Home Remedies: పగిలిన పాదాలను మృదువుగా మార్చుకోవాలా? అయితే ఈ హోంమేడ్ క్రీమ్ వాడండి
Home Remedies: వేసవికాలం రాగానే పాదాల మడమలు పొడిబారిపోతాయి. పగుళ్ళు వచ్చేస్తాయి. దీనివల్ల మంట, నొప్పి ఇలా ఎన్నో బాధలు. ఇంట్లోనే ఫుట్ క్రీమ్ ను తయారు చేసుకుని వాడితే పాదాలు మృదువుగా మారిపోతాయి.

పాదాల క్రీమ్
వేసవి కాలం రావడంతోనే కొన్ని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పాదాల సంరక్షణ కష్టమైపోతుంది. దుమ్ము, వేడి, చెమట పాదాలు అతుక్కుని మడమలు పొడిబారి పగుళ్లు ఏర్పడతాయి. మహిళలు ముఖ్యంగా ఈ సమస్యతో ఇబ్బంది పడతారు. పాదాల పగుళ్ళతో మీరు బాధపడుతుంటే కష్టపడక్కర్లేదు. ఇంట్లోనే హోమ్ మేడ్ క్రీమ్ తయారు చేసుకొని దాన్ని ప్రతిరోజు పాదాలకు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆ క్రీమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
తయారీ ఇలా
పగిలిన మడమలకు హోంమేడ్ క్రీమ్ తయారీకి కావలసిన పదార్థాలు కలబంద జెల్, ఆవనూనె, బంగాళదుంప జ్యూసు, గ్లిజరిన్ వీటిని తీసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కలబంద జెల్ వేయాలి. అందులోనే బంగాళదుంప రసం, ఆవనూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇది మరీ చిక్కగా ఉండకూడదు. క్రీమ్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. దీన్ని గాలి చొరబడి డబ్బాలో వేసి నిల్వ చేసుకోండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పగిలిన పాదాలకు దీన్ని రాసి మసాజ్ చేస్తూ ఉండండి. ఇది చాలా చవకైనది. పైగా తయారు చేసుకోవడం చాలా సులువు.
నిల్వ చేసుకోవచ్చు
ఈ హోమ్మేడ్ ఫుట్ క్రీమ్ పాదాలకు రాయడం వల్ల నొప్పి, చికాకు వంటివి కూడా ఉండవు. ఇది పాదాల చర్మాన్ని మృదువుగా, సున్నితంగా మార్చేస్తుంది. పాదాల నొప్పి, రక్తస్రావం, దురద వంటివి కూడా తగ్గిస్తుంది. ఒక్కసారి ఇలా ఫుట్ క్రీమ్ తయారు చేసి దాచుకుంటే రెండు మూడు నెలలు దాన్ని చక్కగా వాడుకోవచ్చు. పైగా దీనికి అయ్యే ఖర్చు కూడా తక్కువ. బ్యూటీ పార్లర్లకు లేదా ఇతర కాస్మెటిక్స్ కొనాలంటే వందలలో ఖర్చు అవుతుంది. అదే ఈ ఫుట్ క్రీమ్ అయితే చాలా తక్కువ ఖర్చుతో సిద్ధం అయిపోతుంది.

