MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • International
  • Iran Israel War : దుబాయ్ లో 19 మంది భారతీయులు అరెస్ట్.. అసలేం జరుగుతోంది?

Iran Israel War : దుబాయ్ లో 19 మంది భారతీయులు అరెస్ట్.. అసలేం జరుగుతోంది?

Iran Israel War: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు చాలా దేశాల పై ప్రభావం చూపిస్తోంది. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఇదే సమయంలో యూఏఈలో 19 మంది భారతీయులతో సహా మొత్తం 35 మందిని అధికారులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 16 2026, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. భారతీయులు అరెస్ట్
Image Credit : ChatGPT

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భారతీయులు అరెస్ట్

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో యుద్ధానికి సంబంధించి తప్పుడు, ఫాబ్రికేటెడ్, ఏఐ (AI) ద్వారా సృష్టించిన వీడియోలను షేర్ చేసినందుకు మొత్తం 35 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో 19 మంది భారతీయ పౌరులు ఉండటం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెండు దశల్లో అరెస్టుల పర్వం
Image Credit : Getty

రెండు దశల్లో అరెస్టుల పర్వం

యూఏఈ అధికారులు ఈ అరెస్టులను రెండు విభిన్న దశల్లో చేపట్టారు. మొదట శనివారం నాడు ఇద్దరు భారతీయులతో సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తాజాగా నిర్వహించిన తనిఖీల్లో వివిధ దేశాలకు చెందిన మరో 25 మందిని అరెస్ట్ చేశారు. ఈ రెండో బృందంలో ఏకంగా 17 మంది భారతీయులు ఉన్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 19 మంది భారతీయులు కటకటాల పాలయ్యారు. వీరందరిపై యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షంసీ వేగవంతమైన విచారణకు ఆదేశించారు.

మూడు రకాల అభియోగాలు

దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం, నిందితులను మూడు వర్గాలుగా విభజించి అభియోగాలు నమోదు చేశారు:

1. మొదటి గ్రూపు: క్షిపణి దాడులు లేదా గగనతలంలో వాటిని అడ్డుకుంటున్న అసలు వీడియోలను రికార్డ్ చేసి, వాటికి భయం కలిగించే సౌండ్ ఎఫెక్ట్స్, తప్పుడు వ్యాఖ్యానాలను జోడించి ప్రచారం చేశారు.

2. రెండో గ్రూపు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఇతర దేశాల్లో జరిగిన పేలుళ్ల దృశ్యాలను యూఏఈలో జరిగినట్లుగా నకిలీ వీడియోలు సృష్టించారు.

3. మూడో గ్రూపు: శత్రు దేశమైన ఇరాన్ సైనిక చర్యలను, ఆ దేశ నాయకత్వాన్ని కీర్తిస్తూ పోస్టులు పెట్టడం ద్వారా జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించారు.

Related Articles

Related image1
FASTag : వాహనదారులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు
Related image2
ఈ ఊరిలో ఫోన్లు పనిచేయవు.. అయినా టూరిస్టులు ఎందుకు క్యూ కడుతున్నారో తెలుసా?
35
కఠినమైన శిక్షలు, జరిమానాలు
Image Credit : Getty

కఠినమైన శిక్షలు, జరిమానాలు

యూఏఈ చట్టాల ప్రకారం ఇటువంటి చర్యలు తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. అటార్నీ జనరల్ అల్ షంసీ ప్రకటన ప్రకారం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల ప్రజల్లో భయాందోళనలు కలగడమే కాకుండా దేశ రక్షణ వ్యవస్థల రహస్యాలు శత్రువులకు తెలిసే ప్రమాదం ఉంది. ఈ నేరాలకు కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష, ఒక లక్ష దిర్హామ్ల (సుమారు ₹25.2 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని వీడియోలలో పిల్లల భావోద్వేగాలను కూడా వాడుకుని భద్రతాపరమైన భయాందోళనలు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు.

45
దుబాయ్ విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి
Image Credit : Getty

దుబాయ్ విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ యూఏఈపై కూడా దాడులు మొదలయ్యాయి. సోమవారం ఉదయం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒక ఇంధన ట్యాంకుపై డ్రోన్ దాడి జరిగింది. దీనివల్ల భారీగా మంటలు చెలరేగాయి. దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎయిర్ ఇండియా వంటి పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి.

55
ఇరాన్ హెచ్చరికలు..
Image Credit : Asianet News

ఇరాన్ హెచ్చరికలు..

యూఏఈలోని ఓడరేవులు, ఇతర స్థావరాలను అమెరికా తన దాడుల కోసం వాడుకుంటోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే యూఏఈలోని మూడు ప్రధాన ఓడరేవులను ఖాళీ చేయాలని టెహ్రాన్ హెచ్చరించింది. అటు క్షేత్రస్థాయిలో దాడులు, ఇటు సోషల్ మీడియాలో జరుగుతున్న సమాచార యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అందుకే ప్రభుత్వం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై నిఘా పెంచి, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రపంచం
యుద్ధం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
సాయుధ దళాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
డొనాల్డ్ ట్రంప్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: ముప్పు ఇంకా ముగిసిపోలేదు.. నేపాల్‌కు చైనా హెచ్చ‌రిక‌, మ‌రో 3 రోజుల్లో
Recommended image2
USA: ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంచలన నిర్ణయం.. అమెరికా వెళ్లే భార‌తీయుల‌కు గ‌ట్టి షాక్
Recommended image3
Nepal Floods : నేపాల్ వరదల్లో చిక్కుకున్న సద్గురు టీమ్.. ఈ హీరోయిన్ సంగతేంటి?
Related Stories
Recommended image1
FASTag : వాహనదారులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు
Recommended image2
ఈ ఊరిలో ఫోన్లు పనిచేయవు.. అయినా టూరిస్టులు ఎందుకు క్యూ కడుతున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved