MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • ahmedabad plane crash: ప్రమాదానిక గురైన ఎయిరిండియా విమానం నడిపిన పైలట్లు ఎవరు?

ahmedabad plane crash: ప్రమాదానిక గురైన ఎయిరిండియా విమానం నడిపిన పైలట్లు ఎవరు?

ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానాన్ని కేప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుండర్ నడిపిస్తున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 12 2025, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానం
Image Credit : Asianet News

అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానం

గురువారం అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా విమానాన్ని నడిపించిన పైలట్లు ఎవరో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. AI 171 నంబర్‌ కలిగిన ఈ విమానం మధ్యాహ్నం 1:39 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయంలోని రన్‌వే 23 నుంచి లండన్ గట్విక్‌ విమానాశ్రయానికి బయలుదేరింది.

అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేడే (Mayday) కాల్ ఇచ్చిన ఈ విమానం, ఆ తర్వాత ఏటీసీ (Air Traffic Control) సంకేతాలకు స్పందించలేదు. పక్కనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానాన్ని నడిపించిన పైలట్లు ఎవరు?
Image Credit : CISF/X

ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానాన్ని నడిపించిన పైలట్లు ఎవరు?

ఈ విమానాన్ని కేప్టెన్ సుమీత్ సభర్వాల్ నడిపించారు. ఆయన ప్రధాన పైలట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు 8200 గంటల ఫ్లైయింగ్‌ అవర్స్‌ అనుభవం, ఎల్టీసీ (Line Training Captain) అనుభవం ఉన్నట్టు సమాచారం. 

ఆయనతో పాటు ఫస్ట్ ఆఫీసర్ (First Officer) క్లైవ్ కుండర్ ఉన్నారు. క్లైవ్‌కు 1100 గంటల ఫ్లయింగ్ అనుభవం మాత్రమే ఉంది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు, వీరిలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు.

Related Articles

Related image1
ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ ఆరా.. సహాయక చర్యలు ముమ్మరం
Related image2
Vijay Rupani: ఎయిరిండియా విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ మరణించారా?
35
ahmedabad plane crash: ఫస్ట్ ఆఫీసర్ అంటే ఎవరు?
Image Credit : ANI

ahmedabad plane crash: ఫస్ట్ ఆఫీసర్ అంటే ఎవరు?

ఒక విమానాన్ని నడిపించేటప్పుడు సాధారణంగా ఇద్దరు పైలట్లు ఉంటారు. ఒకరు కేప్టెన్ కాగా, మరొకరు ఫస్ట్ ఆఫీసర్ అవుతారు. ఫస్ట్ ఆఫీసర్ సాధారణంగా జూనియర్ పైలట్ అవుతారు. వారికి అనుభవం పెరిగిన తర్వాత, సుమారు ఐదేళ్ల తర్వాత, కేప్టెన్‌గా పదోన్నతి పొందుతారు. ఈ విమానంలో క్లైవ్ కుండర్ ఫస్ట్ ఆఫీసర్‌గా ఉన్నారు.

45
అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద వివరాలు
Image Credit : ANI

అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద వివరాలు

విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎటీసీకి మేడే సంకేతం ఇచ్చింది. ఆ తర్వాత ఏ సంకేతాలకు స్పందన రాలేదు. విమానం ఎయిర్‌పోర్ట్ దగ్గరలోనే కూలిపోయింది. ఘటనా స్థలంలో పెద్దగా నలుపు పొగలు కనిపించాయి. ప్రస్తుతం అధికారులు ప్రాణనష్టం వివరాలను వెల్లడించలేదు.

ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఎయిరిండియా, డీజీసీఏ అధికారికంగా ప్రకటించనున్నారు. పైలట్ల అనుభవం, టేకాఫ్ సమయంలో ఏర్పడిన సాంకేతిక లోపాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

55
విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ, అమిత్ షా స్పందన
Image Credit : Asianet News

విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ, అమిత్ షా స్పందన

ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు స్పందించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాన మోడీ అధికారులను, సంబంధిత శాఖ మంత్రిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అమిత్ షా సహాయక చర్యలపై ఆరా తీశారు. కేంద్రం బాధితులకు అండగా ఉంటుందని తెలిపారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
నరేంద్ర మోదీ
అమిత్ షా

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Recommended image3
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Related Stories
Recommended image1
ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ ఆరా.. సహాయక చర్యలు ముమ్మరం
Recommended image2
Vijay Rupani: ఎయిరిండియా విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ మరణించారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved