జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్' లో రష్మిక ఐటమ్ సాంగ్.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, జూ. ఎన్టీఆర్ నటించిన 'డ్రాగన్' సినిమాలోని ఒక ప్రత్యేక గీతంలో నటి రష్మిక మందన్న నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే రష్మిక మందన్నతో చర్చలు జరిపినట్లు సమాచారం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
స్టార్ నటీమణులు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నర్తించడం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఈ కోవలో రష్మిక మందన్న కూడా చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, జూ. ఎన్టీఆర్ నటించిన 'డ్రాగన్' సినిమాలోని ఒక ప్రత్యేక గీతంలో నటి రష్మిక మందన్న నటించనున్నట్లు, ఈ విషయమై ఇప్పటికే రష్మిక మందన్నతో చర్చలు జరిపినట్లు సమాచారం.
జూ.ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా బెంగాల్ నేపథ్యంలో ఉంటుందట. 1960 నాటి కథ కావచ్చు. నక్సలైట్లు పుట్టకముందు బెంగాల్ రాజకీయాలను చూపించేలా సినిమా ఉంటుందట.
జూ.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేస్తారట. ఇందులో ఎంత నిజముందో చూడాలి. తారక్ 'దేవర' సినిమాతో వచ్చారు.
కొన్ని రోజులుగా డ్రాగన్ సినిమా షూటింగ్ కుముటా దగ్గర జరుగుతోంది. క్లైమాక్స్, రెండు పాటల చిత్రీకరణ కూడా ఇక్కడే జరుగుతుందని సమాచారం. సినిమాకి భువన్ గౌడ ఛాయాగ్రహణం, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.