MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఉదయాన్నే పరిగడుపున నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా?

ఉదయాన్నే పరిగడుపున నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా?

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగాలని పెద్దలు చెప్పడం వినే ఉంటారు. ఇలా ఎందుకు చేయాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఉదయాన్నే పరిగడుపున నీళ్లను తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే వావ్ అంటారు.  

1 Min read
Shivaleela Rajamoni
Published : Jun 09 2024, 11:10 AM IST| Updated : Jun 09 2024, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లను తాగే అలవాటు కొంతమందికి మాత్రమే ఉంటుంది. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా మంచిది అన్న ముచ్చట ఎవ్వరికీ తెలియదు. చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే టీ లేదా కాఫీని తాగుతుంటారు. కానీ వీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇవి బాడీ డీహైట్రేట్ అయ్యేలా చేయడంతో పాటుగా మరెన్నో సమస్యలకు కారణమవుతాయి. అసలు పరిగడుపున నీళ్లను ఎందుకు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

25

బరువు తగ్గడానికి.. 

ఉదయం నిద్రలేవగానే తేలికపాటి గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా బరువు కూడా తాగుతారని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే కొవ్వు త్వరగా కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకుంటే మీరు ఉదయం లేవగానే టీ లేదా కాఫీని తాగడానికి బదులుగా గోరువెచ్చని నీటిని తాగండి. 
 

35

జీర్ణక్రియ

ఉదయాన్నే పరగడుపున నీళ్లను తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ వాటర్ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. మీకు తరచుగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తే ఉదయాన్నే నీళ్లను తాగితే  ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. 

45

చర్మానికి మేలు 

ఉదయాన్నే నిద్రలేచి పరిగడుపున నీళ్లను తాగడం వల్ల శరీరం మాత్రమే కాదు, చర్మం కూడా హైడ్రేట్ గా ఉంటుంది. ఇది చర్మం అందంగా మెరిసేలా చేస్తుంది. నీళ్లు శరీరాన్ని నిర్విషీకరణ చేస్తాయి. దీంతో మీకు మొటిమలు, మచ్చల సమస్యలు తొలగిపోతాయి. 
 

55

మలబద్ధకం 

ఉదయాన్నే పరగడుపున నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడటమే కాకుండా మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. నీళ్లను తాగడం వల్ల మలం మృదువుగా మారి శరీరంలోని వ్యర్థాలు త్వరగా బయటకు వస్తాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved