విడిపోవడం ఈజీ కాదు.. కానీ తప్పేలా లేదుః `పింక్`బ్యూటీ కీర్తి కుల్హరి ఎమోషనల్ నోట్
`పింక్` భామ కీర్తికుల్హరి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 1న(గురువారం) ఈ విషయాన్ని వెల్లడించింది. కలిసి ఉండటం కంటే విడిపోవడం చాలా కష్టమని, కానీ బ్రేకప్ చెప్పుకోవడం తప్పేలా లేదన్నారు. తాజాగా ఆమె పంచుకున్న ఎమోషనల్ నోట్ వైరల్ అవుతుంది.
బాలీవుడ్లో యంగ్ హీరోయిన్గా రాణిస్తుంది కీర్తి కుల్హరి. అడపాదడపా సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ కమర్షియల్గా అంతగా పేరు రాబట్టుకోలేకపోయింది. సోలో హీరోయిన్గా తనకు పెద్ద హిట్స్ పడలేదు.
అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో నటించిన `పింక్` చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇందులో తాప్సీ, ఆండ్రియాలతో కలిసి నటించింది. తాప్సీ తర్వాత ఆ స్థాయి పేరుని కీర్తి రాబ్టట్టుకుంది.
ఓ వైపు పెళ్లైన తర్వాత కూడా సినిమాలు చేస్తూ హీరోయిన్గా, కీలక పాత్రల్లో నటిస్తున్న కీర్తి ఏప్రిల్ 1న అభిమానులకు షాక్ ఇచ్చింది. గురువారం తాను తన భర్త సాహిల్ సెహగల్తో విడిపోతున్నట్టు పేర్కొంది. అంతేకాదు, విడిపోయాక అతడి ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు పేర్కొంది.
ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది.`నేను, నా భర్త సాహిల్ విడిపోవాలని నిశ్చయించుకున్నాం. ఇది రాత పూర్వకంగా కాదు, కానీ జీవితంలో మాత్రం ఎవరి దారి వారు చూసుకోవాలని ఓ నిర్ణయానికొచ్చాం. కలిసి ఉండాలనుకోవడం కన్నా విడిపోవడం చాలా కష్టం.
ఎందుకంటే కలిసి జీవించినప్పుడు అందరూ దాన్ని సాదరంగా ఆహ్వానిస్తారు. కానీ విడిపోవడాన్ని ఎవరూ అంగీకరించకపోగా చాలామందిని అది బాధిస్తుంది. బ్రేకప్ చెప్పుకోవడమూ అంత ఈజీ ఏమీ కాదు. కానీ తప్పడం లేదు.
ప్రస్తుతం నేను ఓ మంచి ప్రదేశంలోనే ఉన్నాను. దయచేసి దీని గురించి ఎవరూ కామెంట్ చేయొద్దు. ఇప్పటికీ, ఎప్పటికీ కూడా!` అంటూ చేతులు జోడించిన ఎమోజీని పోస్ట్ చేసింది.
ఇదిలా ఉంటే దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఏప్రిల్ 1న మమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేయడం లేదు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు విచారం వ్యక్తం చేస్తున్నారు. కీర్తి నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మొత్తంగా కీర్తి పోస్ట్ అనేక అనుమానాలకు తావిస్తుంది.
ఎందుకంటే ఇది పోస్ట్ చేయడానికి కొన్ని గంటల ముందే చిన్న పాపతో సాహిల్ ఆడుకుంటున్నట్టుగా ఓ వీడియో పోస్ట్ చేశారు. మరి అంతలోనే ఇలా జరిగిందా అని అంటున్నారు.
కీర్తి కుల్హరి 2016 జూన్లో సాహిల్ను మ్యారేజ్ చేసుకుంది. సినిమాల్లో నటించేందుకు తన భర్త ఎప్పుడూ ప్రోత్సహించేవాడని ఆ మధ్య ఇంటర్వ్యూల్లోనూ పేర్కొంది.
ముంబయికి చెందిన కీర్తి కుల్హరి.. `పింక్`, `ఇందు సర్కార్`, `బ్లాక్మెయిల్`, `ఉరి: ద సర్జికల్ స్ట్రైక్`, `మిషన్ మంగళ్` వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది.
ఈ మధ్యే నెట్ఫ్లిక్స్లో రిలీజైన `ద గర్ల్ ఆన్ ద ట్రైన్`లోనూ కీలక పాత్రలో కనిపించింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారమవుతోన్న `క్రిమినల్ జస్టిస్` అనే వెబ్ సిరీస్లోనూ ముఖ్య పాత్ర పోషించింది కీర్తి కుల్హరి.