MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • భారత్ దెబ్బకు పాక్ అబ్బ... వారం రోజుల్లోనే రూ.2 లక్షల కోట్లు లాస్

భారత్ దెబ్బకు పాక్ అబ్బ... వారం రోజుల్లోనే రూ.2 లక్షల కోట్లు లాస్

పహల్గాం ఉగ్రదాడి జరిగి వారం రోజులు గడిచింది. ఈ దాడి భారత్ ను కాదు పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బతీసింది... అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Arun Kumar P
Published : Apr 29 2025, 10:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pakistan Economy

Pakistan Economy

తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లు తయారయ్యింది ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి. భారత్ ను దెబ్బతీసేందుకు ఉగ్రవాదులను ఉసిగొల్పింది... దీని ఎఫెక్ట్ ఇప్పుడు పాక్ పైనే పడింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశంతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంది... ఆ దేశంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేసింది. దీనివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.

25
Pakistan Economy

Pakistan Economy

కుప్పకూలుతున్న పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ : 

ఈ వారం అరంభంలోనే అంటే సోమవారం కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ KSE-100 సూచీ 1405 పాయింట్లు లేదా 1.22% క్షీణించి 114,063.90 వద్ద ముగిసింది. ఇలా ఏప్రిల్ 22 నుండి కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఇప్పటివరకు 5494.78 పాయింట్లు లేదా 4.63% క్షీణించింది. కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 52.84 బిలియన్ డాలర్ల నుండి 50.39 బిలియన్ డాలర్లకు తగ్గింది.

35
Pakistan Economy

Pakistan Economy

పహల్గాం దాడి తర్వాత రూ.2 లక్షల కోట్ల నష్టం

గత కొన్ని రోజుల్లో పాకిస్తాన్ షేర్ మార్కెట్‌కు 2.45 బిలియన్ డాలర్ల భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంటే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ షేర్ మార్కెట్‌కు దాదాపు రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.

45
Pakistan Economy

Pakistan Economy

పాకిస్తాన్‌లో చికెన్ కిలో రూ.800

పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉంది. బియ్యం కిలో రూ.340, గుడ్లు డజను రూ.332, పాలు లీటరు రూ.224, టమాటా కిలో రూ.150, ఆపిల్ కిలో రూ.288, చికెన్ కిలో రూ.800, బంగాళాదుంప కిలో రూ.105, ఉల్లిపాయ కిలో రూ.145కి అమ్ముడవుతున్నాయి.

55
Pakistan Economy

Pakistan Economy

ఇక పాక్ లో తాగునీరు కూడా ప్రియమయ్యింది... ఇది ఆ దేశ దారుణ పరిస్థితిని తెలియజేస్తుంది. అక్కడ తాగునీరు లీటరుకు రూ.105కి అమ్ముడవుతోంది. భారతదేశంలో బాటిల్ నీటి ధర లీటరుకు కేవలం రూ.15 నుండి రూ.20 మాత్రమే.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
పాకిస్తాన్
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved