MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • National
  • 8th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ... భారీగా జీతాలు పెరిగే ఛాన్స్, ఎంతో తెలుసా?

8th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ... భారీగా జీతాలు పెరిగే ఛాన్స్, ఎంతో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 8వ వేతన సంఘం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ వేతన సంఘం ఏర్పాటుతో ఏం జరగనుంది?

2 Min read
Author : Arun Kumar P
| Updated : Dec 06 2024, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
8th Pay Commission

8th Pay Commission

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే గుడ్ న్యూస్ వినే అవకాశం వుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది. దీని సిపార్సుల ఆధారంగానే ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. అందువల్లే 8వ వేతన సంఘం ఏర్పాటు, అది చేసే సిఫారసులు గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఆసక్తిగా వేచిచూస్తున్నారు. 

8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత మినిమం బేసిక్ పే ను రూ.18,000 నుండి రూ.34,500 కు పెంచే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. మరి 8వ వేతన సంఘం సిపార్సులు ఎలా వుంటాయో చూడాలి. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
8th Pay Commission

8th Pay Commission

అసలు ఏమిటీ పే కమీషన్ : 

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఫించనుదారులకు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా జీతాలను, అలవెన్సులను, పెన్షన్ ప్యాకేజీలను సవరించడానికి ఏర్పాటుచేసేవే ఈ పే కమీషన్స్ (వేతన సంఘాలు). ప్రస్తుతకాలంలో మనిషి జీవన వ్యయాలు  రోజురోజులు కు పెరుగుతున్నాయి... దీంతో ఆర్థిక అవసరాలు ఎక్కువయ్యాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక అవసరాలను తగ్గట్లుగా జీతాలను, అలవెన్సులను నిర్ణయించే బాధ్యత ఈ పే కమీషన్ కు అప్పగిస్తుంది ప్రభుత్వం. 

పదేళ్లకు ఓసారి వేతన సంఘాన్ని ఏర్పాటుచేసి ఉద్యోగుల జీతాలు, అలవెన్సులను సవరిస్తారు. ఇలా ప్రస్తుతం 7వ వేతన సంఘం సిపార్సులు అమలులో వున్నాయి. 2014లో ఈ పే కమీషన్ ను ఏర్పాటుచేయగా 2016 నుండి సిపార్సులు అమల్లోకి వచ్చాయి. అంటే 2026 తో పదేళ్ల కాలం పూర్తవుతుంది. కాబట్టి 8వ వేతన సంఘం సిపార్సులను అమలుచేయాల్సి వుంటుంది. 

అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాలు ముగియగానే అంటే వచ్చే సంవత్సరం ఆరంభంలోనే వేతన సంఘాన్ని ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 2026 జనవరి నుండి 8వ వేతన సంఘం సిపార్సులను అమలు చేయనున్నారు. 
 

33
8th Pay Commission

8th Pay Commission

భారీగా జీతాలు పెరిగే అవకాశం : 

8వ వేతన సంఘం అమలుతో తమ జీతాలు భారీగా పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశతో వున్నారు. 7వ వేతన సంఘం 23శాతం జీతాలను పెంచగా ఈసారి అంతకంటే ఎక్కువే వుంటుందని భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మినిమం బేసిక్ పే రూ.34,500 గా నిర్దారించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

ఈ 8వ వేతన సంఘం సిపార్సులు తమకు ఆర్థికంగా బాగా లబ్ది చేకూరుస్తాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. సాలరీతో పాటు అలవెన్సులు కూడా భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలు బాగా పెరుగుతున్నాయి... కాబట్టి భవిష్యత్ 10 ఏళ్లను దృష్టిలో వుంచుకుని వేతన సంఘం సిపార్సులు వుండాలని ఉద్యోగులు కోరుతున్నారు.     
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System
Recommended image2
Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే
Recommended image3
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved