ఇంటికి చేరుకున్న రజనీకాంత్.. బొట్టు పెట్టి ఆహ్వానించిన భార్య లత
రజనీ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. మూడు రోజులపాటు కొనసాగిన ఆందోళన తగ్గిపోయింది. రజనీకాంత్ అనారోగ్యం నుంచి కోలుకోవడమే కాదు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆయనకు బొట్టు పెట్టి ఇంట్లోకి స్వాగతం పలికింది భార్య లతా రజనీకాంత్. అభిమానుల ప్రార్థనలు ఫలించాయి.
రజనీకాంత్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అతని కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఆయన వెంటే ఉంది. ఇంటికి చేరే వరకు ఆమె దగ్గరుండి తీసుకెళ్ళింది.
ఇక ఇంటికి చేరుకున్నారు తలైవా. భర్తకి తనదైన స్టయిల్లో ఇంట్లోకి ఆహ్వానించింది రజనీ భార్య లతా. కోలుకుని వచ్చిన భర్తని చూసిన ఆనందంలో సాంప్రదాయం ప్రకారం నుదుటి బొట్టు పెట్టి స్వాగతం పలికింది లతా రజనీకాంత్.
ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. రజనీ అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ తలైవా రిటర్న్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
మరోవైపు ఇంటికి చేరుకున్న రజనీ తన ఇంటికి వచ్చిన అభిమానులకు అభివాదం చెప్పారు. తాను సురక్షితంగా ఉన్నట్టు సందేశాన్ని తెలియజేశారు.
రజనీకాంత్ `అన్నాత్తే` షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చారు రజనీ. శివ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరిగింది. చిత్ర బృందంలో ఎనిమిది మందికి కరోనా సోకింది. దీంతో వెంటనే షూటింగ్ని నిలిపివేశారు.
చిత్రీకరణ ఆగిపోవడంతో తిరిగి చెన్నైకి వెళ్లిపోవాలనుకున్నారు రజనీ. ఇంతలో అస్వస్థతకి గురయ్యారు. బ్లడ్ ప్రెజర్ పెరగడంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. బీపీ తగ్గించేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు. చెన్నైకి చెందిన తన వ్యక్తిగత డాక్టర్లు కూడా హైదరాబాద్కి చేరుకున్నారు. మూడు రోజుల ఉత్కంఠకి తెరదించుతూ నిన్న మధ్యాహ్నాం ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. వారం రోజులపాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని తెలిపారు.
ఇదిలా ఉంటే కొత్త సంవత్సరాన్నిపురస్కరించుకుని తన అభిమానులకు పెద్ద ట్రీట్ ఇవ్వబోతున్నారు రజనీ. తాను ప్రారంభించబోతున్న రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారట.
కరోనా, తన అనారోగ్యం కారణంగా డిసెంబర్ 31న ఆయన వీడియో ద్వారా పార్టీ పేరుని ప్రకటించే అవకాశం ఉందని టాక్. పార్టీ పేరు `మక్కల్ సేవై కట్చి` అనేపేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే గురు `ఆటో` అనుకుంటున్నారట.