MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • International
  • Fact: ఆవులు మాంసాహారం తింటే ఎక్కువ పాలు ఇస్తాయా.? అమెరికాలో ఎందుక‌లా చేస్తారు.?

Fact: ఆవులు మాంసాహారం తింటే ఎక్కువ పాలు ఇస్తాయా.? అమెరికాలో ఎందుక‌లా చేస్తారు.?

అమెరికా, భార‌త్‌ల మ‌ధ్య వాణిణ్య ఒప్పందానికి పాల దిగుమ‌తికి బ్రేక్ ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో నాన్ వెజ్ మిల్క్ అంశం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అమెరికాలో ఆవుల‌కు మేత‌గా మాంసాహారం వేస్తార‌నే విష‌యం స‌రికొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. 

1 Min read
Author : Narender Vaitla
| Updated : Jul 21 2025, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమెరికాలో భిన్న ప‌రిస్థితి
Image Credit : Freepik

అమెరికాలో భిన్న ప‌రిస్థితి

సాధార‌ణంగా ఆవుల‌కు మేత‌గా గ‌డ్డి వేస్తార‌నే విష‌యం తెలిసిందే. భార‌త దేశంలో ఎక్క‌డైనా ఇదే దృశ్యం క‌నిపిస్తుంది. కానీ అమెరికాలో మాత్రం దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తుంది. అక్కడ ఆవులకు సాధారణంగా మాంసాహార పదార్థాలు అందిస్తారు. ఇది పాలు ఉత్పత్తి పెంచే ప్రయత్నాల్లో భాగమేనని అక్క‌డి ప‌రిశ్ర‌మ‌లు చెబుతుంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మాంసం, రక్త భాగాలతో తయారయ్యే ప్రత్యేక మేత
Image Credit : Getty

మాంసం, రక్త భాగాలతో తయారయ్యే ప్రత్యేక మేత

అమెరికాలోని పశుగ్రాస పరిశ్రమలో, వధించబడిన జంతువుల (చేపలు, పందులు, గుర్రాలు, కుక్కలు, పిల్లులు మొదలైనవి) మాంసం, ఎముకలు, ఈకలు, రెట్టలు వంటి భాగాలను ఎండబెట్టి, పొడి రూపంలో పశుగ్రాసంగా తయారు చేస్తారు. దీనిని "రక్త మాంసం" లేదా "బ్లడ్ మీల్", "ఫెదర్ మీల్" వంటి పేర్లతో పిలుస్తారు. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉండటంతో, ఆవులకు ఇవి తినిపించడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని అక్కడి పరిశ్రమలు అంటున్నాయి.

35
లైసిన్ వంటి అమైనో ఆమ్లాలు
Image Credit : Getty

లైసిన్ వంటి అమైనో ఆమ్లాలు

ఈ మాంసాహార పదార్థాల్లో ముఖ్యంగా లైసిన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది పశువుల ఆరోగ్యానికి అవసరమైన 10 కీలక అమైనో ఆమ్లాలలో ఒకటి. ఈ పోషకాల వల్ల ఆవులు బరువు పెరగడం, శరీర సామర్థ్యం మెరుగవుతుంద‌ని చెబుతారు. దీంతోపాటు పాలు ఉత్పత్తి కూడా పెరుగుతుందన్న నమ్మకం ఉంది.

45
ఎరువుగా కూడా..
Image Credit : Asianet News

ఎరువుగా కూడా..

ఈ మాంసాహార పశుగ్రాసం కేవలం పాడిపశువులకు ఆహారంగా మాత్రమే కాకుండా వ్యవసాయంలో నత్రజని ఎరువుగా కూడా ఉప‌యోగిస్తున్నారు. ఒక ఎకరానికి 100 కిలోల బ్ల‌డ్ మీల్ ఉప‌యోగిస్తే అధిక దిగుబడి వస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఇది వ్యవసాయానికి సహాయపడుతుంది కానీ అదే పదార్థాన్ని ఆవులకు తినిపించడంపై మాత్రం వివాదం కొనసాగుతోంది.

55
భార‌త్ ఎందుకు తిర‌స్క‌రిస్తోంది.?
Image Credit : Getty

భార‌త్ ఎందుకు తిర‌స్క‌రిస్తోంది.?

భారతదేశంలో పాలను కేవలం ఆహారంగానే కాకుండా మతపరంగా కూడా పవిత్రంగా భావిస్తారు. గోవులను గౌరవించడమేకాకుండా, వాటిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ నేపథ్యంలో మాంసాహార పదార్థాలతో పశుగ్రాసాన్ని తయారుచేసే పద్ధతిని ఇక్కడ ప్రజలు తిరస్కరిస్తున్నారు. అందుకే అమెరికా నుంచి పాల దిగుమ‌తి అంశాన్ని భార‌త ప్ర‌భుత్వం సైతం వ్య‌తిరేకిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం
ఫ్యాక్ట్ చెక్
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Recommended image2
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image3
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Related Stories
Recommended image1
MMTS Train: హైద‌రాబాద్ టూ యాద‌గిరిగుట్ట‌.. రూ. 20 టికెట్‌, గంట‌లోపే ప్ర‌యాణం. ట్రాఫిక్ స‌మ‌స్య కూడా ఉండ‌దు
Recommended image2
Zodiac sign: బాబా వంగా భవిష్యవాణి.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved