న్యూ ఈయర్ వేళ నేషనల్ క్రష్ జోష్ చూశారా? ఫ్యాన్స్ కు గుర్తుండిపోయేలా విష్ చేసిన రష్మిక మందన్న!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న Rashmika mandanna తన అభిమానులకు న్యూ ఈయర్ విషెస్ తెలుపుతూ క్యూట్ వీడియోను పంచుకుంది. లేడీ పిల్లలా గెంతుతూ తన ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు తెలిపింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రష్మిక మందన్న మంచి గుర్తింపు పొందింది. ‘పుష్ప’ మూవీతో ఏకంగా నేషనల్ క్రష్ గా మారిపోయింది. దీంతో అటు బాలీవుడ్ లోనూ బిజీ అయ్యింది. వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hk2h15kd98z0tawcthher428/rashmika--6--jpg_300x439xt.jpg)
సినిమాలతో బిజీగా ఉంటూనే రష్మిక మందన్న తన అభిమానులకు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటోంది. నిన్న ఏడేళ్ల సినీ ప్రయాణాన్నిగుర్తు చేసుకుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా న్యూ ఈయర్ సెలబ్రేషన్స్ జరిగిన సందర్భంగా నేషనల్ క్రష్ కూడా కొత్త సంవత్సరపు వేడులకు గ్రాండ్ గా జరుపుకుంది. ఓ రీసార్ట్ లో రిలాక్స్ వేడుకజరుపుకున్న రష్మిక మందన్న వీడియో రూపకంలో అభిమానులకు న్యూ ఈయర్ విషెస్ తెలియజేసింది.
పొట్టి డ్రెస్ లో ఇన్నర్ రోడ్డుపై లేడీపిల్లలా గెంతుతూ ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు తెలిపింది. అయితే 2023లో బాలీవుడ్ ఫిల్మ్ ‘యానిమల్’తో రష్మిక మందన్న బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈయర్ ఎండింగ్ లో సక్సెస్ రావడం ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇక ఈ ఏడాది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తున్న Pushpa 2 The Rule కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న రాబోతుండటంతో మరో హిట్ తన ఖాతా జమైనట్టేనని భావిస్తున్నారు. ఈ క్రమంలో రష్మిక మందన్న జోష్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇక రష్మిక మందన్న ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘చావ’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇవన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.