4000 కోట్ల సినిమా ఫస్ట్ స్క్రీనింగ్.. రామాయణం ఫస్ట్ రివ్యూ VFX పై టాక్ ఇదే
డైరెక్టర్ నితేశ్ తివారీ 'రామాయణం పార్ట్ 1' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా చెబుతున్న ఈ సినిమా 2026 అక్టోబర్లో రిలీజ్ కానుంది. రిలీజ్ కు ముందే ఈ సినిమా టెస్ట్ స్క్రీనింగ్ జరిగింది.

లాస్ ఏంజిల్స్లో 'రామాయణం' ఫస్ట్ కట్
రిపోర్టుల ప్రకారం, 'రామాయణం పార్ట్ 1' మొదటి టెస్ట్ స్క్రీనింగ్ను ఫిబ్రవరి 23న లాస్ ఏంజిల్స్లోని సినెమార్క్ ప్లాయా విస్టాలో నిర్వహించారు. 18 నుంచి 60 ఏళ్ల వయసున్న ప్రేక్షకులు ఈ ఫస్ట్ కట్ చూశారు. పోస్ట్-ప్రొడక్షన్ పనులకు ఫీడ్బ్యాక్ కోసమే ఈ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.
రామాయణం ఫస్ట్ రివ్యూ
ఈ సినిమా చూసిన వారి నుంచి వచ్చిన ఫస్ట్ రియాక్షన్ చాలా పాజిటివ్గా ఉంది. సినిమా స్కేల్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, కథను చెప్పిన విధానంపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. అయితే ఇది కేవలం ఫస్ట్ కట్ మాత్రమేనని, రాబోయే నెలల్లో దీన్ని మరింత మెరుగుపరుస్తారని సమాచారం.
రామాయణం లో ఎవరెవరు నటిస్తున్నారంటే?
ఈ పౌరాణిక చిత్రంలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. వీరితో పాటు రావణుడిగా కన్నడ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే వంటి ప్రముఖ నటులు కనిపించనున్నారు.
'రామాయణం' VFX, మ్యూజిక్లో ఇంటర్నేషనల్ టచ్
ఈ సినిమా వీఎఫ్ఎక్స్ బాధ్యతలను 8 సార్లు ఆస్కార్ గెలుచుకున్న DNEG కంపెనీ చూసుకుంటోంది. ఈ సంస్థ గతంలో 'డ్యూన్', 'ఇంటర్స్టెల్లార్' వంటి చిత్రాలకు పనిచేసింది. హన్స్ జిమ్మెర్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాకు గ్లోబల్ అప్పీల్ వచ్చింది.
2026 దీపావళికి మొదటి పార్ట్ రిలీజ్
ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. రిపోర్టుల ప్రకారం, ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.1600 కోట్ల నుంచి రూ.4000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.

