రెగ్యులర్ గా వ్యాయామం, శారీరక శ్రమ చేస్తే.. మీరు సేఫ్.. ఇవి కోవిడ్-19 ప్రమాదాన్నితగ్గిస్తుందంటున్న అధ్యయనం
రెగ్యులర్ గా 20 నిమిషాలైనా శారీరక శ్రమ చేయడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అందులో కరోనా కూడా ఉంది.
భారతదేశంలో కోవిడ్-19 కేసులు నేటికీ పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఒక కొత్త అధ్యయనం ఈ వైరస్ సంక్రమణను తగ్గించే ఒక కొత్త మార్గాన్ని కనుగొంది. రెగ్యులర్ గా వ్యాయామాలు చేయడం, శారీరక శ్రమ చేయడం వల్ల సార్స్-కోవ్-2 బారిన పడే ప్రమాదం లేదా సంక్రమణ వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా 20 నిిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటంతో పాటుగా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటంలో ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. శారీరక శ్రమకు, కోవిడ్-19కు కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్ బారిన పడే ప్రమాదాన్ని అంచనా వేయడానికి గ్లోబల్ డేటా విశ్లేషణను ఆధారంగా చేసుకునన్నారు. .
బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. రెగ్యులర్ గా శారీరక శ్రమ చేసేవారికి కోవిడ్-19 బారిన పడే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. అయితే వారానికి 50 నిమిషాల పరిమిత స్థాయి తీవ్రత లేదా 75 నిమిషాల తీవ్రమైన తీవ్రత కలిగిన కలిగినన శారీరక శ్రమ దీర్ఘకాలలిక ప్రయోజనాలను కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
నవంబర్ 2019 మరియు మార్చి 2022 మధ్య ప్రచురించిన సంబంధిత అధ్యయనాల డేటాబేస్ను పరిశోధకులు విశ్లేషించారు మరియు 1.8 మిలియన్ల మంది వయోజనులను చేర్చారు, వారిలో 54 శాతం మంది మహిళలు ఉన్నారు. పాల్గొన్నవారి సగటు 53 కాగా, దక్షిణ కొరియా, ఇంగ్లాండ్, ఇరాన్, కెనడా, యుకె, స్పెయిన్, బ్రెజిల్ మరియు పాలస్తీనా నుండి చాలా అధ్యయనాలు జరిగాయి. క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనే వ్యక్తులు సార్స్-కోవ్-2 బారిన పడే అవకాశం 11 శాతం తక్కువగా ఉందని, ఆసుపత్రిలో చేరాల్సిన తీవ్రమైన కోవిడ్కు 36 శాతం తక్కువ అవకాశం ఉందని, మరణాల ప్రమాదం 43 శాతం తక్కువగా ఉందని డేటా సూచించింది.
Exercise
తీవ్రమైన కోవిడ్ -19 నుండి తప్పించుకోవడానికి శారీరక శ్రమ ఒక మార్గం అని అధ్యయనం సూచిస్తున్నప్పటికీ.. ఇది కోవిడ్ అనంతర లక్షణాలు, ఊబకాయం, నిద్రలేమి వంటి ప్రభావాలను నివారించడానికి కూడా సహాయపడుతుందని గుర్తించబడింది. సాధారణ శారీరక శ్రమ ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలో మంగళవారం ఒక్కరోజే 8,586 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. యాక్టీవ్ కేసులు 96,506 కు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో యాక్టివ్ కేసులలో 1,142 కేసులు తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.19 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 3.31 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.