MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Success Story : పాములు పట్టేవారికి పద్మశ్రీ పురస్కారం.. ఇది కదా సక్సెస్, వీళ్లు కదా రియల్ హీరోస్

Success Story : పాములు పట్టేవారికి పద్మశ్రీ పురస్కారం.. ఇది కదా సక్సెస్, వీళ్లు కదా రియల్ హీరోస్

చేసే పనిలో పర్ఫెక్షన్ ఉంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించారు ఈ స్నేక్ క్యాచర్స్. పాములు పట్టే స్థాయినుండి ఏకంగా దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మశ్రీ పొందే స్ధాయికి చేరుకున్నాారు. ఎవరీ వడివేేల్ గోపాల్, మాసి సదైయన్..? 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 30 2026, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాములు పట్టేవారి సక్సెస్ స్టోరీ..
Image Credit : X/Snake Catchers

పాములు పట్టేవారి సక్సెస్ స్టోరీ..

Success Story : పని ఏదైనా సరే... అందులో పట్టు సాధిస్తే సక్సెస్ దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. చిన్నది, పెద్దది అని కాదు... చేసే పనిలో నిబద్దత చాలా అవసరం. దేశాన్ని పాలించే ప్రధాని అయినా... రోడ్లు ఊడ్చే పారిశుద్ద్య కార్మికులైనా తమ పని పర్పెక్ట్ గా చేయాలి... చీపురు పట్టి రోడ్డు ఊడిస్తే అంతకంటే బాగా ఎవ్వరూ చేయకూడదు అన్నట్లుగా ఉండాలి.. ఈ పనిలోనూ ఇంత పర్పెక్షన్ ఉండాలి. ఇలా ఇద్దరు పాములుపట్టే వ్యక్తులు తమ పనితీరుతో ఏకంగా దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ సాధించారు. వీరి సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

24
ఎవరీ వడివేల్ గోపాల్, మాసి సదైయన్..?
Image Credit : X/Snake Catchers

ఎవరీ వడివేల్ గోపాల్, మాసి సదైయన్..?

తమిళనాడుకు చెందిన గిరిజన తెగ ఇరుల... వీళ్లు కేరళ, కర్ణాటకలో కూడా విస్తరించి ఉన్నారు. వీరికి ప్రమాదకరమైన పాములను పట్టుకోవడంలో మంచి పట్టు ఉంటుంది… పూర్వీకుల నుండి ఇదే పని చేస్తున్నారు. అలాగే ఎలుకలు పట్టడం, తెనెను సేకరించడం వంటి పనులే జీవనాధారం. ఈ ఇరుల తెగకు చెందినవారే వడివేల్ గోపాల్, మాసి సదైవన్.

పాములు పట్టడమే ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు గోపాల్, సదైయన్. ఆదునిక స్నేక్ క్యాచర్స్ మాదిరిగా కాకుండా వీళ్లు పాములు పట్టేందుకు తమ పూర్వికుల టెక్నిక్ ను వాడతారు. ఇలా ఇప్పటివరకు వేలాది పాములు పట్టారు... ఇందులో ప్రమాదకమైన పాములు ఎన్నో ఉన్నాయి. అత్యంత చాకచక్యంగా కేవలం ఓ కర్ర సాయంతోనే కింగ్ కోబ్రా లాంటి డేంజరస్ పాములను కూడా పడతారు. పాములు పట్టడంలో వీళ్లు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

Related Articles

Related image1
Success Story : తెలుగులోనే సివిల్ సర్వీస్ ఎగ్జామ్.. ఇది కదా మాతృభాషపై మమకారం, ఇతడిది కదా అసలైన సక్సెస్
Related image2
Success Story : ఆటో డ్రైవర్ భార్యకు స్టేట్ ర్యాంక్... ఇంటర్ లో 1000 కి 991 మార్కులు
34
పాములు పట్టేవారికి పద్మశ్రీ...
Image Credit : X/Snake Catchers

పాములు పట్టేవారికి పద్మశ్రీ...

తమిళనాడుకు చెందిన వడివేల్ గోపాలన్, మాసి సదైయన్ కేవలం పాములు పట్టడమే కాదు.. వాటి విషాన్ని సేకరించి యాంటి వేనమ్ తయారీలో సహాయపడుతున్నారు. భారతదేశంలో పాము విషాన్ని అత్యధికంగా ఉత్పత్తిచేసే ఇరుల స్నేక్ క్యాచర్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీలో వీళ్లు సభ్యులు. ఆధునిక పరికరాలు లేకుండా సాంప్రదాయ పద్దతిలో వీళ్లు పాములను పట్టి యాంటి వీనమ్ తయారీ ప్రయోగశాలలకు సరఫరా చేస్తుంటారు. పాముకాటు సమయాల్లో ఈ యాంటీ వీనమ్ నే ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగిస్తారు… కాబట్టి పాముల నుండి విషం సేకరించడం అనేది వైద్యారోగ్య రంగంలో చాలా కీలకమైన ప్రక్రియ.

తమ ప్రాణాలకు తెగించి పాములు పట్టి విషాన్ని సేకరిస్తూ వైద్యారోగ్య రంగంలో సేవలందిస్తున్న వడివేల్ గోపాల్, మాసి సదైయన్ లను ప్రభుత్వం గుర్తించారు. వీరి నిస్వార్థ సేవకు గాను దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీకి ఎంపిక చేసింది. 2023 లో ఈ ఇద్దరూ రాష్ట్రపతి చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. చేసే పనిలో పర్పెక్షన్ ఉంటే సామాన్యులు సైతం అత్యున్నత విజయాలు సాధించవచ్చని ఈ ఇద్దరు పాములుపట్టేవారు నిరూపించారు.

President Droupadi Murmu presents Padma Shri to Shri Masi Sadaiyan for Social Work. He is a traditional snake catcher belonging to the Irular tribe of Tamil Nadu. He helps the Government in producing venom for manufacturing of the anti-venom, which is saving many lives every year pic.twitter.com/GOiVzLq65u

— President of India (@rashtrapatibhvn) March 22, 2023

44
అమెరికాలో పాములుపట్టే స్థాయికి...
Image Credit : X/Snake Catchers

అమెరికాలో పాములుపట్టే స్థాయికి...

సాధారణంగా బాగా చదువుకుని ఉద్యోగం కోసమో... లేదంటే బాగా డబ్బులుండి వ్యాపారం కోసమో విదేశాలకు వెళ్లేవారిని చూస్తుంటాం. కానీ తమ వడివేల్ గోపాల్, మాసి సదైయన్ కేవలం పాములు పట్టేందుకు అమెరికా వెళ్లారు... ప్లోరిడా వన్యప్రాణి అధికారులే వారిని స్వయంగా ఆహ్వానించారు.

2017 లో ప్లోరిడా అధికారులు అత్యంత ప్రమాదకరమైన బర్మీస్ కొండచిలువలను పట్టుకునే పనిని గోపాల్, సదైయన్ కు అప్పగించారు. వీళ్లు కేవలం రెండు వారాల్లోనే ఏకంగా 14 కొండచిలువలు పట్టుకున్నారు. అంతేకాదు ఈ పాములను పట్టడంతో అక్కడి వన్యప్రాణి సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. పాములు పట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా వీరిని తీసుకెళ్లిందంటేనే తమ వృత్తిలో వీళ్లు ఎంతటి నైపుణ్యం కలిగివున్నారో అర్థమవుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Haunted Beach: భారతదేశంలోనే అత్యంత భయానకమైన బీచ్ ఇది.. అక్కడికి రాత్రిపూట వెళ్లాలంటేనే వణుకు
Recommended image2
Strange Traditions: వధూవరులు మంటలపై నడిచే పెళ్లి.. ఛత్తీస్‌గఢ్‌లో వింత సంప్రదాయం వైరల్
Recommended image3
Productivity Tips : చిరుత వేగం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. ఈ ట్రిక్ పాటిస్తే మీరు కూడా సూపర్ సక్సెస్ అవుతారు !
Related Stories
Recommended image1
Success Story : తెలుగులోనే సివిల్ సర్వీస్ ఎగ్జామ్.. ఇది కదా మాతృభాషపై మమకారం, ఇతడిది కదా అసలైన సక్సెస్
Recommended image2
Success Story : ఆటో డ్రైవర్ భార్యకు స్టేట్ ర్యాంక్... ఇంటర్ లో 1000 కి 991 మార్కులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved