డ్రగ్స్ కేసులో నమ్రత?: ఎన్టీఆర్-మహేష్ మధ్య ఫ్యాన్ వార్.
సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసింది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతకు పరిచయాలున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు రావడం జరిగింది. కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ ఇండియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అరెస్ట్ నమ్రత, డ్రగ్ అడిక్ట్ నమ్రత అనే యాష్ ట్యాగ్స్ తో భారీగా ట్రెండ్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసింది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతకు పరిచయాలున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు రావడం జరిగింది. నార్కోటిక్ అధికారుల విచారణలో పాల్గొంటున్న జయ సాహా నమ్రత పేరు ప్రస్తావించినట్లు జాతీయ మీడియా కథనాల సారాంశం.
కాగా ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నమ్రతపై విరుచుకు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అరెస్ట్ నమ్రత, డ్రగ్ అడిక్ట్ నమ్రత అనే యాష్ ట్యాగ్స్ తో భారీగా ట్రెండ్ చేస్తున్నారు. అలాగే మహేష్ ని ఈ విషయంపై స్పదించాలని కోరుతున్నారు. నమ్రత విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం గతంలో జరిగిన ఒక సంఘటనే.
కొద్దినెలల క్రితం హీరోయిన్ మీరా చోప్రా ఎన్టీఆర్ అభిమానులపై సైబర్ క్రైమ్ కేసుపెట్టింది. ఓ నెటిజెన్ ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పాలని అడుగగా , అతని గురించి నాకు పెద్దగా ఏమి తెలియదు, అందుకే ఏమీ మాట్లాడలేను అని ఆమె అన్నారు. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర కోపానికి గురికావడంతో పాటు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వివాదం విషయంలో ఎన్టీఆర్ ని మరియు ఆయన ఫ్యాన్స్ ని మహేష్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ పరువు పోయిందని మహేష్ అభిమానులు ఎద్దేవా చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం మారిన డ్రగ్స్ కేసులో నమ్రత పేరు రావడంతో ఎన్టీఆర్ అభిమానులకు రివేంజ్ తీర్చుకొనే అవకాశం దొరికినట్లు అయ్యింది. మహేష్ మరియు నమ్రతలను ట్రోల్ చేస్తూ ఫ్యాన్ వార్ మొదలుపెట్టారు. నిజానికి టాలీవుడ్ లో మహేష్-ఎన్టీఆర్ మంచి మిత్రులుగా ఉన్నారు.