చిరంజీవి, ఎన్టీఆర్, రామ్చరణ్, రాజమౌళిలపై శృతి హాసన్ సెటైర్లు
టాలీవుడ్, కోలీవుడ్ హాట్ హీరోయిన్ శృతి హాసన్ ఇటీవల ఎప్పటికప్పుడు నెటిజన్లకి దగ్గరగా ఉంటూ సందడి చేస్తుంది. తన ప్రతి భావాన్ని పంచుకుంటోంది.
హాట్.. హాట్.. అందాలతో నెటిజన్లలో, ఆడియెన్స్ లో హీటు పుట్టించే శృతి హాసన్ తాజాగా తనకు ఒంటరితనం ఇష్టమని చెబుతోంది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01ejzd145cmgywbv81tx0p0h7m/119737541-618645489016924-6421372331654444416-n-jpg_300x300xt.jpg)
లాక్డౌన్ టైమ్లో హోం క్వారంటైన్లో ఉంటూ చాలా జాగ్రత్తలు పాటించింది. కరోనా విజృంభిస్తున్న వేళ ముంబయిలో హో ఐసోలేషన్లో ఉండిపోయింది.
అయితే తనకు ఒంటరిగా ఉండటమే ఇష్టమట. ఇది కొత్త కాదని చెప్పింది.
తాజాగా శృతి చెబుతూ, ఒంటరిగా ఉండటం భయమని చాలా మంది అంటుంటారు. కొన్నేళ్ళుగా నేను ఒంటరిగానే ఉంటున్నాన`ని తెలిపింది.
ఇంకా చెబుతూ, `చెన్నైకి ఎప్పుడు వచ్చినా డాడీ కమల్ హాసన్ని కలుస్తుంటా. ఆ తర్వాత ఒంటరిగానే ఉంటా` అన్నది.
`ఒంటరితనం నాకెంతో ఇష్టం. వంట చేయడం, ఇంటినిశుభ్రం చేయడం, బట్టలు ఉతకడం వంటి అన్ని పనులు నేనే స్వయంగా చేసుకుంటా` అని చెప్పింది.
`సెలబ్రిటీలు వంట పాత్రలు కడుగుతారా?` అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. లాక్డౌన్ సమయంలో `వంటపాత్రలు కడిగే పోటీలో పాల్గొంటారా?` అని కొందరు సవాల్ విసిరారు. వంట పాత్రలు కడగటం, ఇంటిని శుభ్రపరచడం ఒక సవాలా? ఆ పనులు అందరూ చేయాల్సిందే` అని తెలిపింది.
పరోక్షంగా రాజమౌళి, ఎన్టీఆర్, చిరంజీవి, రామ్చరణ్ వంటి స్టార్స్ కి చురకలంటించింది. వీరింతా `బీ ద ఛాలెంజ్` పేరుతో ఛాలెంజ్ నిర్వహించిన విషయం తెలిసిందే. వారిపై సెటైర్లు వేసింది. మరి శృతి వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.
లాక్డౌన్ సమయంలో తాను ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని చెబుతూ ఇటీవల ఓ వీడియోని పంచుకుంది శృతి. దీనికి మంచి స్పందన లభించింది.
ఇక సొంతంగా ఓ వీడియో ఆల్బమ్ సాంగ్ని విడుదల చేసింది. ఇది విశేషంగా ఆకట్టుకుంది.
రెండేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన `క్రాక్` చిత్రంలో నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధమవుతుంది.
దీంతోపాటు పవన్ కళ్యాణ్ సరసన `వకీల్సాబ్`లో నటించబోతున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు తమిళంలో `లాభం`చిత్రంలో విజయ్ సేతుపతి సరసన రొమాన్స్ చేస్తుంది.