డ్రగ్స్ కేసులో రియా స్టేట్మెంట్... ముంబై నుంచి వెళ్లిపోయిన సల్మాన్ ఫ్యామిలీ
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ అయిన దగ్గర నుంచి రోజుకో సంచనల విషయం తెర మీదకు వస్తోంది. రియా స్టేట్మెంట్లో పలువురు సినీ తారలకు డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రకుల్, సారా అలీ ఖాన్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ కుటుంబమంతా ఒకేసారి ముంబై విడిచి వెళ్లటం ఆసక్తికరంగా మారింది.
తాాజాగా సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ ఫోటోలు సోషల్ మీడియా వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో అర్పిత తన పిల్లలతో కలిసి ముంబై ఎయిర్పోర్ట్లో ప్రయాణానికి సిద్దమవుతోంది. ఆమెతో పాటు సల్మాన్ సోదరుడు సోహెల్ ఖాన్, తల్లి సల్మా కూడా ఉన్నారు.
విమానాయశ్రయంలో సల్మాన్ కుటుంబ సభ్యులను చూసిన ప్రజలు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రియాకు సల్మాన్ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు రియా పోలీసులు అదుపులో ఉన్న సమయంలో సల్మాన్ ఫ్యామిలీ అంతా మరో ప్రాంతానికి వెళ్లటం చర్చనీయాంశం అయ్యింది.
వీటితో పాటు రియా, అర్పితా ఖాన్లు కలిసి దిగిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రియా, అర్పితల ఫోటోలు వైరల్ కావటంతో సుశాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో సల్మాన్ ఫ్యామిలీ అంతా ముంబై విడిచివెళ్లటంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో పెద్దవారని కూడా తీసుకొని ఇలా వెళ్లటం వితంగా ఉందంటున్నారు.
సల్మాన్ కుటుంబం నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కు భయపడుతుందంటున్నారు నెటిజెన్లు. అందుకే ముంబై విడిచి ఫ్యామిలీ అంతా పారిపోయిందని ఆరోపిస్తున్నారు.
మరో నెటిజెన్ కామెంట్ చేస్తూ మీరు ఎక్కడికి వెళ్లిన ఖర్మ మిమ్మల్ని విడిచిపెట్టదు అంటూ కామెంట్ చేశాడు.
ఇప్పటికే రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో సారా అలీఖాన్, రకుల్, సిమోన్ ఖంబతా, ముఖేష్ చబ్రా లాంటి వారి పేర్లు చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు త్వరలో ఎన్సీబీ కరణ్ జోహర్ను విచారించేందుకు సిద్దమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.