విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న అఫీషియల్, ఇక అనౌన్స్ మెంట్ మాత్రమే మిగిలింది?
విజయ దేవరకొండ - రష్మిక మందన్న, ఇద్దరు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. విజయ్ కాస్త వెనుకపడినా..రష్మిక మాత్రం పాన్ ఇండియా హీరోయిన్ గా రచ్చ రచ్చ చేస్తోంది. ఇక వీరిద్దరికి సబంధించిన వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సంద్భాల్లో ఫోటోల ద్వారా దొరికిపోయారు కూడా. ఎప్పుడు బయటపడతారా అని ప్యాన్స్ ఎదురుచూస్తున్న క్రమంలో విజయ దేవరకొండ - రష్మిక మందన్న గురించి అఫీషియల్ గా ఓవిషయం కన్ ఫార్మ్ అయ్యింది? ఇంతకీ ఏంటది?
- FB
- TW
- Linkdin
Follow Us
)
గీత గోవిందం సినిమాతో ఈ జంట మొదటిసారి నటించారు. ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇద్దరికి మంచి పేరు వచ్చింది. మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఆతరువాత వీరిద్దరి కాంబోలో వచ్చిన డియర్ కామ్రేడ్ మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక గీత గోవిందం తరువాత విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ అందుకున్నదే లేదు. ఏదో ఒకటి రెండు సినిమాలు ఓ మోస్తర్ లో హిట్ అయ్యాయి కాని బ్లాక్ బస్టర్స్ మాత్రం ఇవ్వలేకపోయాడు రౌడీ హీరో.
రష్మిక మాత్రం ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేస్తోంది. పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేస్తోంది. హిందీలో ఛావా లాంటి బ్లాక్ బస్టర్స్ ను అందుకుంది రష్మిక. ఇక విజయ దేవరకొండ - రష్మిక మందన్న మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుుంది.
విజయ్ ఇంట్లో వాళ్లతో కూడా రష్మిక ఉంటున్న తీరు, దివాళి అక్కడే సెలబ్రేట్ చేసుకోవడం, విజయ్ ఫ్యామిలీతో పుష్ప సినిమా చూడటం, విజయ్ తమ్ముడు ఆనంద్ సినిమాల ఈవెంట్లకు చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం లాంటివి అందరికి వీరి రిలేషన్ ను బయటపడేలా చేస్తుంది.
అంతే కాదు ఇద్దరు వెకేషన్స్ కు వెళ్ళి... విడివిగిగా ఓకే లోకేషన్ ఫోటోలు పెట్టడంతో ఫ్యాన్స్ ఇట్టే కనిపెట్టి.. వీరి రిలేషన్ ను సమ్ థింగ్ అని తేల్చేశారు.
ఇక తాజా సమాచారం ప్రకారం ముచ్చటగా మూడో సారి ఈ జంట కలిసి పనిచేయబోతున్నట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ చేస్తున్నాడు.
ఈసినిమా లుక్స్, టీజర్,సాంగ్ తో భారీగా అంచనాలు కూడా పెంచేశారు. అయితే అయితే ఈ సినిమా తర్వాత మరో టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కలయికలో సాలిడ్ ప్రాజెక్ట్ ని విజయ్ చేయనున్నాడు. ఆల్రెడీ ట్యాక్సీవాలా చేసిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు.
ఇక ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కన్ఫర్మ్ అయ్యింది. దర్శకుడు అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ.. ఓ ట్వీట్ వదిలారు. కాని ఇది కన్ ఫ్యూజ్ చేసేలా ఉంది. అయితే అఫీషియల్ గా మూవీ టీమ్ అనౌన్స్ చేసే వరకూ ఏవిషయం చెప్పలేము. కాని వీరి కాంబో కలిసిందంటే ఆ సినిమాపై బజ్ మామూలుగా ఉండదు. బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే సినిమా.
ఎందుకంటే రష్మిక క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. విజయ్ కు కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈక్రమంలో వీరిద్దరి తో రాహుల్ లాంటి దర్శకుడు సినిమా చేస్తే అది ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. మరి అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది చూడాలి. అటు ఫ్యాన్స్ మాత్రం మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని విజయ దేవరకొండ - రష్మిక మందన్నలను అడిగేస్తున్నారు. వారు మాత్రం మేం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటున్నారు.