ప్రతి మెరుపు సంతోషాలనివ్వాలి.. రకుల్ దివాళి స్పెషల్ లుక్.. చూస్తే మతిపోవాల్సిందే!
రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ టాప్ హీరోయిన్లో ఒకరు. కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటి వరకు బలమైన పాత్రల్లో కనిపించింది లేదు. గ్లామర్ పాత్రలతో మెప్పిస్తున్న ఈ సెక్సీ బ్యూటీ దీపావళి సెలబ్రేట్ చేసుకుంది. విద్యుత్ కాంతి దీపాల్లో ఫోటోలకు పోజులిచి మతిపోగొడుతుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ దీపావళి పండుగు సెలబ్రేషన్లో పాల్గొని సందడి చేసింది. ఫోటోలకు పోజులివ్వడంతోపాటు వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
ప్రస్తుతం ఆయా ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓ కొత్త రకుల్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. దీపావళి మొత్తం రకుల్ అందంలోనే దాగుందనేలా ఉంది.
ఈ సందర్భంగా తన అభిమానులకు, ప్రేక్షకులకు దివాళి శుభాకాంక్షలు తెలిపింది. ప్రతి మెరుపు సంతోషాలని ఇవ్వాలని కోరుకుంది.
టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్స్ తో రొమాన్స్ చేసింది రకుల్. గత రెండేళ్ళ క్రితం వరకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రకుల్ అనే చెప్పాలి.
స్టార్ హీరోలకు ఫస్ట్ ఆప్షన్ తనే అనేలా నిలిచింది. సమంత, కాజల్, తమన్నా, అనుష్క వంటి హీరోయిన్లని సైతం పక్కకు నెట్టేసింది.
ఒకానొక దశలో ఇతర హీరోయిన్లు రకుల్ని చూసి కుళ్లుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ గ్లామర్ మీదే ఆధారపడితే లాంగ్ టర్మ్ కెరీర్ ఉండదు.
ఇది తెలియడానికి రకుల్కి ఎక్కువ రోజులు పట్టలేదు. ఇప్పుడు ఈ అమ్మడి క్రేజ్, అవకాశాలు క్రమంగా తగ్గాయి. యంగ్ హీరోలతో తప్ప పెద్ద హీరోలతో సినిమాలు రావడం లేదు.
ప్రస్తుతం రకుల్ `ఇండియన్ 2`, నితిన్ `చెక్` చిత్రాల్లో నటిస్తుంది. హిందీలో అర్జున్ కపూర్తో ఓ సినిమా, అలాగే మరో సినిమాకి సైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల దివాళి సందర్భంగా ఓ మేగజీన్కి పోజులిచ్చి మెస్మరైజ్ చేసింది రకుల్.