సింగర్ సునీత సెకండ్ మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ వైరల్
సింగర్ సునీత రెండో వివాహం చేసుకుంటుంది. ఆమె ఓ ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనిని సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుంది. ఈ రోజు(శనివారం) రాత్రి వీరి వివాహ వేడుక జరుగనుంది. తాజాగా సునీత తన మెహందీ ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
సునీత.. మొదటి భర్త కిరణ్తో ఏర్పడిన బేధాభిప్రాయాలతో ఆయనకు విడాకులు ఇచ్చారు. కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉన్న సునీత్ ఇటీవల రెండో వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. దీంతో సునీత రెండో పెళ్లి వార్త టాలీవుడ్ హల్చల్ చేసింది.
ఈనెల 9న తన మ్యారేజ్ జరగబోతుందని ఆ మధ్య తిరుమల వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. ఈ రోజు రాత్రి అంటే ఈ శనివారం రాత్రి సునీత మ్యారేజ్ రామ్తో సింపుల్గా జరగనుంది. ఈ సందర్భంగా సునీత్ మ్యారేజ్ ఫోటోలను పంచుకుంది.
మెహందీ ఫోటోలను, అలాగే ప్రీ వెడ్డింగ్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది సునీత. ఇందులో మొఖానికి పసుపు రాసుకుని తన పిల్లలతో ఉంది.
తన కుమారుడు ఆకాష్, కుమార్తె శ్రియాలతో ఆనందంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఇద్దరు పిల్లలు తల్లి సునీతకి ఆప్యాయంగా ముద్దు పెట్టడం హైలైట్గా నిలిచింది.
ఈ సందర్భంగా సునీత్ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. థ్యాంక్యూ గాడ్ అని పేర్కొన్నారు. మరికాసేపట్లో సునీత్ పెళ్లి పీఠలెక్కబోతుందని చెప్పొచ్చు.
ఈ పెళ్లి వేడుక వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శ్రీరామచంద్రస్వామి గుళ్లో జరుగనుంది. ఇందులో కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొంటారని టాక్.
ఇదిలా ఉంటే ఇప్పటికే తమ మ్యూజిక్ డిపార్ట్ మెంట్ వారికి, పలువురు సినీ ప్రముఖులకు సునీత ప్రత్యేకంగా ప్రీ వెడ్డింగ్ పార్టీ కూడా ఇచ్చారు.