- Home
- Entertainment
- శివయ్యా అని పిలిస్తే రారు, మంచు మనోజ్ సెటైర్లు వైరల్.. ఎన్ని జన్మలైనా మోహన్ బాబు కొడుకునే
శివయ్యా అని పిలిస్తే రారు, మంచు మనోజ్ సెటైర్లు వైరల్.. ఎన్ని జన్మలైనా మోహన్ బాబు కొడుకునే
భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ ప్రసంగం హైలైట్ గా నిలిచింది. మంచు మనోజ్ ఎప్పటిలాగే అగ్రెసివ్ గా, ఎమోషనల్ గా మాట్లాడారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
భైరవం మూవీ ట్రైలర్ లాంచ్
మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన భైరవం చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రాధా మోహన్ నిర్మించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ ప్రసంగం హైలైట్ గా నిలిచింది. మంచు మనోజ్ ఎప్పటిలాగే అగ్రెసివ్ గా, ఎమోషనల్ గా మాట్లాడారు.
మంచు మనోజ్ స్పీచ్
ఇటీవల తన కుటుంబంలో జరిగిన వివాదాలు ప్రస్తావిస్తూ మంచు మనోజ్ జ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో మంచు విష్ణు పై చేసిన సెటైరికల్ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చినియాంశంగా మారాయి. ఇంతకీ మంచు మనోజ్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నేను ఇలా స్టేజి ఎక్కి సినిమా ఈవెంట్ లో మాట్లాడి తొమ్మిదేళ్లు అవుతుంది. ఈ గ్యాప్ లో చాలామంది అభిమానులు అన్నా ఒక్క సినిమా చేయి అంటూ రిక్వెస్ట్ చేశారు. మధ్యలో కరోనా పరిస్థితులు, ఇతర కారణాలవల్ల సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
బెదిరించినా భయపడలేదు
ప్రస్తుతం పెయిడ్ మీడియా ప్రమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ నేను ఒక్క రూపాయి ఇవ్వకపోయినప్పటికీ మీడియా నాకు కష్టమైన పరిస్థితుల్లో సపోర్ట్ చేసింది. అందుకు వారికి ధన్యవాదాలు. సోషల్ మీడియాలో అభిమానులంతా సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో నాకు సపోర్ట్ చేసిన వారి ఖాతాలకు స్ట్రైక్ లు పడ్డాయి. కొందరికి బెదిరింపు ఈ మెయిల్స్ పంపించారు అంటూ పరోక్షంగా మంచు విష్ణు గురించి ప్రస్తావించారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడిన అభిమానులు డోంట్ కేర్ అంటూ నా వైపు నిలబడ్డారు.. అది చాలు ఈ జన్మకు అంటూ మనోజ్ ఎమోషనల్ అయ్యారు.
శివయ్యా అని పిలిస్తే రారు, మంచు విష్ణుపై సెటైర్
శివుడిని శివయ్యా అని పిలిస్తే రారు అంటూ కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు డైలాగ్ పై మనోజ్ సెటైర్లు వేశారు. శివుడిని మనసారా తలుచుకుంటేనే వస్తారు. దర్శకులు, నిర్మాతలు, అభిమానుల రూపంలోనే శివుడు వస్తాడు అని మనోజ్ తెలిపారు. బెల్లంకొండ శ్రీనివాస్ నాకు తమ్ముడు లాంటివాడు. ఒక అన్నయ్యగా శ్రీనివాస్ కి జీవితాంతం తోడుంటా. నారా రోహిత్ గురించి ఏం చెప్పాలి.. అతడు నా ప్రాణ మిత్రుడు. నేను చివరగా నటించిన ఒక్కడు మిగిలాడు చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చింది అతడే. ఇప్పుడు అతనితో నటించిన చిత్రంతోనే రీఎంట్రీ ఇస్తున్నా అని మనోజ్ గుర్తు చేసుకున్నారు.
ఎన్ని జన్మలైనా మోహన్ బాబు కొడుకునే
ఈ మధ్యన ఎన్నో ఇబ్బందులకు గురయ్యా. కట్టుబట్టలతో నన్ను బయట నిలబెట్టారు. నా కార్లు కూడా లాగేసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎవరి మీద కోపం రావట్లేదు. కానీ బాధగా ఉంది. ఏం జరిగినా ఎన్ని జన్మలైనా నేను మోహన్ బాబు కొడుకునే అది ఎవరూ మార్చలేరు అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు.