సూర్య ఫ్లాప్ సినిమాకి 235 కోట్లు వసూళ్లు.. నిజమా? ఇదేం ట్విస్టు
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సినిమా 235 కోట్లు వసూలు చేసిందని సినిమా టీం ప్రకటించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సూర్య రెట్రో
సూర్య 44వ సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటించింది. జోజు జార్జ్, జయరాం, నాజర్, ప్రకాష్ రాజ్ లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమాలో శ్రేయ ఒక పాటకు డాన్స్ చేసింది. సంగీతం సంతోష్ నారాయణన్. మే 1న విడుదలైంది.
సూర్య కంబాక్ ఇచ్చాడా ?
సూర్య గంగూవా సినిమా ప్లాప్ అవ్వడంతో, రెట్రోతో కంబాక్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ రెట్రో సినిమా అతనికి మంచి కంబ్యాక్ అయ్యిందా అంటే అనుమానమే. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా, వసూళ్లు బాగానే వచ్చాయి. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా మూడు వారాలుగా బాగానే ఆడుతోంది.
రెట్రో వసూళ్లు?
రెట్రో సినిమా మొదటి వారంలోనే 100 కోట్లు వసూలు చేసిందని సినిమా టీం చెప్పింది. ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. 2డి కంపెనీ అఫీషియల్ గా వసూళ్ల గురించి ప్రకటించింది. 235 కోట్లు వసూలు చేసిందని పోస్టర్ లో ఉంది.
235 కోట్లు వసూలు చేసిందా రెట్రో?
దీన్ని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. రెండు వారాల్లోనే థియేటర్స్ నుండి తీసేసిన రెట్రో సినిమా ఎలా 235 కోట్లు వసూలు చేసిందని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఎక్స్ లో ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ని ట్యాగ్ చేసి, విచారణ చేయమని అడుగుతున్నారు. కానీ రెట్రో టీం చెప్పిన వసూళ్లు నిజమే. థియేట్రికల్ కలెక్షన్స్, ఓటిటి, శాటిలైట్, ఆడియో రైట్స్ అన్నీ కలిపి 235 కోట్లు అట. దాన్ని చెప్పకుండా 235 కోట్లు అని చెప్పడంతో నెటిజన్లు కన్ఫ్యూజ్ అయ్యారు. థియేటర్స్ లో 110 కోట్లే వసూలు చేసిందని అంటున్నారు.