Skin care: ఈ 5 చేస్తే.. ఎండాకాలంలోనూ ముఖం మిలమిల మెరిసిపోతుంది!
సాధారణంగా ఎండాకాలంలో చాలారకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. ఎండవేడికి చర్మం నల్లగా మారుతుంటుంది. ఫేస్ డల్ గా కనిపిస్తుంటుంది. ఇంక ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ల కష్టం గురించి అయితే చెప్పనవసరం లేదు. చర్మంపై కాస్త అశ్రద్ధ చేసినా మొటిమలు, మచ్చలు వస్తుంటాయి. మరీ ఈ సమస్యల నుంచి సహజంగా ఎలా బయటపడాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ చిట్కాలు. ఓసారి ట్రై చేయండి. ముఖం మెరిసిపోవడం ఖాయం!

ఎండ వేడి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు. వేసవిలో చాలామంది ఫేస్ డల్ గా, కాంతిహీనంగా, అలిసిపోయినట్లు కనిపిస్తుంది. ముఖాన్ని ఎంత శుభ్రం చేసినా ఆ డల్ నెస్ తగ్గదు. మరి ఏం చేస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ముఖానికి పాలు
మీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేయడానికి కాచిన పాలను ముఖానికి పట్టించండి. ఇది మీ ముఖంలోని చర్మ రంధ్రాలను బాగా శుభ్రం చేస్తుంది. దీనివల్ల మొటిమలు, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పచ్చి పాలలో ఉప్పు కలిపి ముఖానికి పట్టించి మసాజ్ చేయవచ్చు. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం తాజాగా ఉంటుంది.
ముఖానికి పెరుగు
ముఖానికి పెరుగు పట్టించడం వల్ల చర్మంలోని నూనె శాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రోజంతా ముఖాన్ని తేమగా ఉంచుతుంది. చర్మంలోని మృత కణాలు, మురికిని తొలగించడానికి పెరుగును ముఖానికి పట్టించి మసాజ్ చేయవచ్చు.
ముఖానికి తేనె
చర్మంపై జిడ్డును నివారించడానికి తేనెతో మసాజ్ చేయవచ్చు. ఇది ముఖంలోని జిగటను తగ్గిస్తుంది. తేనెలోని క్రిమిసంహారకాలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మంలో ఇన్ఫెక్షన్, మొటిమలను తగ్గిస్తాయి. తేనెతో ముఖానికి మసాజ్ చేసిన తర్వాత చల్లటి లేదా గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోండి.
ముఖానికి దోసకాయ
దోసకాయ రసంతో ముఖానికి మసాజ్ చేయడం వల్ల చర్మంలోని నూనె శాతాన్ని తగ్గిస్తుంది. తురిమిన దోసకాయ గుజ్జును ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవచ్చు.
ముఖానికి టమాటా
టమాటాను రుబ్బి ఆ రసాన్ని ముఖానికి పట్టించినట్లయితే చర్మం మెరుస్తుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. టమాటా చర్మం పొడిబారకుండా చేస్తుంది.