ఎన్టీఆర్ సరికొత్త సునామీ ఆరంభం.. ప్రశాంత్ నీల్తో సినిమా ఫస్ట్ రోజే సంచలనం
Ntr-Neel Shooting: ఎన్టీఆర్ మొన్నటి వరకు `వార్ 2` చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇప్పుడు మరో సినిమాని షురూ చేశారు. సరికొత్త సునామీకి తెరలేపారు. ఆ కథేంటో ఇందులో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Ntr-Neel movie
Ntr-Neel Shooting: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. కొత్త సినిమా ప్రారంభించనున్నారు. ప్రశాంత్ నీల్తో చేయబోతున్న సినిమా నేడు(ఫిబ్రవరి 20)న ప్రారంభమయ్యింది. మరో సంచలనానికి తెరలేపారు. ఆయన ప్రశాంత్ నీల్తో నటించబోతున్న సినిమాకి భారీ స్థాయిలో ప్రారంభం అయ్యింది.
Ntr-Neel movie
ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అవుతుంది. ఈ మూవీ కోసం అక్కడ ప్రత్యేకమైన సెట్ వేసినట్టు తెలుస్తుంది. దాదాపు పది, పదిహేను రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. అయితే ఫస్ట్ డేనే భారీ స్థాయిలో యాక్షన్ సీన్లని చిత్రీకరణ చేయబోతున్నారు. సుమారు 1500 మంది జూ ఆర్టిస్ట్ లు ఇందులో పాల్గొంటారని సమాచారం. మొదటి రోజే ఓ భారీ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట.
Ntr-Neel movie
ఈ వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక సునామీ మొదలు అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ అంటే మాస్ యాక్షన్ మూవీస్ కి కేరాఫ్. `కేజీఎఫ్`, `సలార్`తో తానేంటో నిరూపించారు. సరైన మాస్ హీరో పడితే ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడు, ఎలాంటి సినిమాని తీస్తారో చూపించారు. ఇప్పుడు వాటిని మించి ఆయన ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గత చిత్రాలను మించి భారీ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా ఇది తెరకెక్కబోతుందని తెలుస్తుంది.
Ntr-Neel movie
ఇక ఎన్టీఆర్ గతేడాది `దేవర` చిత్రంతో హిట్ అందుకున్నాడు. మొన్నటి వరకు బాలీవుడ్ మూవీ `వార్ 2`లో నటించాడు. ఆ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు `ఎన్టీఆర్-నీల్` ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు ఎన్టీఆర్. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత కొంతగ్యాప్ ఇచ్చి మళ్లీ కంటిన్యూగా సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇందులో హీరోయిన్ కన్నడ భామ రుక్మిణీ వసంత్ ఎంపికైనట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.
also read: అనుష్క శెట్టి నటించిన ఏకైక సీరియల్ ఏంటో తెలుసా? అస్సలు ఊహించరు.. అంతా నాగార్జున, రాజమౌళి పుణ్యమే!