- Home
- Entertainment
- రైల్లో నుంచి కాలు బయట పెడితే..ఇంకో రైలు తగులుతుందా? ‘ పెద్ది’ లో చూపించింది నిజమేనా?
రైల్లో నుంచి కాలు బయట పెడితే..ఇంకో రైలు తగులుతుందా? ‘ పెద్ది’ లో చూపించింది నిజమేనా?
రైల్లో నుంచి బయటకు కాలు పెడితే.. పక్కన వెళ్తున్న మరో కాలు తగులుతుందా? దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా? మన ఇండియన్ రైల్వే భద్రత ఎలా ఉంటుంది? పెద్ది సినిమాలో చూపించినట్లు జరిగే అవకాశాలు ఉన్నాయా?

పెద్ది మూవీలో ఏం చూపించారు..?
మెగా పవర్ స్టార్, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తాజాగా హీరో గా నటించిన చిత్రం ‘ పెద్ది’. ఈ సినిమాకు డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే.. ఈ సినిమాలో హీరో.. తమ ఊరికి రైలు తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తాడు. దాని కోసం.. ఏకంగా తన కాలును కట్ చేసుకుంటాడు. తాను ఒక రైలులో ప్రయాణిస్తూ... కాలు బయటకు పెడతాడు. ఎదురుగా వస్తున్న మరో రైలు తగిలి కాలు కట్ అవుతుంది. అయితే.. ఈ సినిమాలో చూపించినట్లు... నిజంగా రైలులో నుంచి కాలు బయట పెడితే...వేరే రైలు తగులుతుందా? ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయా? ఈ విషయాలు పూర్తిగా తెలుసుకుందాం...
‘ పెద్ది సినిమాలో పెద్ద లోపం ఏంటంటే హీరో పారా ఒలింపిక్ లో పాల్గొనేందుకు రన్నింగ్ ట్రైన్ లో నుంచి కాలు బయట పెట్టి మోకాలు దాకా విరిగి పోయేలా చేసుకుంటాడు. అసలు.. అలా కాలు బయట పెట్టినంత మాత్రాన పక్క పట్టాల మీద వెళ్తున్న ట్రైన్ తగలదు. వాటి మధ్య ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కావాల్సినంత దూరంలోనే ఉండేలా డిస్టెన్స్ లో ట్రాక్ వేస్తారు. డైరెక్ట్ గా ఎదురుగా వచ్చే రైలు తగలదు కానీ... మధ్యలో ఉండే కరెంట్ పోల్స్, సిగ్నల్ పోస్టులు, ప్లాట్ ఫారమ్ అచ్చులు మాత్రం తగిలే అవకాశం ఉంటుంది.’ అంటూ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సినిమాలో చూపించింది నిజంగా నిజమేనా? లేదంటే.. నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ నిజమా? రెండింటిలో నిజం ఏది? రైల్వే అధికారులు ఏం చెబుతున్నారు..?
రైళ్ల మధ్య ఎంత దూరం ఉంటుందో తెలుసా?
రైల్వే ట్రాకులు వేసేటప్పుడు రెండు రెళ్లు ఒకదానికి ఒకటి తగలకుండా ఉండేలా భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. అయితే.. దీని అర్థం రెండు రైళ్ల మధ్య చాలా ఎక్కువ ఖాళీ ఉంటుందని అర్థం కాదు. రెండు రాళ్లు పక్కపక్కన వెళ్తున్నప్పుడు వాటి మధ్య కేవలం కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉండొచ్చు. మీ కాలు లేదా శరీర భాగం సాధారణ పరిమితికి మించి బయటకు వస్తే.. ఎదురుగా వచ్చే రైలు, లోకో మోటివ్ లేదా బోగిని తాకే ప్రమాదం ఉంటుంది.
రైలు ఎంత వేగంగా వెళ్తుందో కూడా ముఖ్యమే...
ఒక రైలు గంటకు 80 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంటే.. ఎదురుగా మరో రైలు కూడా అదే వేగంతో వస్తే... రెండు రైళ్ల సాపేక్ష వేగం గంటకు 160 కిలో మీటర్ల వరకు ఉంటుంది. అలాంటి సమయంలో కొంచెం తగిలినా కూడా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.
ఇలాంటి ప్రమాదాలు గతంలో జరిగాయా..?
రైల్వే అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, తలుపు దగ్గర నిలబడి లేదా కాళ్లు బయట పెట్టి ప్రయాణించడం వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరుగుతాయి. కొందరికి కరెంటు స్తంభాలు, చెట్ల కొమ్మలు, లేదా ఇంకేదైనా తగిలి కూడా ప్రమాదం జరిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

