50 ఏళ్లు వచ్చినా వన్నెతరగని అందం.. రమ్యకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు!
లాక్ డౌన్ సమయంలో ఫిలిం స్టార్స్కు సంబంధించిన పాత వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. బాలీవుడ్ సూపర్స్టార్స్తో ఆమె చేసిన బోల్డ్ సీన్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన రమ్యకృష్ణ బోల్డ్ సన్నివేశాల్లో ఉత్తరాది భామలకు కూడా గట్టి పోటి ఇచ్చింది.
బడే మియా చోటా మియా సినిమాలో బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్తో కలిసి నటించింది రమ్యకృష్ణ. ఈ సినిమాలో ఆమె నటించిన బోల్డ్ సీన్స్ అప్పట్లో మాట్ టాపిక్ అయ్యాయి.
బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాతో రమ్యకృష్ణ చేసిన బోల్డ్ సాంగ్ కూడా బాలీవుడ్లో సంచలనం సృష్టించింది.
అనిల్ కపూర్తో రమ్యకృష్ణ చేసిన బోల్డ్ సీన్ ఇప్పటికీ సెన్సేషనే. ఆ సీన్లో ఆమె ఎంత బోల్డ్గా నటించిందటం సినిమా రిలీజ్ తరువాత చెలరేగిన వివాదంతో ఆ సీన్ను సినిమా నుంచి తొలగించారు.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్తోనూ రమ్యకృష్ణ హాట్ సీన్స్లో నటించి అలరించింది.
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్తోనూ హాట్ హాట్ రొమాన్స్ చేసింది రమ్య. కిస్ సీన్తో పాటు ఘాటు రొమాన్స్ను కూడా పండించింది.
రమ్యకృష్ణ 2003లో దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
విభిన్న చిత్రాలతో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసిన రమ్యకృష్ణ బాగానే సంపాదించింది. ఆమె ఆస్తుల విలువ దాదాపు 36 కోట్ల వరకు ఉంటాయని ఓ అంచనా.
బ్యాంక్ బ్యాలెన్స్తో పాటు కోట్ల ఖరీదైన బంగ్లాలు, కార్లు కూడా ఆమె దగ్గర ఉన్నాయి.
రమ్యకృష్ణకు సెకండ్ ఇన్నింగ్స్లో భారీ క్రేజ్ తెచ్చిన క్యారెక్టర్ బాహుబలి సినిమాలోని శివగామి. ఈ పాత్రకు ముందుగా బాలీవుడ్ నటి శ్రీదేవిని సంప్రదించారు. అయితే ఆమె భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో ఆ పాత్రో రమ్య చేతికి వచ్చింది.
బాహుబలి సినిమాలో నటించినందుకు గానూ రమ్యకృష్ణ రెండున్నర కోట్లు పారితోషికం అందుకుంది.