Prema Entha Madhuram: పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆర్య.. పిచ్చివాడైపోతున్న నీరజ్!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ప్రత్యర్థుల కుట్రకి బలైన ఒక బిజినెస్ మాగ్నెట్ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో కోర్టు బయటకు వచ్చిన ఆర్య దగ్గర ఇంటర్వ్యూ కి సిద్ధమవుతుంది మీడియా. కానీ ఆర్య తప్పించుకొని వెహికల్ ఎక్కబోతాడు. అంతలోనే అనువచ్చి అతనిని హాగ్ చేసుకుని మీరు జైలుకు వెళ్లడం ఏంటి? మిమ్మల్ని వదిలి నేను ఉండలేను.. నన్ను కూడా మీతో తీసుకెళ్ళిపోండి అంటుంది. నువ్వు నాతో రావటం కాదు కొద్ది రోజుల్లో నేనే నీ దగ్గరికి వచ్చేస్తాను అంటాడు ఆర్య. కొడుకు జైలుకు వెళుతున్నందుకు శారదమ్మ కూడా బాధపడుతుంది. నీ మీద నేరం ఎందుకు వేసుకున్నావు దాదా తప్పు చేసింది నేను అంటాడు నీరజ్. తప్పు చేసింది నువ్వు కాదు నీరజ్, ఎవరు తప్పు చేశారో నేను తేలుస్తాను..
![article_image2](https://static-ai.asianetnews.com/images/01gygs6evxfjse8ta4frv0gj2p/collage-maker-21-apr-2023-07-38-am-247-jpg_300x171xt.jpg)
నేను కంపెనీ నుంచి బయటికి వచ్చిన తర్వాత మన కంపెనీకి ఎవరెవరు వచ్చింది, ఏ ఏ డీలింగ్స్ జరిగాయి అన్ని డీటెయిల్స్ తీసుకుని జైలు దగ్గరికి రమ్మని జెండే కి చెప్తాడు ఆర్య. తన లెక్కలు ఎక్కడ బయటకు వస్తాయో అని మాన్సీ భయంతో వణికి పోతుంది. అంజలి కూడా బాధపడుతూ ఆర్య కి ధైర్యం చెబుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మదన్ కన్స్ట్రక్షన్ లో చిన్న ప్లాన్ చేంజ్ చేస్తేనే అంత గొడవ చేసావు. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి అంటూ నిలదీస్తాడు. నేను అప్పుడు, ఇప్పుడు ఒకే మాట మాట్లాడుతాను. ఎవరిని మోసం చేయను అంటాడు ఆర్య.
అంజలి కూడా మదన్ ని మందలిస్తుంది. నేను నా లాయర్ తో మాట్లాడాను, తప్పకుండా నా వంతు సహాయం మీకు ఉంటుంది అంటూ ఆర్య కి సపోర్టుగా నిలబడుతుంది అంజలి. మరోవైపు ఇంటికి వచ్చిన తర్వాత మదన్ ని నిలదీస్తుంది అంజలి. నా బిజినెస్ లోకి ఇంటర్ ఫెయిల్ అయితే నేను ఊరుకుంటానా అందుకే అలా చేశాను. ఇంకా ఆర్య బిజినెస్ ఫీల్డ్ లో ఉండడు. ఇంకా నేనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ ని అంటాడు మదన్.
నువ్వు మోసం చేసి గెలిచావు. నీకు ఆర్య సార్ సంగతి పూర్తిగా తెలియదు. నేలకు కొట్టిన బంతిలాగా మళ్లీ పైకి వస్తారు అంటుంది అంజలి. ఆ అవకాశం లేదు. ఆర్య పూర్తిగా కొలాబ్స్ అయిపోయాడు అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మదన్. మరోవైపు ఆర్య ని చంపటం కోసం రౌడీలు ఒక గదిలో రెడీగా ఉంటారు. ఆ గదిలోకి లంచ్ కోసం హరి ని పంపిస్తాడు సెంట్రీ.
భోజనం కోసం గదిలోకి వెళ్లిన ఆర్య, తన మీద ఎటాక్ చేయబోయిన మనుషుల్ని చిదగ్గొడతాడు. అది చూసిన సెంట్రీ భయపడతాడు. ఎవరు నన్ను చంపమన్నారు అని గట్టిగా అడుగుతాడు ఆర్య. తెలియదు సార్ పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి అంటాడు. అంతలోనే ఆ అనామకురాలు సెంట్రీ కి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ ఆర్య మాట్లాడుతాడు.
ఆర్య మాట్లాడుతున్నాడని గ్రహించిన అనామకురాలు నీకు ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయి కంగ్రాట్స్ అంటుంది. నువ్వు ఎవరు? నీకు నాకు ఉన్న వైరం ఏమిటి అని అడుగుతాడు ఆర్య. నీ బిజినెస్ పతనాన్ని, నీ చావుని కోరుకునే మనిషిని. నీకు నాకు ఉన్న వైరం గురించి.. నువ్వు చావుకు సిద్ధంగా ఉన్నప్పుడు చెప్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఆ అనామకురాలు.
ఆర్య జైలుకు వెళ్లడాన్ని భరించలేని నీరజ్ బాగా ఎమోషనల్ అవుతాడు. ఆవేశపడితే సమస్య తీరదు అంటుంది శారదమ్మ. అసలు సమస్య నేను నా వల్లే దాదా ఈరోజు జైల్లో ఉన్నాడు. నేను లూజర్ ని నా అసమర్ధతే దీని అంతటికి కారణం అంటూ మెంటల్ ఇన్ బ్యాలెన్స్ అవుతాడు. నేను ఇంతకీ కారణం మీరు కాదు అంటూ జెండే, నీరజ్ కి ధైర్యం చెప్తాడు. దుఃఖంతో జెండే ని హత్తుకుంటాడు నీరజ్.
అక్కడికి అను వస్తుంది. కానీ గుమ్మం బయటే నించుంటుంది. లోపలికి రమ్మంటుంది శారదమ్మ. ఆయన లేకుండా నేను ఈ ఇంట్లోకి రాలేను. నాకు ఆయనని చూడాలని ఉంది అంటుంది అను. త్వరలోనే వచ్చేస్తాడు మీరేమీ కంగారు పడకండి అంటాడు జెండే. అంతవరకు చూడకుండా ఉండలేను దయచేసి నన్ను ఆయన దగ్గరికి తీసుకు వెళ్ళండి అని జెండేని చేతులు జోడించి ప్రార్థిస్తుంది. ఈ మాత్రానికే అంతలాగా రిక్వెస్ట్ చేయాలా అను తప్పకుండా తీసుకు వెళ్తాను అంటాడు జెండే. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.