Minimum and Maximum Pension పింఛనే రూ.లక్ష.. ఇంతకన్నాఏం కావాలి?
8వ వేతన సంఘం సిఫార్సుల అమలుతో పింఛన్ దారులు భారీగా లబ్ది పొందనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ జనవరి 16న 8వ వేతన సంఘం ఏర్పాటుకు సిఫార్సు చేసింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
8వ వేతన సంఘం
ప్రధాని మోడీ కేబినెట్ జనవరి 16న 8వ వేతన సంఘం ఏర్పాటుకు సిఫార్సు చేసింది. 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు ఇది లబ్ధి చేకూరుస్తుంది.
కోటి కుటుంబాలకులాభం
8వ వేతన సంఘం ద్వారా సవరించిన జీతాలు, భత్యాలతో దాదాపు కోటి కుటుంబాలు లబ్ధి పొందుతాయి. ఇది వాళ్లకెంతో ప్రయోజనకరం.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్
వేతన సంఘం 1.92 నుండి 2.86 మధ్య ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను నిర్ణయిస్తుందని మీడియా కథనాలు సూచిస్తున్నాయి, ఇది జీతాలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.
జీతం పెరుగుదల
2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో, కనీస ప్రాథమిక జీతం నెలకు రూ.18,000 నుండి రూ.51,480 కి పెరుగుతుంది. అంటే దాదాపు మూడు రెట్ల పెరుగుదల.
పెన్షన్ పెరుగుదల
ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనీస పెన్షన్ను రూ.9,000 నుండి రూ.25,740కి పెంచుతుంది. గరిష్ఠ పెన్షన్ లక్ష రూపాయలు దాటవచ్చు.
అమలు వచ్చే ఏడాది?
8వ వేతన సంఘం వచ్చే ఏడాది అమలు కావచ్చు. కేంద్రం ఈ ఏడాది కేంద్ర ఉద్యోగులకు DA ప్రకటించలేదు, దీంతో 8వ వేతన సంఘంపై ఊహాగానాలు పెరిగాయి.
చాలా కాలం నాటి డిమాండ్
8వ వేతన సంఘం అమలు చాలా కాలంగా ఉన్న డిమాండ్. కొత్త డీఏ కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఉద్యోగులకు చివరిసారిగా గత దీపావళిన DA పెంచారు.