అంజీర ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీళ్లు మాత్రం తినకూడదు..
అంజీర లేదా అత్తి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగని వీటిని అతిగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే రోజూ గుప్పెడు గింజలను తినాలని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు చెబుతుంటారు. ఈ డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అయినప్పటికీ వీటిని మోతాదుకు మించి అస్సలు తినకూడదు. ఇలాంటి పండ్లలో డ్రై అంజీర పండ్లు కూడా ఉన్నాయి. ఈ పండ్లు ఎన్నో రోజులు నిల్వ ఉంటాయి. అయితే ఈ పండ్లను మోతాదుకు మించి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..
కాల్షియం లోపం
అత్తి పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ అతిగా అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే కాల్షియం లోపిస్తుంది. ఎందుకంటే ఈ పండులో ఆక్సలేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలో కాల్షియాన్ని గ్రహిస్తుంది. దీంతో మన శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. దీంతో శరీరం, ఎముకలు బలహీనపడతాయి.
టేస్టీగా ఉంటాయని అంజీర పండ్లను ఎక్కువగా తింటుంటారు చాలా మంది. కానీ ఇది కడుపును దెబ్బతీస్తుంది. అంటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అపానవాయువు (పిత్తులు) వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటిని మోతాదులోనే తినాలి. అత్తి పండ్లను తిన్న తర్వాత ఒక గ్లాస్ నీటిని ఖచ్చితంగా తాగండి.
మూత్రాశయ, మూత్రపిండాల వ్యాధులున్న వారు అంజీర పండ్లను ఎక్కువగా తినకూడదు. మోతాదులోనే తినాలి. ఎందుకంటే దీనిలో ఉండే ఆక్సలేట్ ఈ అవయవాలను దెబ్బతీస్తుంది. అలాగే తెల్ల రక్తకణాలు ఏర్పడే ప్లీహాన్ని కూడా తొలగిస్తుంది.
రక్తస్రావ సమస్య
అంజీర పండ్లకు వేడి చేసే గుణముంటుంది. అందుకే వీటిని వేసవిలో ఎక్కువగా తినకూడదు. లేకపోతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే వీటిని శీతాకాలంలో కూడా వీటిని మోతాదులోనే తినాలి. లేదంటే రక్తస్రావ సమస్య వస్తుంది.
అత్తిపండ్లను మోతాదుకు మించి తింటే పేగులు, కాలెయం దెబ్బతింటాయి. వీటిని ఎక్కువగా తింటే కాలెయ సమస్యలు వస్తాయి. అలాగే పేగు సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే ఈ పండు విత్తనాలు అంత సులువుగా అరగవు. దీంతో అజీర్థి సమస్యలు వస్తాయి.