MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఫ్రూట్ సలాడ్ లో ఉప్పు కలపడం మంచిది కాదా?

ఫ్రూట్ సలాడ్ లో ఉప్పు కలపడం మంచిది కాదా?

పండ్లపై ఉప్పును జల్లుకుని తినడం మానేయాలి. ఎందుకంటే ఉప్పు జల్లిన పండ్లను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.    

1 Min read
Mahesh Rajamoni
Published : Jun 09 2023, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. పండ్లు మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు,  ఫైబర్ వంటి పోషకాలను అందిస్తాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోగనిరోధక శక్తి, జీవక్రియలు బలంగా ఉంటే వ్యాధులను ఎదుర్కొనే శక్తి మన శరీరానికి ఉంటుంది. అయితే మీకు పండ్లపై ఉప్పును జల్లుకుని తినే అలవాటు ఉంటే వెంటనే ఇలా తినడం మానేయండి. పండ్లను ఉప్పు లేదా చాట్ మసాలాతో తినడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. కానీ ఇలా చేయడం వల్ల మీ శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాదు ఉప్పు కలిపిన పండ్లను తినడం వల్ల  ఎన్నో రోగాల ప్రమాదం పెరుగుతుంది. 

24
Asianet Image

పండ్లపై ఉప్పు చల్లడం వల్ల కలిగే నష్టాలు

పండ్లపై ఉప్పును చల్లి తినడం వల్ల వాటిలోని పోషకాలు నశిస్తాయి. పండ్లతో పాటు ఉప్పు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పండ్లపై ఉప్పును చల్లి తింటే అలెర్జీ కూడా వస్తుందది. ఇది శరీరంలో వాపునకు కూడా కారణమవుతుంది.

34
Asianet Image

మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే.. ఉప్పు వేసిన పండ్లను తినడం మానేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.

గుండె జబ్బులు ఉన్నవారు కూడా పండ్లపై ఉప్పును చల్లి తినకూడదు. పండ్లపై ఉప్పు వేయగానే వాటి నుంచి వాటర్  బయటకు వస్తుంది. ఇది పండ్ల పోషణను తగ్గిస్తుంది.
 

 

44
Asianet Image

పండ్లను ఎలా తినాలి?

పండ్లు తినేటప్పుడు.. మీరు ఒకసారి ఒకే పండు మాత్రమే తినాలి. 

మీరు ఫ్రూట్ చాట్ తినాలనుకుంటే తీపి లేదా పుల్లని పండ్ల సలాడ్ ను మాత్రమే తయారు చేయండి.

పుల్లని, తీపి పండ్ల సలాడ్లను కలిపి తినకూడదు.

పండ్లు కోసిన గంటలోపే తినాలి.

ఎక్కువ రోజులు ఉంచిన పండ్లలో కూడా పోషకాలు తగ్గుతాయి. 

About the Author

Mahesh Rajamoni
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved