామర్థ్యం.

  • కొనసాగే నిఘా + దాడి – ఒకే యంత్రంతో నిఘా, దాడి రెండూ ఉన్నాయి.

45
రాజకీయ నాయకుల స్పందన:

రాజకీయ నాయకుల స్పందన:

ఈ ఆపరేషన్‌ను అన్ని పార్టీల నేతలు ప్రశంసించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ “భారత్ మాతా కీ జై” అంటూ ట్వీట్ చేశారు. పీయూష్ గోయల్, హిమంత బిశ్వ శర్మ, యోగి ఆదిత్యనాథ్, ప్రియాంక చతుర్వేది, ఆదిత్య ఠాక్రే, తేజస్వి యాదవ్ వంటి నేతలంతా భారత సైన్యాన్ని అభినందించారు.

55
పాకిస్తాన్ స్పందన:

పాకిస్తాన్ స్పందన:

భారతదేశం ఖచ్చితమైన ఉగ్రవాద లక్ష్యాలను టార్గెట్ చేయగా, పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్‌లోని భింబర్ గాలి ప్రాంతంలో కాల్పులకు తెగబడింది. దీనిపై భారత సైన్యం “తగిన విధంగా” స్పందించిందని అధికారులు వెల్లడించారు.

పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత భూభాగం నుంచే ఈ సూసైడ్ డ్రోన్లతో దాడులు జరిగాయి. ఈ డ్రోన్లు జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తొయిబా వంటి ఉగ్రవాద లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించాయి.

భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులు పూర్తిగా ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే జరిగాయని స్పష్టం చేసింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా పెట్టలేదని వివరించింది.

మొత్తంగా, సూసైడ్ డ్రోన్ల వాడకంతో భారత సైన్యం మరింత ధూఢంగా, ఆధునికంగా మారింది. ఈ కొత్త తరం టెక్నాలజీ భవిష్యత్ ఆపరేషన్లకు మార్గదర్శకంగా నిలుస్తోంది.

Bhavana Thota
About the Author
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. Read More...
ఆపరేషన్ సింధూర్
భారత దేశం
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories